బెంగాల్లో రాష్ట్రపతి పాలన?

Publish Date:May 6, 2021

Advertisement

తృణమూల్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ముచ్చటగా మూడవసారి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో అనూహ్యంగా అద్భుత విజయాన్ని సాధించి, హట్రిక్ కొట్టిన ఆమె బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్ ఆమెతో  ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెను అభినందిచారు. మమత బెనర్జీ ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు. అంతేకాదు, ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం, గవర్నర్’తో కలిసి విలేకరుల సమావేసంలో మాట్లాడిన మమతా దీదీ, క్లుప్తంగా, తమ ప్రాధాన్యాలను వివరించారు. కొవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కొని, పరిస్థితిని అదుపులోకి తేవడమే తన ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె సంకేతమాత్రంగానే అయినా,కేంద్రంతో సయోధ్యతను కోరుకుంటున్నట్లు చెప్పారు. కొవిడ్ పై కలిసి పోరాటం సాగిద్దామని అన్నారు. అలాగే.. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత చెలరేగుతున్న రాజకీయ హింసపై ఉక్కుపాదం మోపుతానని, హింసకు పాల్పడుతున్నవారిని వదిలిపెట్టబోనని పేర్కొన్నారు. “ఈ రోజు నుంచి శాంతిభద్రతల బాధ్యత నేనే తీసుకుంటా. దీనిపై కఠినంగా వ్యవహరిస్తా” ఇది నా రెండో ప్రాధాన్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పడానికి అన్ని పార్టీలూ సహకరించాలని కోరారు. 

మరోవంక గవర్నర్ ధన్‌కర్‌, ముఖ్యమంత్రి తమకు సోదరి సమానురాలు అంటూ, ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసను అరికట్టి, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి అవసరమైన అన్ని చర్యలూ దీదీ  తీసుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే, ఇలా తెరమీద కనిపించిన ఆల్ ఈజ్ వెల్, అంతా బాగుంది చిత్రం ఎలాఉన్నా, ఎన్నికల సందర్భంగా ఎగిసిపడిన రాజకీయ విద్వేష, వైషమ్యాలు ఇంకా పుర్తిగా పోలేదు. ఇప్పట్లో సమసి  పోయాయని, పోతాయని ఆశించే పరిస్థితులు కూడా  రాష్ట్రంలో కనిపించడం లేదు. అటు ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమైన కమలనాధులు కుతకుతా ఉడికి పోతున్నారు. మరో వంక, బ్రహ్మాండ విజయం ఇచ్చిన ఉత్సాహంలో, ఒక రకమైన విజయగర్వంలో  మునిగి తేలుతున్నతృణమూల్ నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్ధులను మట్టు పెట్టేందుకు ఇదే మంచి అనువుగా బావించి దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులలో ఇంతవరకు 14 మంది పైగా తమ కార్యకర్తలు హత్యకు గురయ్యారని బీజేపీ ఆరోపిస్తోంది. 

మరో వంక ఇరుపక్షాలు కూడా రాజకీయ వైరాన్ని మరో రూపంలో కొనసాగించే వ్యూహాలను రచిస్తున్నారు. మమత ప్రమాణస్వీకారానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధనకర్’కు ఫోన్ చేసి రాష్ట్రంలో జరుగతున్న హింస పట్ల ఆవేదన వ్యక్త పరిచారు. మరోవంక, మమత ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా ఆ పార్టీ నాయకులు, ‘రాజకీయ హింస అనే విషచక్రం నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుతామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని’ కోలకతాలో ప్రమాణం చేశారు. అదే క్రమమలో నడ్డా ప్రస్తుతం బెంగాల్లో జరుగుతున్న హింసను దేశ విభజన సందర్భంగా హిందువులపై జరిగిన హింసాకాండతో పోల్చడం ద్వారా హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని తృణమూల్ ఆరోపిస్తోంది. 

