చిరుతిళ్లే కాదు - వాటి కవర్లూ ప్రమాదమే

Publish Date:Feb 2, 2017

Advertisement


ఒకప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కుని కడుపునిండా తినేవారం. కాలం మారిపోయింది. రోడ్డు మీద అలా నడుస్తూ నడుస్తూ... మధ్యలో ఒక శాండ్విచ్ కొనుక్కొని దానిని సుతారంగా పేపర్లోనే ఉంచి తినడం అలవాటైపోయింది. ఇలా చిరుతిళ్లకు చుట్టి ఉంచే పేపర్లు, డబ్బాల వల్ల నానారకాల రోగాలూ వస్తాయని ఓ పరిశోధన హెచ్చరిస్తోంది.

 

అమెరికా నడిబొడ్డున

 

ఈ పరిశీలిన ఏదో మన దగ్గర జరిగింది కాదు. అమెరికాలో ఏకంగా 400 నమూనాలను పరిశోధించిన తేల్చిన విషయం. అవి కూడా ఆషామాషీగా రోడ్డు పక్కన కనిపించే బేకరీలలోని నమూనాలు కావు. మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్ వంటి 27 ప్రముఖ దుకాణాల నుంచి సేకరించారు. దేశంలోనే ప్రముఖ నగరాలైన వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాలలో ఈ సేకరణ సాగింది.

 

PFAS

 

శాండ్విచ్లను చుట్టి ఉంచే పేపర్లు, పేస్ట్రీల డబ్బాలు, చిప్స్ వేసి ఇచ్చే కవర్లు... ఇలా అన్నిరకాల ఆహారపదార్థాలతో పాటుగా వచ్చే సరంజామాలో polyfluoroalkyl substances (PFASs) అనే విష రసాయనాలు కనిపించాయి. పేపర్లు, కవర్లు మరకలు అంటకుండా తళతళలాడుతూ ఉండేందుకు, ఈ తరహా రసాయనాలను చేరుస్తున్నట్లు కనుగొన్నారు. నాన్స్టిక్ వంటపాత్రలలోనూ, మరకలు అంటని వస్తువుల తయారీలోనూ ఈ రసాయనాలను వాడుతూ ఉంటారు. శాండ్విచ్లను చుట్టి ఉంచే 40 శాతం పేపర్లలో ఈ PFASల ఆనవాళ్లు కనిపించాయి, ఇక బ్రెడ్ను అందించే 60 శాతం కవర్లలో PFASలు దర్శనమిచ్చాయి. మిగతా పదార్థాలతో పాటుగా వచ్చే సరంజామాలోనూ అంతోఇంతో ఆనవాళ్లు కనిపించాయి.

 

అయితే ఏంటట!

 

ఈ PFASల ఉనికి వల్ల ప్రమాదం ఏముంటుందిలే అనుకోవడానికి లేదు. ఎందుకంటే చిరుతిండితో పాటుగా ఇవి శరీరంలోకి చేరతాయనీ, ఆ తర్వాత అవి ఒంట్లో పేరుకుపోతాయనీ తేలింది. అలా పేరుకుపోయిన PFASలు మన రక్తంలో కలిసిపోయి నానారకాల రోగాలకు దారితీస్తాయని అంటున్నారు. PFASలు కాలేయం, థైరాయిడ్ వంటి అనేక అవయవాలను దెబ్బతీయడంతో పాటుగా క్యాన్స్ర్కు సైతం దారితీస్తాయని ఈపాటిలే అనేక పరిశోధనలు రుజువు చేశాయి.

 

వదల బొమ్మాలీ వదల

 

ఈ PFASలు ఒక్కసారి కనుక శరీరంలోకి చేరితే, అవి ఓ పట్టాన వదిలి పోవట! శరీరంలో పేరుకున్న ఓ 50 శాతం PFASలు వదలడానికి కూడా ఏళ్ల తరబడి పడుతుందట. అంతేకాదు! ఇవి పర్యావరణంలో కూడా అంతగా కలవవని అంటున్నారు. విచిత్రం ఏమిటంటే తాము ఆహారపదార్థాలను అందిస్తున్న పేపర్ల వెనుక ఇంత విషం దాగుందని సదరు దుకాణాలకు కూడా తెలియవట. కాబట్టి ఈ విషయమై ప్రభుత్వాలే చొరవ చూపాలనీ, వినియోగదారులు జాగ్రత్త వహించాలనీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

- నిర్జర.

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.