అ ఇద్దరి మధ్యనే పోటీ.. ప్రతిపక్షాలకు పరీక్ష!

Publish Date:Jun 30, 2022

Advertisement

రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం  115 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి.అయితే,, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు.

నిజానికి రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపు ఎవరిదో ముందుగానే తెలిసి పోయింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభంలో ఏంటో ఇంతో  అనుమానం ఉన్నా, బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ  గిరిజన మహిళ  ద్రౌపది ముర్మును టం అభ్యర్ధిగా ప్రకటించడంతోనే, అధికార కూటమి అభ్యర్ధి గెలుపు విషయంలో ఉన్న కొద్దిపాటి అనుమనాలు కూడా తొలిగి పోయాయి. ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాకు దేశ రాజకీయాల్లో మంచి పలుకుబడి ఉన్నా, ప్రతిపక్ష పార్టీల మధ్య సయోద్యాత లేక పోవడం ఆయనకు, శాపంగా మారిందని, ఆయనను సమర్ధిస్తున్న పార్టీలు, నాయకులే మధ్యలోనే కాడి వదిలేశారు. 
ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి ఎంపికే ఓ ప్రహసనంగా సాగింది. చివరకు సిన్హా పేరు ఖరారైనా,  ప్రతిపక్ష పార్టీలలో గట్టిగా అయన వెంట నడిచే పార్టీలు ఏవీ, అంటే, ఏవీ కనిపించడం లేదు.

మరోవంక  ఆయన నామినేషన్ విషయంలోనూ పొరపొచ్చాలు బయటకొచ్చాయి.ప్రతిపక్ష  పార్టీల ఉమ్మడి అభ్యర్ధి ఎంపికకు సంబంధించి తొలి అడుగు వేసిన మమతా బెనర్జీ, ఆ తర్వాత ఎందుకో వెనకడుగు వేశారు. నిజానికి యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికయ్యే వరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో, ఆపార్టీ ఉపాధ్యక్షునిగా ఉన్నారు. అయినా, సిన్హా నామినేషన్ కార్యక్రమానికి ఆమె డుమ్మా కొట్టారు. అసలు, ఆయన్ని రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిన, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అధ్యక్షతన జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి కూడా మమతా దీదీ హాజరు కాలేదు. 

అదలా ఉంటే, సిన్హా నామినేషన్ వరకు, కాంగ్రెస్ ఉన్న కూటమితో కలిసేది లేదని, మొత్తం ప్రక్రియకు దూరంగా ఉన్న, తెరాస ఆ తర్వాత  యశ్వత్ సిన్హాకు ఓపెన్ గా మద్దతు ప్రకటించడమే కాకుండా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షడు కేటీఆర్ మందీ మార్బలంతో నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చెట్టాపట్టాలేసుకు తిరిగారు. ఇప్పడు తెలంగాణలో అదొక రాజకీయ దుమారంగా మారింది.

అదలా ఉంటే ఇప్పడు యశ్వత్ సిన్హా  ప్రచార యాత్రలో భాగంగా జులై 2 న హైదరాబాద్ వస్తున్నారు. ఈ సందర్భంగా తెరాస ఆయన తరపున  ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ హాజరు అవుతుందా? లేదా అన్నది రాజకీయ మీమాంసగా మారింది. ఇప్పటికే, కాంగ్రెస్, తెరాస జట్టు కట్టారని  బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించింది. ఇప్పడు, ఆ బురద కడుక్కోవడంలో  రేవంత్ రెడ్డి సతమత మవుతున్నారు.

అదలా ఉంటే, ఇప్పటికే బీజేడీ, జేఎంఎం, బీఎస్పీ ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపతి ముర్ముకు మద్దతు ప్రకటించాయి. ఇప్పడు తాజాగా, జేడీఎస్ కూడా ముర్ముకు మద్దతు ప్రకటించింది. పార్టీ నేత, కర్ణాటక మాజే ముఖ్యమంత్రి కుమార స్వామి ఈ మేరకు ప్రకటన చేశారు. ముర్ము జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడకు ఫోన్ చేసి మద్దతు కోరిన నేపధ్యంలో, ఆమెకు మద్దతు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని  చెప్పారు. ఈ పరిణామాలు అన్నింటినీ గమనిస్తే, ప్రతిపక్షాల ఐక్యత ఎండమావిగానే ఉందని, ప్రతిపక్షాల ఐక్యతకు వేదికగా అవుతుంది ఆనుకున రాష్ట్రపతి ఎన్నిక రాజకీయం, ప్రతిపక్షాల అనైక్యతకు అద్దం పడుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. 

అదలా ఉంటే రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం పూర్తయింది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం  115 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి.అయితే,, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు.దాఖలైన నామినేషన్ పత్రాలలో 
28 నామినేషన్లను వివిధ సాంకేతిక కారణాల వల్ల ప్రాథమిక దశలోనే తిరస్కరించారు. 72 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 87 నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి గురువారం పరిశీలించారు. అందులో నిబంధనల ప్రకారం దాఖలు చేయని 79 నామినేషన్ పత్రాలను తిరస్కరించారు.

రాష్ట్రపతి ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి నామినేషన్‌ను 50 మంది ఓటర్లు ప్రతిపాదించడం, మరో 50 మంది బలపరచడం తప్పనిసరి. ఇంతమంది మద్దతు కూడగట్టడం సామాన్య అభ్యర్థులకు సాధ్యం కాదు కాబట్టి చివరికి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా మాత్రమే బరిలో మిగిలారు. 
జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జులై 18న కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం.. ఓటింగ్ నిర్వహిస్తారు. 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.