ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ తో జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. కేంద్ర ఐటీ శాఖ మంతరి అశ్విని వైష్ణవ్ ను కలిసేందుకు ఢిల్తీ వెల్లిన లోకేష్ తో భేటీ అయ్యేందుకు ప్రశాంత్ కిషోర్ వచ్చారు. ఎన్నికల వ్యూహకర్తగా మొదలకై సొంత పార్టీ పెట్టుకుని బీహార్ రాజకీయాలకే పరిమితమైన ప్రశాంత్ కిషోర్ లోకేష్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిరువురి మధ్యా ఏయే అంశాలపై చర్చ జరిగిందన్నది తెలియరాలేదు.
అయినా పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించడం మానేసి, ఐ ప్యాక్ నుంచి పూర్తిగా వైదొలగిన ప్రశాంత్ కిషోర్ పనిగట్టుకుని మరీ లోకేష్ తో భేటీ అవ్వడంపై పలు విధాలుగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన రాబిన్ శర్మ ప్రశాంత్ కిషోర్ శిష్యుడే. ఆయన ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో పార్టీ పటిష్టత కోసం రాబిన్ శర్మ పని చేస్తున్నారని అంటున్నారు. దానిపై క్లారిటీ లేదు. ఇప్పుడు లోకేష్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ అవ్వడం వెనుక కూడా తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకువెళ్లే వ్యూహాలపైనే చర్చ జరిగి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు.
కాగా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్ లో తన పార్టీ జన జనసురాజ్ ను ఎన్నికలలో గెలిపించుకోవడంపైనే పూర్తిగా దృష్టి పెట్టారు. బీహార్ లో ఉద్యోగ నియామకాల విషయంలో జరిగిన అవకతవకలపై విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఇటీవల ఆమరణదీక్షచేసి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన బీహార్ లో గేమ్ చేంజర్ గా మారే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇక పోతే ప్రశాంత్ కిషోర్ లోకేష్ తో భేటీ, వారి మధ్య ఏయే అంశాలపై చర్చ జరిగిందన్న విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు.
అయితే రాజకీయ వ్యూహాల్లో నిష్ణాతుడిగాదేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ పనిగ్ట్టుకుని మరీ లోకేష్ తో భీటీ అవ్వడంపై మాత్రం రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఢిల్లీలోని ఏపీ సీఎం అధికారిక నివాసంలో బస చేసిన లోకేష్ ను కలిసేందుకే ప్రశాంత్ కిషోర్ అక్కడకు వచ్చారు. వీరిరువురి మధ్యా భేటీ ముందుగా నిర్ణయించిన మేరకే జరిగిందని అర్ధమౌతోంది.
గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పారు ప్రశాంత్ కిశోర్. అయన అంచనా వేసినట్లే ఆ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి కనీవినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించింది. వైసీపీ కనీపం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమై ఘోరాతి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వాస్తవానికి అప్పుడు ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన శిష్యుడు రాబిన్ శర్మ తెలుగుదేశం కోసం పని చేశారు. అయినా అప్పట్లో ప్రశాంత్ కిశోర్ తెలుగుదేశం కూటమి విజయం తథ్యమని చెప్పారు. అప్పటి నుంచీ ప్రశాంత్ కిశోర్ కు లోకేష్, చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఆ క్రమంలోనే లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉండగా ప్రశాంత్ కిశోర్ ఆయనతో భేటీ అయ్యారని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/praashant-kishore-meet-lokesh-39-192369.html
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, కమిటీల నిర్మాణం లాంటి అంశాలపై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.