బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన తప్పదా?

Publish Date:Mar 28, 2022

Advertisement

పశ్చిమ బెంగాల్’లో తృణమూల్ పాలనలో శాంతి భద్రతల పరిస్థితి దిన దిన ప్రవర్థమానంగా దిగజారి పోతోంది. దేశంలో ఇప్పుడున్న 29 రాష్ట్ర్లాలలో రాష్ట్రపతి పాలన విధించడానికి అన్ని విధాలా అర్హత, యోగ్యత ఉన రాష్ట్రం ఏదైనా ఉందంటే, అది, మమతా బెనర్జీ ఏలుబడిలోని పశ్చిం బెంగాల్ ఒక్కటే. నిజానికి, గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కూడా  రాష్ట్రంలో రాజకీయ హత్యలు నిత్య కృత్యంగా సాగుతున్నాయి. ప్రతి పక్ష బీజేపీ ఎప్పటినుంచో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదంచాలని కోరుతోంది. నిజానికి బెంగాల్ లో ఎన్నికల అనంతర హింస తాలూకు ఘటనల అంశం చివరకు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. బాధిత కుటుంబాలు దాఖలు చేసిన పిటీషన్’లోనూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బాధితులు కోర్టును కోరారు. 

అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందనే ఆరోపణలు  వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో, కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్’లో రాష్ట్రపతి పాలన విధించేందుకు, రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా, మరో రెండు మూడు మాసాల్లో బెంగాల్’ లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర హోమ్ శాఖ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి, మమతా బెనర్జీకి ముందు నుంచి కూడా బెంగాల్’ హింసకు మారుపేరుగా నిలిచింది. అయితే, గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా,  చెలరేగిన  హింస, రాజకీయ హత్యల పరంపర,రాష్ట్రపతి పాలన అనివార్యతను నొక్కి చెపుతోంది.

ఇంకా ఈనాటికీ కొనసాగుతున్న రాజాకీయ హత్యాల పరంపరలో  కొద్ది రోజుల క్రితం, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన బర్షాల్ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్ భాదు షేక్ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే బోగ్టూయి గ్రామంలో హింస చెలరేగింది. భాదు షేక్ అనుచరులు, ఆయన ప్రత్యర్ధుల ఇళ్ళకు నిప్పు పెట్టారు. పిల్లా పాపలతో సహ, ఎనిమిది మంది సజీవ దహన మయ్యారు.నిజానికి, బెంగాల్లో నిత్యకృత్యంగా జరుగుతున్న హింసకు ఇది పరాకాష్ట కావచ్చును, కానీ, మమతా బెనర్జీ పాలనలో రక్తం చిందని రోజు లేదని, రాజకీయ విశ్లేషకులు పలు సందర్భాలలో పేర్కొన్నారు ఇలాంటి హేయమైన నేరాలు నిత్యకృత్యంగా జరుగుతూనే ఉన్నాయి. గత మే నెలలో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి, రాష్ట్రంలో 37 మంది బీజేపీ పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. గత ఐదేళ్లలో మొత్తం 166 మంది బిజెపి కార్యకర్తలుహత్యకు గురయ్యారని, పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పేర్కొన్నారు.నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని, అంటున్నారు. 

మరోవంక, బీర్భూమ్‌ మారణకాండ నేపధ్యంలో రాష్ట్ర గవర్నర్ జగదీష్ ధన్ ఖర్’ సైతం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా  క్షీణించాయని ఆవేదన వ్యక్త పరిచారు. ఇది ‘అత్యంత భయంకర, అనాగరిక, అప్రజాస్వామిక చర్య’  అని పేర్కొంటూ, గవర్నర్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవంక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ సంఘటనపై వెంటనే నివేదిక పంపమని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

ఓ వంక రాజకీయ హత్యలు హింస కొనసాగుతుంటే, మరో వంక, సిటిజెన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్ (సీఏఏ) అమలులో, రాష్ర్ా ప్రభుత్వం సృష్టిస్తున్న అవరోధాలు, బంగ్లాదేశ్’ నుంచి అక్రమంగా వచ్చి రాష్ట్రంలో స్థిరపడిన రొహింగ్యాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, తద్వారా తలెత్తుతున్న సమస్యల విషయంగానూ, కేంద్ర హోమ్ శాఖ సమాచారన్ని సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్’ లో రాష్ట్రపతి పాలన అనివార్యంగా కనిపిస్తోందని  పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.