అదే విధంగా కేంద్ర హోమ్ శాఖ  రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హింసాత్మక సంఘటలపై రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కోరింది. అంతేకాదు, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో, నివేదిక పంపకపోతే, తీవ్ర పరిణామాలు ఉంటాయని హోమ్ శాఖ పేర్కొంది. మరోవంక రాష్ట్రంలో సాగుతున్న హింసపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీజేపీ నేత గౌరవ్‌ భాటియా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘బెంగాల్‌ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. వారిని టీఎంసీ గూండాలు హత్య చేస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగాయి. దుకాణాలను లూటీ చేస్తున్నారు’ అని గౌరవ్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఈ పరిణామాలను గమనిస్తే ఎన్నికల అనంతర హింస ఆసరాగా కమల దళం మమతా బెనర్జీ ప్రభుత్వంపై మరో యుద్దానికి సిద్దమవుతోందనిపిస్తోంది. ఇటు రాజకీయం, న్యాయ పరంగానే కాకుండా కేంద్ర ప్రభుత్వం తనకున్న విశేష అధికారాలను వినియోగించుకుని, మమతా బెనర్జీ ప్రభుత్వానికి ముందరి కాళ్ళకు బంధాలు వేయాలని బీజేపీ వ్యూహ రచన చేస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఇటు పార్టీ ఫిరాయించి గెలిచిన ఎమ్మెల్ల్యేలు మళ్ళీ మాతృ సంస్థ వైపు చూడకుండా చూడడంతో పాటుగా రాష్ట్రంలో వచ్చిన ఊపును మరింత బలోపేతం చేసుకునే లక్ష్యంతో, అదే విధంగా తమ కార్యకర్తలను కాపాడుకునే వ్యూహంతో బీజేపీ ఎన్నికల అనంతర హింసను అస్త్రంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, తృణమూల్ ఆరోపిస్తున్నట్లుగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే దుస్సాహసం మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయక పోవచ్చును. కానీ, ఆర్టికల్ 356 రాష్ట్ర ప్రభుత్వ మెడ మీద కత్తిలా ఉంచి మమత దూకుడుకు కళ్ళే వేసే ప్రయత్నం మాత్రం చేస్తుంది. అయితే, ‘పోరాటమే’  ప్రధాన ఆయుధంగా  రాజకీయాలలో ఎదిగొచ్చిన మమత బెనర్జీ ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు బెదురుతారని, అనుకుంటే, బీజేపీకి మరో మారు శృంగభంగం తప్పదని తృణమూల్ నాయకులు ధీమాగా ఉన్నారు. అయితే ఏది ఎలా ఉన్నా, బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి ఇప్పట్లో చక్కబడే సంకేతాలు ప్రస్తుతానికి అయితే లేవనే చెప్పవచ్చును.

By
en-us Political News

  
ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు.
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
వందే మాతరం గేయానికి ఆమె చేసిన అపచారాన్ని 140 కోట్ల మంది భారతీయులు ఆమెను ఎన్నటికీ క్షమించరన్నారు.  వందేమాతరం గేయానికి చేసిన అపచారానికి ఆ  గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయతో పాటు  40 కోట్ల దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు.
ఎవరైనా సరే పార్టీ గీత దాటి మాట్లాడితే సహించేది లేదు..మహేష్ కుమార్ గౌడ్..!
ధనవంతులు, పలుకుబడి ఉన్న వ్యక్తుల భూములు, ఆస్తులను భూసేకరణ నుండి కాపాడేందుకే యాక్సెస్ రోడ్డును నిబంధలకు విరుద్ధంగా నిర్మించారనీ, ప్రధాన రహదారిలో ఎస్ కర్వ్ ఎందుకు వచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తూ సందేహాలను ప్రేరేపించే ప్రయత్నం వైసీపీ సోషల్ మీడియా ఓ రేంజ్ లో చేసింది.
ఉప ముఖ్యమంత్రి, జనసేనాని  పవన్ కళ్యాణ్  ఈ  కార్యక్రమానికి గైర్హాజరు కావడంపై చర్చ జరుగుతోంది. దీనిని కూటమి పార్టీల మధ్య విభేదాలుగా వైసీపీ సోషల్ మీడియా కలరింగ్ ఇచ్చి ఓ రేంజ్ లో వైరల్ చేస్తోంది.
తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులపై దాడి చేశారనే ఆరోపణలతో పాటు దానికి సంబంధించిన దృశ్యాలు రికార్డై బయటకు వచ్చిన నేపథ్యంలో విరూపాక్షపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల వరకు ప్రస్తుత రాజకీయ చిత్రం ఎంతో ఉత్కంఠభరితంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.