బీజేపీ అజెండా అమలు దిశగా కీలక ముందడుగు

Publish Date:Apr 5, 2025

Advertisement

ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండా అమలు విషయంలో చాల పట్టుదలగా ఉంది. భాగస్వామ్య పార్టీలపై తనదైన ముద్ర వేస్తూ  మోడీ సర్కార్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అజెండా అమలు దిశగా ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్నది. అందులో భాగంగానే వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదాన్ని పొందింది.  వక్ఫ్ వ్యవస్థ లో పారదర్శకత, జవాబుదారీతనం లోపించడం వల్లే వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చామని స్వయంగా ప్రధాని మోడీయే ప్రకటించారు. లోక్ సభ, రాజ్యసభలలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించడం కీలక పరిణామమనీ,ఈ బిల్లు ఆమోదంతో సామాన్య ముస్లింలకు మేలు చేకూరుతుందనీ మోడీ నమ్మకంగా చెబుతున్నారు.  కాంగ్రెస్,ఇతర ప్రతిపక్షాలు,ముస్లిం వర్గాల నిరసనల మధ్య పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందింది.

లోక్ సభలో 288-232 గా,రాజ్యసభలో128-95 గా ఓట్లు వచ్చాయి. ఉభయసభల్లోనూ ఈ బిల్లుపై విసృతంగా చర్చ జరిగింది. లోక్ సభలో 14 గంటలు,రాజ్యసభలో 13గంటల పాటు చర్చ జరిగింది.  చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు  బిల్లులోని లోపాలను  బలంగా ఎత్తి చూపాయి. అనూహ్యంగా వక్ఫ్ బిల్లు ను వ్యతిరేకించే విషయంలో ఇండియా కూటమి పార్టీలన్నీ ఏకతాటిపై నిలబడ్డాయి. అందుకే సునాయాసంగా పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందుతుని అంతా భావించినా వక్ఫ్ బిల్లు ను పాస్ చేయించుకోవడానికి కేంద్రం నానా తంటాలూ పడాల్సి వచ్చింది. ఎందుకంటే ఎన్డీయే భాగస్వామ్య పార్టీలలోనే వక్ఫ్ బిల్లు విషయంలో అనుమానాలు ఉన్నాయి. కూటమి ధర్మంలో భాగంగా బిల్లును గట్టిగా వ్యతిరేకించకపోయినా, పట్టుబట్టి మరీ తమకు కావలసిన సవరణలు చేయించుకున్నాయి. వాటిలో ముఖ్యంగా తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిపాదించిన సవరణల్లో ఒక్కటి మినహా..మిగిలిన అన్నిటినీ మోడీ సర్కార్ అంగీకరించింది. ఆ మేరకు సవరణలు చేసింది. చంద్రబాబు మద్దతు కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు అత్యంత కీలకం కనుకనే మోడీ ఈ సవరణలకు ఓకే చెప్పారన్నది నిర్వివాదాంశం.

ఇక ఇప్పుడు ఉభయసభల ఆమోదంతో వక్ బిల్లు రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారుతుంది. ముస్సల్మాన్ వక్ఫ్ చట్టం1923 రద్దై కొత్త చట్టం అమలులోకి వస్తుంది. ఈ చట్టంతో వక్ఫ్ బోర్డు లు తమ ఆస్తుల వాస్తవ విలువను నిర్దారించుకోవడానికి కలెక్టర్ల వద్ద వాటిని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.  దేశంలో 30 వక్ఫ్ బోర్డులున్నాయి. 9.4 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న 8.7లక్షల ఆస్తులు వక్ఫ్ బోర్డులో నియంత్రణలో ఉన్నాయి. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ఒక ఆస్తి వక్ఫ్ ఆస్తా కాదా అని నిర్ణయించే అధికారం ఇస్తుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ దానిని రద్దు చేయకపోతే బోర్డు నిర్ణయం అంతిమం అవుతుంది.వక్ఫ్ ట్రిబ్యునల్ అధికారం కొత్త చట్టం కలెక్టర్లకు వర్తించేలా చేస్తుంది. నిర్ణయం వచ్చేవరకూ వివాదస్పద ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తారు. ఈ బిల్లు మేరకు వక్ఫ్ కౌన్సిల్ లో22మందిలో ఇద్దరు ముస్లిమేతర వ్యక్తులు ఉండవచ్చు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు లో 11 మంది సభ్యుల్లో ఇద్దరు ముస్లిమేతరలు ఉండవచ్చు. రూ.లక్ష కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వక్ఫ్ సంస్థలు ఆడిట్ చేయించాలి. ముస్లిం మతం కనీసం ఐదేళ్లు పాటించేవారు తమ ఆస్తిని వక్ఫ్ కు ఇవ్వవచ్చు. వక్ఫ్ ప్రకటనకు ముందే మహిళలు తమ వారసత్వం పొందాలని, విడాకులు తీసుకున్న మహిళలు,వితంతువులు,అనాధలకు ప్రత్యేక నిబంధనలు ఈ బిల్లు నిర్దేసిస్తుంది. ఈ బిల్లు ముస్లింలకే లాభమని,ముస్లీమేతరులు జోక్యం చేసుకోలేరని కేంద్రమైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గట్టిగా చెబుతున్నారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటన లో బిజీగా ఉండగా హోంమంత్రి అమిత్ షా 12 గంటలపాటు ఉభయ సభల్లో ఉండి ప్రణాళిక ప్రకారం బిల్లు ఆమోదం జరిగేలా చూసి తన వ్యూహ చతురతను, సామర్ధ్యాన్నీ మరోసారి చాటారు.  

