చిరుతిళ్లే కాదు - వాటి కవర్లూ ప్రమాదమే

Publish Date:Feb 2, 2017

Advertisement


ఒకప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కుని కడుపునిండా తినేవారం. కాలం మారిపోయింది. రోడ్డు మీద అలా నడుస్తూ నడుస్తూ... మధ్యలో ఒక శాండ్విచ్ కొనుక్కొని దానిని సుతారంగా పేపర్లోనే ఉంచి తినడం అలవాటైపోయింది. ఇలా చిరుతిళ్లకు చుట్టి ఉంచే పేపర్లు, డబ్బాల వల్ల నానారకాల రోగాలూ వస్తాయని ఓ పరిశోధన హెచ్చరిస్తోంది.

 

అమెరికా నడిబొడ్డున

 

ఈ పరిశీలిన ఏదో మన దగ్గర జరిగింది కాదు. అమెరికాలో ఏకంగా 400 నమూనాలను పరిశోధించిన తేల్చిన విషయం. అవి కూడా ఆషామాషీగా రోడ్డు పక్కన కనిపించే బేకరీలలోని నమూనాలు కావు. మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్ వంటి 27 ప్రముఖ దుకాణాల నుంచి సేకరించారు. దేశంలోనే ప్రముఖ నగరాలైన వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాలలో ఈ సేకరణ సాగింది.

 

PFAS

 

శాండ్విచ్లను చుట్టి ఉంచే పేపర్లు, పేస్ట్రీల డబ్బాలు, చిప్స్ వేసి ఇచ్చే కవర్లు... ఇలా అన్నిరకాల ఆహారపదార్థాలతో పాటుగా వచ్చే సరంజామాలో polyfluoroalkyl substances (PFASs) అనే విష రసాయనాలు కనిపించాయి. పేపర్లు, కవర్లు మరకలు అంటకుండా తళతళలాడుతూ ఉండేందుకు, ఈ తరహా రసాయనాలను చేరుస్తున్నట్లు కనుగొన్నారు. నాన్స్టిక్ వంటపాత్రలలోనూ, మరకలు అంటని వస్తువుల తయారీలోనూ ఈ రసాయనాలను వాడుతూ ఉంటారు. శాండ్విచ్లను చుట్టి ఉంచే 40 శాతం పేపర్లలో ఈ PFASల ఆనవాళ్లు కనిపించాయి, ఇక బ్రెడ్ను అందించే 60 శాతం కవర్లలో PFASలు దర్శనమిచ్చాయి. మిగతా పదార్థాలతో పాటుగా వచ్చే సరంజామాలోనూ అంతోఇంతో ఆనవాళ్లు కనిపించాయి.

 

అయితే ఏంటట!

 

ఈ PFASల ఉనికి వల్ల ప్రమాదం ఏముంటుందిలే అనుకోవడానికి లేదు. ఎందుకంటే చిరుతిండితో పాటుగా ఇవి శరీరంలోకి చేరతాయనీ, ఆ తర్వాత అవి ఒంట్లో పేరుకుపోతాయనీ తేలింది. అలా పేరుకుపోయిన PFASలు మన రక్తంలో కలిసిపోయి నానారకాల రోగాలకు దారితీస్తాయని అంటున్నారు. PFASలు కాలేయం, థైరాయిడ్ వంటి అనేక అవయవాలను దెబ్బతీయడంతో పాటుగా క్యాన్స్ర్కు సైతం దారితీస్తాయని ఈపాటిలే అనేక పరిశోధనలు రుజువు చేశాయి.

 

వదల బొమ్మాలీ వదల

 

ఈ PFASలు ఒక్కసారి కనుక శరీరంలోకి చేరితే, అవి ఓ పట్టాన వదిలి పోవట! శరీరంలో పేరుకున్న ఓ 50 శాతం PFASలు వదలడానికి కూడా ఏళ్ల తరబడి పడుతుందట. అంతేకాదు! ఇవి పర్యావరణంలో కూడా అంతగా కలవవని అంటున్నారు. విచిత్రం ఏమిటంటే తాము ఆహారపదార్థాలను అందిస్తున్న పేపర్ల వెనుక ఇంత విషం దాగుందని సదరు దుకాణాలకు కూడా తెలియవట. కాబట్టి ఈ విషయమై ప్రభుత్వాలే చొరవ చూపాలనీ, వినియోగదారులు జాగ్రత్త వహించాలనీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

- నిర్జర.

