Publish Date:Apr 11, 2025
వైసీపీ సీనియర్ నాయకుడు, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై దాడికి ప్రయత్నించిన గోరంట్లతో పాటు ఆయన అనుచరులు ఐదుగురికి గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో మరో వైసీపీ నేత కటకటాల పాలయ్యారు.
Publish Date:Apr 11, 2025
తిరుమల తిరుపతి దేవస్థానంలో తీవ్ర అవకతవకలు పాల్పడి విచారణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు మరో దుష్ప్రచారానికి తెర లేపారు. టీటీడీ గోశాలలో ఇటీవల గోవులు మృతి చెందుతున్నాయంటూ
సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు.
Publish Date:Apr 11, 2025
ఎంకి పెళ్లి సుబ్బు చావుకు వచ్చిందంటారు. ఇప్పుడు విశాఖ మేయర్ విషయంలో వైసీపీ నిర్ణయాలు బొత్స సత్యనారాయణ కు సవాలుగా మారాయి. ఏడాది కాలం కూడా లేని పదవి కోసం పెట్టిన శిబిరాలు ఫలిస్తాయా? ఫలితం రాకపోతే తనకు నష్టం కలుగుతుందా అన్న ఆలోచనలో ఇప్పుడు బొత్స ఉన్నట్టు కనిపిస్తోంది.
Publish Date:Apr 11, 2025
నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి వైఎస్ శిష్యుడిగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఉన్నానంటున్న మాజీ మంత్రి జోగు రమేశ్, సీఐడీ నోటీసులతో భయపెట్టాలని చూస్తే భయపడేది లేదని కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ సీఐడీ విచారణకు శుక్రవారం (ఏప్రిల్ 11) హాజరయ్యారు.
Publish Date:Apr 11, 2025
తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి పార్టీలలో ఒక పార్టీ నేతలపై పొగడ్తల వర్షం కురిపిస్తూ, మరో పార్టీ అధినేతపై విమర్శలు గుప్పించారు. మామూలుగా అయితే రాష్ట్ర విభజన తరువాత నుంచీ బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి.
Publish Date:Apr 11, 2025
మావోయిస్టులు శాంతి చర్చలు జరపడానికి సిద్దమై రెండు వారాలు గడుస్తున్నప్పటి అటు చత్తీస్ గడ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఇంత వరకు స్పందించక పోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రానున్న రోజుల్లో ఎన్ కౌంటర్లకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే మార్చికల్లా నక్సల్ రహిత దేశం తయారు చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Publish Date:Apr 11, 2025
రాజకీయాలకు అలవాటు పడిన నేతలు వాటి నుంచి అంత సులభంగా బయటకు రాలేదు. విజయసాయి రెడ్డి అందుకు మినహాయింపేమీ కాదు. ఇటీవల వైసీపీ పార్టీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి.. ఇక తాను రాజకీయాలకు పూర్తిగా దూరం, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు.
Publish Date:Apr 11, 2025
వైకాపా హాయంలో అప్పటి ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. సిఐడి అధికారులు ఇప్పటికే ఆయనకు నోటీసులు జారి చేశారు. ఈ నోటీసులు అందుకున్న జోగి రమేష్ శుక్రవారం సిఐడి విచారణకు హజరయ్యారు. విజయవాడ తాడి గడపలోని సిఐడి కార్యాలయానికి ఆయన వచ్చారు.
Publish Date:Apr 11, 2025
2008 ముంబై పేలుళ్లకు సూత్రధారి అయిన హుస్సేన్ రానా ఎన్ఐఎన్ అధికారులు విచారణ చేస్తున్నారు. అమెరికా నుండి భారత్ వచ్చిన రానా ను ఎన్ ఐ ఎన్ అధికారులు నిన్న అర్దరాత్రి కోర్టులో ప్రవేశ పెట్టారు.
Publish Date:Apr 11, 2025
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఈ సంవత్సరం అక్టోబర్-నవంబర్ నెలల్లో ఎన్నికలు జరిగవలసి వుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల సన్నాహాలకు శ్రీకారం చుట్టింది. మరోవంక రాజకీయ పార్టీలూ ఎన్నికల పోరుకు సిద్దమవుతున్నాయి.
Publish Date:Apr 11, 2025
మాతృదేవో భవ , పితృదేవో భవ తర్వాతి స్థానం ఆచార్య దేవో భవ అని అంటాం. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఓ ఉపాధ్యాయురాలు విచక్షణ కోల్పోయింది.
Publish Date:Apr 11, 2025
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. మూల్యాంకనం, రీ వెరిఫికేషన్, కంప్యూటరీకరణ ప్రక్రియలు పూర్తి కావడంతో ఫలితాలను శనివారం (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.
Publish Date:Apr 11, 2025
హిందూపురం మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు గోరంట్ల మాధవ్ పై మరో కేసు నమోదైంది. మంత్రి నారా లోకేష్ పై గురువారం (ఏప్రిల్ 10) గోరంట్ల మాధవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకులు తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.