ఏపీ వర్ సెక్టార్‌లో ‘పవర్ ’ బ్రోకర్లు.. వాళ్లదే హవా.!

Publish Date:Mar 23, 2025

Advertisement

ఎన్నో వేధింపులు, ఎన్నో ఒత్తిళ్లు, కదిపితే  కేసులు, మెదిలితే దాడులు, మాట్లాడితే జైలు, అధికారంలో ఉన్నవారిని  విమర్శించడం కాదు, కనీసం కన్నెత్తి  చూడటానికి కూడా భయపడ్డ రోజులు. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతాం దేవుడా... అని తెలుగుదేశం నాయకులు, అభిమానులు, మొదలుకుని సామాన్య ప్రజల వరకు ఎదురు చూసిన రోజులు. కోరికల మాట అటుంచి నెలనెలా రావాల్సిన జీతాల గురించి ప్రభుత్వ ఉద్యోగులు అడుక్కోలేని పరిస్థితుల నుంచి బయటపడ్డారు. దోపిడీ ప్రభుత్వం నుంచి, దుర్మార్గ పాలన నుంచి విముక్తి అని అనుకున్నన్ని రోజులు పట్టలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వంలోనూ పాత వాసనే వస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అడుగడుగునా గత ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన అధికారులు, పవర్ బ్రోకర్లే కనిపిస్తున్నారు. మైనింగ్, ఎక్సైజ్ రంగాలతో పాటు విద్యుత్ రంగంలోనూ వైసీపీ మనుషులే తిష్ఠ వేసుకుని కూర్చున్నారు.  ఐదేళ్లు అనుభవించింది చాలదన్నట్ల, మరో ఐదేళ్లు పవర్ సెక్టార్ ని  తమ చెప్పుచేతుల్లోనే పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అధికారం కోల్పోయిన పార్టీకి స్లీపర్ సెల్స్ లా పనిచేయటానికి ఎక్కడికక్కడ పథకాలు రచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చేతిలో ఉన్న విద్యుత్ రంగాన్ని పూర్వ సంబంధాలను ఉపయోగించుకుని, తమ ప్రాజెక్టులకు ఇబ్బంది లేకుండా వైసీపీ నేతలు జాగ్రత్త పడుతున్నారు.

ప్రభుత్వం మారి 9 నెలలు గడుస్తున్నా, ప్రభుత్వ పెద్దల కళ్ళకు గంతలు కట్టి, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. అనంతపురం మొదలు కోస్తా జిల్లాల్లోని అన్నిచోట్ల పవర్ ప్లాంట్ లు, ట్రాన్ష్‌ఫార్మర్ల కాంట్రాక్టులు వైసిపి పెద్దలవే అని కిందిస్థాయి తెలుగుదేశం కార్యకర్తలు మొత్తుకుంటున్నారు. పవర్ డిస్ట్రిబ్యూషన్ కమిటీల వరకు వారి పైరవీలే సాగుతున్నాయంట. వారి మనుషుల్ని డైరెక్టర్లుగా, వారు చెప్పిన మాట వినేవారినే సిఎండిలుగా కొనసాగేలా చేస్తూ తమ పనులు చేయించుకుంటున్నారట.

