Publish Date:May 23, 2023
ఖమ్మం పాలిటిక్స్ రసకందాయంలో పడింది. బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ కు గురైన పొంగులేటి , మంత్రి పువ్వాడ అజయ్ మధ్య మాటలయుద్దం తారాస్థాయికి చేరుకుంటుంది. పొంగులేటి ఓ బచ్చా అని పువ్వాడ వాఖ్యానించారు.
పొంగులేటి డబ్బులు చూసుకొని విర్రవీగుతున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ లో ఉంటూనే తన సొంత పార్టీ నేతలనే ఓడించాలని ఆయన కుట్ర చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
పొంగులేటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు జూపల్లిని కూడా సస్పెండ్ చేసింది బిఆర్ఎస్ . కెసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న పొంగులేటి నోటికి తాళం వేయాలని బిఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. పొంగులేటికి కౌంటర్ ఇచ్చేందుకు పువ్వాడ సిద్దమయ్యారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఓ సిద్ధాంతం, విలువ లేని నేత అన్న పువ్వాడ పొంగులేటి తనకు తాను అతిగా ఊహించుకుంటున్నారని విమర్శించారు. ఏపార్టీలోకి వెళ్ళాలనేది తేల్చుకోలేని దుస్థితిలో పొంగులేటి ఉన్నారన్నారు. ఇక పేదలను పీడించుకొని తిన్న దోపిడీదారులే ఆయన పంచన చేరారని, ఖమ్మం రాజకీయాల్లో పొంగులేటి ఒక బచ్చా అని పువ్వాడ ధ్వజమెత్తారు.
పువ్వాడ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఖమ్మం జిల్లాలో కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి అజయ్ కుమార్పై మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.పువ్వాడపై బచ్చాగాడిని పెట్టినా గెలిపిస్తానని పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఖమ్మం జిల్లాలో తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ponguleti-versus-puvvada-25-155806.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు