ప్రయాగ్ రాజ్ నిర్మానుష్యం.. చెప్పుల గుట్టగా మారిన ఆయోధ్య

Publish Date:Mar 4, 2025

Advertisement

45 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిత్యం భక్త కోటితో కళకళలాడిన ప్రయాగ్ రాజ్ ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. పవిత్ర త్రివేణి సంగమానికి వెళ్లే మార్గాలు ఇప్పుడు బోసిపోయి ఉన్నాయి. మహాకుంభమేళా సందర్భంగా కోట్లాది మంది నిత్యం ప్రయాగ్ రాజ్ లోని పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన సంగతి తెలిసిందే. దీంతో 45 రోజుల పాటు జనసంద్రంగా మారిన ప్రయాగ్ రాజ్ ఇప్పుడు వెలవెల పోతోంది.   

ఇప్పుడు త్రివేణి సంగమం వద్ద భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణాల తొలగింపు చెత్త తొలగింపు పనులు జరుగుతున్నాయి. ఆ పనులు చేసే వారు వినా అక్కడ మరో నరమానవుడు కనిపించని పరిస్థితి ఉంది.    మహా కుంభమేళాలో 45 రోజుల్లో 66 కోట్లమందికి పైగా పుణ్య స్నానాలు చేసినట్లు అంచనా. అంటే సగటున రోజుకు కోటిన్నర మంది మహాకుంభమేళాకు వచ్చారన్నమాట.  
జనవరి 13వ తేదీతో ప్రారంభమైన మహా కుంభమేళా శివరాత్రి పర్వదినంతో అంటే  ఫిబ్రవరి 26 తో ముగిసింది.  

అలాగే ప్రయాగ్ రాజ్ కు వచ్చిన వారిలో అధికులు అయోధ్య వారణాసిలనూ సందర్శించారు. ముఖ్యంగా అయోధ్య రామమందిరానికి మహా కుంభమేలా జరిగిన రోజులలో భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రవేశం, ఆలయం నుంచి వెలుపలకు వెళ్లే మార్గాలను వేరు వేరుగా మార్చడం ఇప్పుడు అయోధ్య వాసులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆయోధ్యలో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా చెప్పులు దర్శనమిస్తున్నాయి. వాటి తొలగింపు కార్యక్రమం తలకు మించిన భారంగా మారింది. అయోధ్య మునిసిపల్ సిబ్బంది ఈ చెప్పుల తొలగింపునకు నానా యాతనా పడుతున్నారు. పొక్లెయినర్లను ఉపయోయిస్తున్నారు.  ఈ పరిస్థితి తలెత్తడానికి ఆలయ నిబంధనలను మార్చడమే కారణమంటున్నారు స్థానికులు.  

ఆలయ ప్రవేశం, నిష్క్రమణలకు వేరువేరు ద్వారాలు ఏర్పాటు చేశారు. దీంతో ఆలయంలోకి మొదటి గేటు నుంచి ప్రవేశించిన భక్తులు మూడో గేటు నుంచి వెలుపలకు రావాల్సి వచ్చింది. మొదటి గేటులో నుంచి ప్రవేశించేముందు భక్తులు తమ చెప్పులను ఆలయం బయట వదిలివేయాలి. ఇక బాలరాముని దర్శనం చేసుకుని మూడో గేటు నుంచి బయటకు వచ్చిన తరువాత తమ చెప్పులు తీసుకునేందుకు భక్తులు దాదాపు ఐదు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది.  దీంతో దాదాపు అందరు భక్తులూ తమ చెప్పులను వదిలేసి వెళ్లిపోయారు. ఈ కారణంగానే అయోధ్యలో చెప్పుల గుట్టలు పేరుకుపోయాయి. మహా కుంభమేళా జరిగిన రోజులలో అయోధ్యను కోటిన్నర మందికి పైగా దర్శించుకున్నారు.  

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.