తాజాగా 100 కోట్ల రూపాయల విలువైన ట్రాన్స్ఫార్మర్ల కాంట్రాక్ట్ ఖరారు కూడా ఇందులో భాగమే అంటున్నారు. ఎస్ పి డి సి ఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలోకి కొత్త వారు వచ్చే అవకాశం ఉండటంతో గడిచిన శుక్రు, శనివారాల్లో ఈ తాజా ఒప్పందాలు జరిగిపోయినట్టు అనుమానిస్తున్నారు.
మొత్తం పవర్ సెక్టర్ చీఫ్ సెక్రటరీ చేతిలో ఉంది. ఆయన వైసిపి హయాం నుంచి అధికారం చవి చూసిన వారే. గతంలో విద్యుత్ శాఖలో సుదీర్ఘ కాలం ఉన్నత పదవి నిర్వహించి రిటైర్ అయిన అధికారి కుమారుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సీఎంఓలో విద్యుత్ విభాగం చూసే అధికారికి గాని, విద్యుత్ శాఖ మంత్రికి కానీ తెలియకుండానే వైసిపి దూతలు పనులు చక్కపెట్టుకుంటున్నారట. విద్యుత్ శాఖ మంత్రికి, సి ఎం ఓ లోని అధికారికి ఏమీ చేయలేని పరిస్థితి ఉందని, అందుకే వారు ఈ విషయాలు వదిలేశారని అంటున్నారు.
అంతా చిన్న బాబు ప్రధాన అనుచరుని ద్వారా, చిన్న బాబు స్థాయిలోనే క్లియర్ చేయించు కుంటున్నారని చెప్పుకుంటున్నారు. ఆ క్రమంలో విద్యుత్ శాఖలో కింద నుంచి పై స్థాయి వరకు ప్రక్షాళన జరగనిదే కూటమి ప్రభుత్వానికి మరింత డ్యామేజీ తప్పని పరిస్థితి కనిపిస్తున్నది. సీఎంఓలో ఇన్వెస్ట్మెంట్ విభాగం అధికారి మొదలు, విద్యుత్ శాఖ అదనపు కార్యదర్శి, ఎస్పీడీసీఎల్, సి పి డి సి ఎల్ చైర్మన్ కం ఎండీలను, సభ్యులను, నెట్‌క్యాబ్ ఎండీని మార్చుకుంటే పవర్ సెక్టార్ పాలన చంద్రబాబు చేతిలో లేనట్లే భావించాలంటున్నారు.

అభివృద్ధి వేరు, రాజకీయాలు వేరు అంటున్న ముఖ్యమంత్రి దానికే కట్టుబడితే, ఆయనకు మంచి పేరు రావచ్చేమో కానీ ఆయన వెనుక అభిమానించే వారు మిగలరన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత ప్రభుత్వానిది రాక్షస పాలన అని చంద్రబాబు నమ్మితే, గత ఐదేళ్లలో పవర్ సెక్టార్లో ఎవరు పెత్తనం చేశారు, వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, సిఎంఓతో వారికి ఉన్న లింకులు ఏంటో విచారించుకోవాలని ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. ఇంజనీర్ కూడా కానీ ఒక అధికారి సోలార్ పవర్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారు? అని ప్రశ్నిస్తున్నారు.

టిడిపి పెద్దలు, కార్యకర్తలు దోషిగా వేలెత్తి చూపిస్తున్న పెద్దిరెడ్డి లాంటి వైసీపీ నేతలే ఇంతవరకు పవర్ కార్పొరేషన్ చైర్మన్ ల మార్పిడి విషయంలో ప్రభావం చూపిస్తున్నారంటున్నారు.  ఏపీడీసీఎల్ సభ్యుడు ఒకరు  పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లకు లాబీయిస్ట్ అని చెప్తున్నారు. పవర్ సెక్టార్‌పై చంద్రబాబు పట్టు కోల్పోతే వైసిపి స్లీపర్ సెల్స్ లా పనిచేస్తున్న అధికారులు తమ ప్రభుత్వాన్ని ముంచేస్తారని ఆ రంగంలో నిపుణులైన  తెలుగుదేశం అభిమానులు అంటున్నారు. ఇలాగే వదిలేస్తే చంద్రబాబు కూడా అపనిందల పాలు కాక తప్పదని, ఆయన కూడా అవినీతిపరులతో కుమ్మక్కయ్యారన్న చెడ్డపేరు  వస్తుందని హెచ్చరిస్తున్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ, జెన్కో డిస్ట్రిబ్యూషన్ సంస్థలు అన్నీ గత తొమ్మిది నెలలుగా వైసీపీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కనుసన్నల్లోనే నడుస్తున్నాయని తెలుస్తోంది, డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్లకు కొత్తగా నియమించబోయే డైరెక్టర్లుగా వైసీపీ ఏజెంట్లను నియమించాలని పవర్ బ్రోకర్ల ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.

ప్రస్తుత చీఫ్ సెక్రటరీ చేతిలోనే విద్యుత్ శాఖ కూడా ఉంది, ఆ శాఖకు ఇంతవరకూ వేరే ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించలేదు. ప్రస్తుత సీఎస్ శ్రీ విజయానంద్ పదవీవిరమణ అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎలెక్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీకి చైర్మన్ అవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది, రాబోయే 2029 ఎన్నికల్లో ఆయన గెలవబోయే పార్టీ తరఫున పార్లమెంటుకు లేదా అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారట, వీలైతే రాజ్యసభకు కూడా ఆయన ప్రయత్నాలు చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.