ఇదిలావుండగా వక్ఫ్ సవరణ బిల్లు2025పై తాజాగా కాంగ్రెస్,ఎంఐఎం సుప్రీంకోర్టు ను ఆశ్రయించాయి. కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, ఎంఐఎం  ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోర్టులో పిటిషన్ వేసారు.ఈ బిల్లు  రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని సవాల్ చేసారు. ముస్లింసమాజ ప్రాధమిక హక్కులు ఉల్లంఘించే లా బిల్లు ఉందని  పిటిషన్ లో పేర్కొన్నారు. కాగా  జగన్ నేతృత్వంలోని వైసీపీ వక్ఫ్ సవరణ బిల్లు వ్యతిరేకించి సంచలనం రేపింది. రాష్ట్రంలో మైనార్టీలకు కలుపుకుని టీడీపీ,జనసేనలను దెబ్బకొట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు. మొత్తంగా బీజేపీ తన అజెండా అమలు విషయంలో పడిన కీలక ముందడుగుగా వక్ఫ్ బిల్లుకు పార్లమెంటు ఆమోదాన్ని భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
మాజీ మంత్రి విడదల రజనీని విశాఖ విమానాశ్రయంలో నిర్బంధించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వైసీపీ హయాంలో యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ స్టోన్‌ క్రషర్స్ నిర్వాహకులను బెదిరించి రూ.2. 20 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి విడుదల రజని, ఆమె మరిది గోపి, అలాగే వీరికి సహకరించిన అధికారి జాషూవా, మాజీ మంత్రి విడదల రజని పీఏ రామకృష్ణపైనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.
వైసీపీ నాయ‌కురాలు, చిలకలూరి పేట మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీకి భారీ షాక్ త‌గిలింది. ఆమె మ‌రిది.. విడ‌ద‌ల గోపీనాథ్ ను ఏసీబీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. విడదల గోపీనాథ్ విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నారన్న కచ్చితమైన సమాచారంలో ఏసీబీ పోలీసులు ఆయనను హైదరాబాద్ లో ఈ తెల్లవారు జామున అదుపులోనికి తీసుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (ఏప్రిల్ 24) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 9 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మరో మూడు రోజుల్లో ( ఏప్రిల్ 27) ఇరవై నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుని రజతోత్సవ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను ఘనంగా జరుపుకునేందుకు సిద్దమవుతోంది. ఒక విధంగా ఇదొక అపూర్వ సందర్భం.
జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిని చంద్రబాబు ఖండించారు. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, దేశ సమగ్రత, భద్రత విషయంలో అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారతదేశాన్ని చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారన్నారు.
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై పాక్ పౌరులను భారత్ లోకి అడుగుపెట్టనివ్వబోమని ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడ ఉన్న పాక్ పౌరులు, పర్యటకులు తక్షణమే తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ జారీ చేసిన ప్రత్యేక వీసాలను రద్దు చేసింది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. కాగా మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ సంగారెడ్డికి వెళ్లనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూతురు ఎంగేజ్మెంట్‌కు హారయ్యేందుకు ఆయన సంగారెడ్డి వెళ్తున్నట్టు సమాచారం.
ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించ తలపెట్టిన బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. పార్టీ నేతలతో కలిసి సభాస్థలిని సందర్శించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటివరకు సహకరించిందని, సభ ముగిసే వరకు ఇదే సహకారం అందించాలని జిల్లా యంత్రాంగాన్నికేటీఆర్ కోరారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక పోరాట సభ కాదని, కేవలం పార్టీ వార్షికోత్సవాన్ని శాంతియుతంగా జరుపుకుంటున్నామని తెలిపారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు
హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా.. సాయంత్రం 4 గంటలకు ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 81 మంది కార్పొరేటర్లలో 66 మంది కార్పొరేటర్లు, 31 మంది అఫిషియో సభ్యులలో 21 మంది ఓటు వేశారు. ఓటింగ్ లో బీఆర్ఎస్ మినహా బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ ఓటర్లు తమ ఓటు బక్కు వినియోగించుకున్నారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆ సభలో అన్నారని వెంకటేశ్వర్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిన్న ఒంగోలులో హత్య గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒంగోలులో టీడీపీ కార్యకర్త వీరయ్య చౌదరి మంగళవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలుకు చేరుకున్న ముఖ్యమంత్రి.. వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు అనిత, ఆనం, డోలా, ఎంపీ మాగుంట, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఇలాంటి ఘోరం జరగడం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. బాధ్యులను పట్టుకొని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్‌ రిలీజ్ చేసింది. మే 22 నుంచి 29వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ ఇంటర్‌, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ద్వితీయ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు సైతం ఇదే టైం టేబుల్‌ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అలాగే, జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీకి చేవెళ్ల కోర్టు బుధవారం (ఏప్రిల్ 23) 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఘోరీ తరఫు లాయర్ చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అఘోరీది చీటింగ్ కేసు కావడంతో.. కోర్టు ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చెప్పలేమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.