Publish Date:Feb 11, 2025
తమిళనాడు రాజకీయాలలోకి ప్రముఖ హీరో తళపతి విజయ్ ప్రవేశమే ఒక సంచలనం అనుకుంటే.. ఆయన తన పార్టీ తమిళగ వెట్రిక కజగం (టీవీకే)కు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను నియమించుకోవడం మరింత సంచలనం సృష్టించింది. దేశంలో పలు పార్టీలను విజయతీరాలకు చేర్చేలా వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిశోర్ గత కొంత కాలంగా ఎన్నికల వ్యూహకర్త కొలువు మానేసి బీహార్ లో సొంత పార్టీ పెట్టుకుని పూర్తిగా ఆ రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైపోయారు. ఇప్పుడు మళ్లీ ఆయన ఎన్నికల వ్యూహకర్త అవతారం ఎత్తారు. తమిళనాట కొత్తగా రాజకీయ ప్రవేశం చేసిన హీరో విజయ్ పార్టీ టీవీకేకి ప్రత్యేక సలహాదారుగా ఎన్నికల వ్యూహాలు రచించనున్నారు.
ప్రశాంత్ కిశోర్ మామూలు వ్యక్తి కాదు. కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు అందుకోవడంలో పీకే వ్యూహాలు ఉన్నాయి. అలాగే 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహరచనే కారణమనడంలో సందేహం లేదు. ఇక 2021 ఎన్నికలలో తమిళనాడులో డీఎంకే విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టం వెనుకా ప్రశాంత్ కిషోర్ వ్యూహ రచన ఉంది. అంతెందుకు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ వరుసగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టడం వెనుక ఉన్నదీ ప్రశాంత్ కిషోర్ వ్యూహాలే. అటువంటి ప్రశాంత్ కిశోర్ ఇటీవల పార్టీలకు ఎన్నికల వ్యూహాల రూపకల్పనకు గుడ్ బై చెప్పేసి తన స్వరాష్ట్రం బీహార్ లో తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీహార్ లో అధికారమే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో పని చేసుకుంటున్నారు. సుదీర్ఘ పాదయాత్ర చేశారు. రాష్ట్ర సమస్యలపై ఆందోళనా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇటీవలే రాష్ట్రంలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిరవధిక నిరాహార దీక్ష కూడా చేశారు.
ఇక తమిళనాట సినీ హీరోగా విపరీతమైన ప్రేక్షకాదరణ ఉన్న విజయ్ సినీమాలకు గుడ్ బై చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. టీవీకే పేర సొంత పార్టీ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి రాజకీయాలలోకి దిగారు.ప్రస్తుతం చేతిలో ఉన్న ఒకే ఒక సినీమాను పూర్తి చేసి ఈ ఏడాది మలి భాగంలో పూర్తిస్థాయిలో రాజకీయాలకే పరిమితం కానున్నట్లు విజయ్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి ఇప్పటి నుంచే ప్రయత్నాలూ ఏర్పాట్లూ చేసుకుంటున్నారు. అందులో బాగంగానే టీవీకే పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను నియమించుకున్నారు. రాష్ట్రంలో టీవీకే బలోపేతం, ఎన్నికల వ్యూహాల రూపకల్పన, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయడం వంటి అంశాలలో విజయ్ కు ఆయన పార్టీ టీవీకేకు ప్రశాంత్ కిశోర్ తోడ్పాటు, సహకారం అందిస్తారు. ఈ మేరకు ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ తో సంప్రదింపులు పూర్తయ్యాయని చెబుతున్నారు. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అంటున్నారు.
దళపతి రాజకీయ ప్రస్థానం ఘనంగా ఉండేలా ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. అందులో భాగంగా రానున్న రోజులలో విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర లేదా బస్సు యాత్ర చేపట్టేలా ప్రశాంత్ కిశోర్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధమైందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prashant-kishore-as-election-strategist-for-vijay-39-192712.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.