By
en-us Political News

  
మన శరీర ఉష్ణోగ్రత ప్రతి సీజన్‌లో నార్మల్ గా ఉంటుంది.  దాదాపు 37-38 డిగ్రీల సెల్సియస్  వరకు శరీర ఉష్టోగ్రత ఉంటుంది. అయితే చలికాలంలో బయటి ఉష్ణోగ్రత 5, 10, 15, లేదా 18 డిగ్రీల సెల్సియస్‌ గా నమోదు అవుతూ ఉంటుంది....
ఆహారం శరీరానికి ఎంతో అవసరం. తీసుకునే ఆహారం వల్లనే శరీరానికి శక్తి వస్తుంది. ముఖ్యంగా ఆహారంలో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, ఖనిజాలు చాలా అవసరం. ఇవన్నీ ఆహారంలో ఉండటం ఎంత ముఖ్యమూ. ఆహారం తీసుకునే సమయం కూడా అంతే ముఖ్యం. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతారు. అలా చేయకపోతే జీవక్రియకు ఆటంకం కలుగుతుంది. కేవలం జీవక్రియ ప్రభావితం కావడమే కాదు.. సమయానికి ఆహారం తీసుకోకపోతే అది చాలా తీవ్రమైన సమస్యలను కూడా కలిగిస్తుందట. సమయానికి ఆహారం తీసుకోకపోతే జరిగేదేంటో తెలుసుకుంటే..
చలికాలంలో చలి సహజమే.. కానీ కొందరికి సాధారణం కంటే ఎక్కువ చలి పెడుతూ ఉంటుంది. ఇంత చలి పెడుతుంటే ఇతరులు ఎలా భరిస్తున్నారో ఏంటో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. మందం పాటి దుస్తులు దరించినా, స్వెట్టర్లు వేసుకున్నా కూడా కొందరికి లోపల వణుకు పుడుతూనే ఉంటుంది. అయితే ఇది చలి కారణంగా వచ్చే చలి కాదని, దీని వెనుక వేరే కారణాలు ఉంటాయని అంటున్నారు వైద్యులు. అసలు కొందరిలో అధికంగా చలి ఎందుకు పెడుతుంది? శరీరంలో కలిగే మార్పులు ఏంటి? తెలుసుకుంటే..
అల్పాహారం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయాన్నే తీసుకునే ఆహారం.  ప్రతి రోజూ ఉదయం 8 నుండి 9 గంటలలోపు అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, రోజంతా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుందని..
ఆహారం శరీరానికి ఎంతో అవసరం.  నేటి ఉరుకుల పరుగుల జీవితాలలో ఆహారం వండుకోవడానికి సమయం సరిపోక ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు.  ఇంట్లోనూ,  బయటా రెండు చోట్లా ఒత్తిడితో కూడుకున్న పనులు...
ఇనుప పాత్రలలో వండిన పదార్థాలు   ఆరోగ్యానికి ఎంతో మంచివి. నాన్ స్టిక్,  అల్యూమినియం తో ఇనుప పాత్రలలో వండిన ఆహారం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.  ఇనుప పాత్రలలో వంట చేయడం..
తిప్పతీగ గురించి ఈ మధ్యకాలంలో చాలా సమాచారం వ్యాప్తి అవుతోంది.  ఒకప్పుడు గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా పెరిగేవి తిప్పతీగ మొక్కలు.  ఇప్పుడు ఇళ్ళలో పెంచుకోవడం లేదా ఆన్లైన్ లో తిప్పతీగ పొడర్స్..
శరీరంలో ఏదైనా అవయవం లేదా ప్రాంతం అసౌకర్యానికి లోనైనప్పుడు, లేదా ఏదైనా దెబ్బ తగిలినప్పుడు నొప్పి కలుగుతుంది.  సాధారణంగా శరీరంలో కలిగే నొప్పులు  ఒకటి రెండు రోజులలో వాటికవే తగ్గిపోతాయి....
బాదం పప్పు రోజూ తినడం ఎంతవరకు ఆరోగ్యం? ఆరోగ్యం బాగుండాలంటే రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? తెలుసుకుంటే..
కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది ఒక సాధారణ చేతి సమస్య. అరచేతి వైపు ఎముకలు, స్నాయువులతో చుట్టుముట్టబడిన ఇరుకైన మార్గం అయిన కార్పల్ టన్నెల్‌లో ఉన్న నాడిని చేతిపై ఒత్తిడి చేసినప్పుడు ఇది సంభవిస్తుంది. చేతులలో తిమ్మిరి రావడం, వేళ్లలో జలదరింపు లేదా నొప్పి ఉండటం, రాయడంలో లేదా టైప్ చేయడంలో సమస్య ఉండటం, పదే పదే వస్తువులు చేతులలో పట్టుకోలేక జారవిడచడం, వస్తువులను పట్టుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడం ఈ కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ ప్రధాన లక్షణాలు.
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.