Publish Date:Aug 18, 2022
తెలంగాణా లో ఆపరేషన్ ఆకర్ష్ని కాషాయ దళం ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఏ పార్టీ నుంచి ఎవరెవరు కాషాయ దళంలోకి వెళ్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఆగస్టు 21న మునుగోడు సభ వేదికగా కొందరు టీఆర్ఎస్ కీలక నేతల చేరికలు ఉండేలా వ్యూహాలకు పదును పెడుతోంది తెలంగాణా కమలదళం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సభకి హాజరు అవుతున్నారు. అమిత్ షా కి ఘన స్వాగతం పలికేందుకు కమలనాథులు సర్వం సన్నద్ధంగా ఉన్నారు.
హోంమంత్రి అమిత్ షా పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. అదే సభలో అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారని ఇప్పటికే ప్రకటించారు. అలాగే టి.ఆర్.ఎస్ నుండి కమలం కండువా కప్పుకునే నేతలలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బీజేపీలో పొంగులేటి చేరిక ఖాయమైందని మునుగోడు సభలోనే ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. బుధవారం (ఆగస్టు 17) జరిగిన తన కుమార్తె నిశ్చితార్థం రిసెప్షన్తో దీనిపై మరింత స్పష్టత వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బుధవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుక ఖమ్మంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఐతే ఇంత ఘనంగా నిర్వహించిన వేడుకలో అధికార టీఆర్ఎస్ నేతలెవరూ కనిపించలేదు. హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల సహా పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు. ఈ వేడుకలో ఈటల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సొంత పార్టీ నేతలెవరూ హాజరకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
పొంగులేటి బీజేపీలోకి వెళ్లనున్నారని అందువల్ల గులాబీ నేతలు హాజరు కాలేదని తెలుస్తోంది. పొంగులేటి తన బలం చుపించుకోవడానికే లక్షలాది మందిని ఆహ్వానించారని తెలుస్తోంది. అంతేకాదు ఇటీవల టీఆర్ఎస్కు రాజీనామా చేసిన రాజయ్య యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా అమిత్ షా సమక్షంలో కమలదళంలో చేరే అవకాశముందని సమాచారం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారా? లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ponguleti-to-join-bjp-soon-39-142193.html
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల ప్రచారం హోరెత్తుతోంది. రాష్ట్రం నలుమూలలా అభ్యర్థులు గెలుపుకోసం ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్తయితే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజకవర్గ ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువ, మేధావి వర్గమూ ఎక్కువే. అలాంటి పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భయపడ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు. గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు