Publish Date:May 20, 2024
పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేదీ సినిమాలో చివరి పంచ్ మనదైతే ఆ క్కిక్కే వేరప్పా అని ఓ డైలాగ్ ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ అలాంటి కిక్ నే ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు.
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పూర్తయిన తరువాత మూడు రోజులకు తీరిగ్గా ఐప్యాక్ కార్యాలయానికి వెళ్లిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్.. అక్కడ తమ పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రశాంత్ కిషోర్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలౌతుందంటూ ఆయన ఓ ఇంటర్వ్యేూలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ సారి తాము మరింత ఘన విజయం సాధించి అధికారం చేపడతామన్న ధీమా వ్యక్తం చేశారు. అంతే కాదు ప్రశాంత్ కిషోర్ లెక్కలన్నీ తప్పులని కొట్టి పారేశారు. ఆయన ఏపీ ఫలితాలు చూసి కంగుతింటారన్నట్లుగా మాట్లాడారు.
ఆ జగన్ వ్యాఖ్యలకే ప్రశాంత్ కిషోర్ గట్టి రిటార్ట్ ఇచ్చారు. ప్రముఖ జర్నలిస్టు బర్ఖాదత్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజకీయ నాయకులు ఓటమి గురించి ఎన్నడూ ప్రస్తావించరనీ, కౌంటింగ్ పూర్తయ్యే వరకూ కూడా గెలుపు ధీమా వ్యక్తం చేస్తారనీ అంటూ ఇప్పడు జగన్ కూడా అదే చేస్తున్నారని చెప్పారు. అయినా మరో పక్షం రోజులలో కౌంటింగ్ జరుగుతుందనీ, ఒక వేళ తన అంచనాలు నిజమైతే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో అమిత్ షా గెలుపు ధీమా వ్యక్తం చేసి ఎలా ఓడిపోయి తలదించుకున్నారో అలాగే జగన్ రెడ్డి కూడా తలదించుకుంటారని ప్రశాంత్ కిషోర్ చురకలు వేశారు. ఒక వేళ తన అంచనా తప్పైతే తాను తలదించుకోవలసి వస్తుందని అన్నారు. అయితే దేశ వ్యాప్తంగా తన అంచనాలపై ప్రజలలో ఉన్న నమ్మకం, తన ఇమేజ్ దృష్ట్యా ఇలాంటి అంచనాల విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉంటానన్న ప్రశాంత్ కిషోర్ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది పక్కన పెడితే జగన్ పార్టీ ఓడిపోబోతోంది. ఇది నిజం అని కుండబద్దలు కొట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prashant-kishore-powerful-punch-to-jagan-39-176395.html
రిజల్ట్స్ కౌంట్డౌన్ కొటేషన్-1
ఇంతకాలం అమెరికాలో వుండి జగన్ భజన చేయడమే కాకుండా, తెలుగుదేశం నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతూ వస్తున్న ‘పంచ్ ప్రభాకర్’ ఇప్పుడు జగన్ని తిట్టడం ప్రారంభించాడు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కేజ్రీవాల్ మరోసారి జైలు పాలయ్యారు. బెయిల్ పై బయటకొచ్చి ఆయన ప్రజా మద్దత్తు ఉంటే మళ్లీ జైలుకు వెళ్లనని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ పాత్ర కీలకమే అయినప్పటికీ పదేళ్ల తర్వాత ఆయన స్థితి పూర్తిగా దిగజారిపోయింది. పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ కెసీఆర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది.
తెలంగాణ రాష్ట్రం దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న శుభవేళ రాష్ట్ర మంతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ని ‘తెలంగాణ జిన్నా’ అని అభివర్ణించారు.
హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కి బంధం నేటితో తెగిపోనుంది..
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఎపి కూడా నైరుతి రుతు పవనాలు రానున్నాయని సంకేతాలు అందుతున్నాయి.
ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో పల్నాడు అట్టుడికి పోయింది. ముఖ్యంగా మాచర్లలో అల్లర్లు దేశం యావత్ దృష్టికి వచ్చాయి. మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వంసం చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు.
ప్రత్యేక తెలంగాణ బిల్లు కాంగ్రెస్ పెడితే బిజెపి ఆమోదించింది. పదేళ్ల తర్వాత జరుపుకుంటున్న తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించింది. మెజారిటీ మార్కుకు అవసరమైన స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఏకగ్రీవంగా పది స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినట్లు ఈసీ ప్రకటించింది.
వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. నేటి అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్ హెచ్ఐఏ) ప్రకటించింది.
ఎపిలో త్రి కూటమి విజయం తథ్యమని ముందు నుంచి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో బోణి కొట్టిన బిఆర్ఎస్
నిరుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసిన బిఆర్ఎస్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బోణి కొట్టింది. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు రెండు రోజుల ముందు వచ్చిన ఫలితాల్లో గులాబి జెండా రెపరెపలాడటం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు.