యుక్త వ‌య‌స్సులో అవినీతి.. వృద్ధ వ‌య‌స్సులో జైలు.. జ‌గ‌న్ రెడ్డిదీ అదేదారా?

Publish Date:Jan 30, 2025

Advertisement

న్యాయవ్యవస్థను మోసం చేయడం దేశద్రోహాన్ని మించిన నేరం. ఇందులో ఎటువంటి సందేహాలకూ తావు లేదు.  దేశంలో సామాన్యులు చట్టాలని, న్యాయ తీర్పులను గౌరవిస్తూ శిక్షలు  అనుభవిస్తున్నారు. అయితే రాజకీయంగా ఉన్నత స్థాయిల్లో ఉన్న నాయకులు మాత్రం  వేల కోట్ల ప్రజా ధనం స్వాహా చేసి, న్యాయవ్యవస్థను తప్పుతోవ పట్టిస్తూ, చట్టాలను అడ్డు పెట్టుకొని  శిక్ష పడకుండా ఏళ్ల తరబడి బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు. రాజకీయంగా ప‌లుకుబ‌డి క‌లిగిన నేత‌లు.. వారు దోచేస్తున్న ప్రజాధనం, వారు గ‌డుపుతున్న విలాసవంతమైన జీవితాల గురించి అనేక దేశాల న్యాయవిద్యలో పలు అంశాలు ప్రముఖ ఉదాహరణలుగా బోధిస్తుండ‌టం గ‌మ‌నార్హం. భార‌త‌దేశంలో పాల‌క వ్య‌వ‌స్థ‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ అధికారాన్ని దుర్వినియోగం చేసి వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తూ ఆస్తులు కూడబెట్టిన వారు ఎందరో ఉన్నారు.  వారిలో చాలామంది జైలు శిక్షలు అనుభవించారు. అయితే, అటువంటి వారిపై కేసులు  13 నుంచి 20ఏళ్ల వరకూ సుదీర్ఘంగా విచారణ సాగడంతో అటువంటి వారు జీవిత చ‌ర‌మాంకంలో జైలు కెళ్తున్నారు. కోట్లాది రూపాయ‌ల అవినీతికి పాల్ప‌డిన వ్య‌క్తి  66 నుంచి 78 ఏళ్ల మధ్య వయస్సులో కోర్టులు శిక్ష విధిస్తే లాభమేమిటి..?  అలాంట‌ప్పుడు అది శిక్ష కాదు.. ఒక విధంగా చూస్తే అది వారికి వరం అనే చెప్పాలి.  ఎందుకంటే.. వారికి జైలు శిక్ష ప‌డే స‌మ‌యానికి ఆలనాపాలనా చూసుకునేందుకు ఎవరూ ఉండని పరిస్థితి.  ఆ దశలో కోర్టు వీరిని జైల్లో కూర్చోబెట్టి వారికి సౌకర్యాలు కల్పించి వారి ఆరోగ్యపరమైన అలనాపాలనా చూసేందుకు సిబ్బందిని నియమించడంతో రాజభోగాలు అనుభవిస్తారు.

దేశంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆర్థికపరమైన నేరాలకు పాల్పడిన ముఖ్య‌మంత్రులు ఉన్నారు. వారిలో కొంద‌రికి శిక్ష‌లు ప‌డ్డాయి. అయితే, వారిపై కేసుల విచార‌ణ సుదీర్ఘ‌ కాలం కొన‌సాగ‌డంతో వారికి శిక్ష‌లు ప‌డే స‌మ‌యానికి వారు వృద్ధాప్యానికి చేరుకుంటున్నారు. ఇలాంటి వారిలో కొంద‌రిని ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటే.. ఓం ప్రకాష్ చౌతాలా, లాలూ ప్రసాద్ యాదవ్,   జయలలిత వంటి వారి గురించి చెప్పుకోవాలి. ముందుగా హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాల గురించి  చెప్పుకుంటే.. ఈయన పాతికేళ్ల  కిందట హరియాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. 1999-2000లో జూనియర్ బేసిక్ ట్రెయిన్డ్  టీచర్ల నియామక కుంభకోణంలో  భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డ్డారు. ఈ కేసు విచార‌ణ న్యాయ‌వ్య‌వ‌స్థ‌లో సుదీర్ఘ‌ కాలం సాగింది. ఎట్టకేలకు 2013 జనవరి 22న ఆయనకు 10ఏళ్లు జైలుశిక్ష ప‌డింది. శిక్ష పడిన సమయానికి  ఆయన వయస్సు 78 సంవత్సరాలు. ఎనిమిదేళ్లు శిక్ష అనుభవించి 2021లో విడుదలయ్యారు. ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత విష‌యానికి వ‌స్తే.. ఆమె 1991-1996 మధ్య కాలంలో 66.65 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులను క‌లిగి ఉన్నార‌నే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈకేసు 1996 నుండి 2014 వరకు కోర్టులో విచార‌ణ జ‌రిగింది. చివ‌రికి సుదీర్ఘ‌కాలం త‌రువాత 2014 సెప్టెంబర్ 27న నాలుగేళ్లు జైలు శిక్ష ప‌డింది. అయితే, 2015లో ఆమెను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆమెకు శిక్షప‌డిన స‌మ‌యంలో ఆమె వయస్సు 66 సంవత్సరాలు. కేవ‌లం 21 రోజులు మాత్రమే ఆమె జైలుజీవితం గ‌డిపారు. 

ఆ తరువాత దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గడ్డి కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పై కేసు 1996 నుండి 2018 వరకు వివిధ కోర్టుల్లో విచార‌ణ జ‌రిగింది. సుదీర్ఘ‌కాలం విచార‌ణ త‌రువాత 2013లో ఐదేళ్ల పాటు కోర్టు ఆయ‌న‌కు జైలు శిక్ష విధించింది. అప్పుడు ఆయ‌న వ‌య‌స్సు 65ఏళ్ళు. మూడున్న‌రేళ్లు జైలు జీవితం గ‌డిపాడు.  ఇలా.. అధికారాన్ని అడ్డుపెట్టుకొని భారీ ఎత్తున అవినీతికి పాల్ప‌డిన వారంతా 10 నుంచి 20యేళ్ల సుదీర్ఘ విచార‌ణ త‌రువాత వృద్ధాప్యంలో జైలుకెళ్లిన ప‌రిస్థితి. ఇదే త‌ర‌హాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కేసును చెప్పుకోవ‌చ్చు. జ‌గ‌న్ రెడ్డిపై అనేక అక్ర‌మాస్తుల కేసులు ఉన్నాయి. ఆయ‌న‌పై ఎన్ని కేసులున్నా ఇప్ప‌టికీ బెయిల్ పై సుదీర్ఘ‌కాలం బ‌య‌ట‌నే ఉంటున్నారు. ఇటీవ‌లి కాలంలో ఆయన కోర్టులో వాయిదాల‌కు కూడా హాజ‌రు కాలేదు. న్యాయస్థానానికి వెళ్లకుండా ఎలా మైంటైన్ చేస్తున్నారు. అ చట్టాలకు ఆయనేమైనా అతీతుడా.. సామాన్య ప్ర‌జ‌ల‌కు లేని న్యాయ‌ప‌ర‌మైన సౌల‌భ్యం ఆయ‌న‌కు ఎందుకు కోర్టులు క‌ల్పిస్తున్నాయ‌నేది ప్ర‌శ్న‌గా మారింది. 

ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి జగన్ రెడ్డి 2004-2009 కాలంలో 43వేల కోట్లకుపైగా ఆదాయానికి మించిన అక్ర‌మాస్తులు క‌లిగి ఉన్నార‌నే ఆరోపణల‌తో ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయన క్విడ్ ప్రోకో పద్ధతిలో ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన వారి నుంచి  త‌న‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించార‌ని ఆరోపణలపై న్యాయస్థానంలో కేసులు నమోదయ్యాయి. 14ఏళ్లుగా ఈ కేసులు కోర్టుల్లో విచార‌ణ జ‌రుగుతున్నాయి. ఈ కేసుల నేప‌థ్యంలో 2012లో ఆయ‌న అరెస్ట్ అయ్యారు. ఆ స‌మ‌యంలో ప‌ద‌హారు నెల‌లు జైలులో శిక్ష అనుభ‌వించి బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అప్ప‌టి నుంచి ఆయన బెయిల్ పైనే ఉన్నారు. జ‌గ‌న్ రెడ్డికి ప్ర‌స్తుతం 52ఏళ్లు. ఇప్ప‌టికే ఈ కేసుల విచార‌ణ‌లో 14ఏళ్లుగా సాగుతోంది. ఆ కేసుల విచారణ వేగం చూస్తుంటే మరో దశాబ్దం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.   అప్ప‌టికీ ఆయ‌న వ‌య‌స్సు అర‌వైయేళ్లు దాటుతుంది. ముఖ్య‌మైన కేసుల విచారణ కూడా నత్తనడకతో పోటీ పడుతుండటం వల్ల  స‌రైన స‌మ‌యంలో నిందితుల‌కు శిక్ష‌లు ప‌డ‌టం లేదు. జస్టిస్ డిలేయిడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్న సూక్తి రాజకీయనాయకులకు వర్తించదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. కానీ కేసుల విచారణ పూర్తి కావడానికి ఏళ్లూ పూళ్లు పడుతుండటంలో నేతలలో శిక్ష పడుతుందన్న భయం కనిపించడం లేదు. దీని వల్ల   మిగిలిన వారిలోనూ న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల పట్ల భయం, గౌరవం లేకుండా పోతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది.  రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత అక్ర‌మ‌ సంపాదనకు పాల్పడాలంటే భయపడేలా న్యాయ‌స్థానం వేగంగా తీర్పులు ఇవ్వాల్సిన అవసరం ఉందని మెజారిటీ ప్రజలకు డిమాండ్ చేస్తున్నారు.  

-భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి 
న్యాయవాదవిద్యార్థి. అమెరికా.

By
en-us Political News

  
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.