తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎట్టకేలకు రాజకీయంగా మళ్లీ క్రియాశీలం అవుతున్నారు. 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి పాలై.. అధికారానికి దూరమైన క్షణం నుంచీ కేసీఆర్ దాదాపుగా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అనే విధంగా యాక్టివ్ పోలటిక్స్ కు దాదాపు దూరమయ్యారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అడపదడపా పార్టీ నేతలను ఎవరినైనా కలిసినా వారిని ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడారే తప్ప ఆ ఫామ్ హౌస్ వీడి బయటకు రాలేదు.
పార్టీ పరాజయం పాలైన తరువాత ఇప్పటి వరకూ ఆయన ఫామ్ హౌస్ వీడి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల మీద లెక్కించవచ్చు. ఒక సారి అంటే ఒకే ఒక రోజు అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీలో ఆయన నోరెత్తింది లేదు. బయటకు వచ్చి మీడియాతో ముక్త సరిగా రెండు మాటలు మాట్లాడి మళ్లీ ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. తాజాగా ఇటీవల పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు ఫామ్ హౌస్ వీడి తెలంగాణ భవన్ కు వచ్చారు. అక్కడా అంతే ప్రసంగం ముగించేసి మళ్లీ ఫామ్ హౌస్ కు చేరిపోయారు. ఇక ఇప్పుడు తాజాగా ఆయన పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. అయితే ఆ సమావేశం కోసం కేసీఆర్ బయటకు రాలేదు. పార్టీ నేతలనే ఫామ్ హౌస్ కు పిలిపించుకున్నారు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి పార్టీ దూరంగా ఉండటం, అనూహ్యంగా బీజేపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడంతో రాజకీయంగా బీఆర్ఎస్ కథ ఇక ముగిసినట్లేనన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్న సమయంలో కేసీఆర్ పార్టీ నేతలతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఆయన తెలంగాణ భవన్ కు రాకుండా నేతలను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడటమే పార్టీ వర్గాలలో ఒకింత అసంతృప్తికి కారణమయ్యింది. ఈ విషయాన్ని పార్టీ నేతలే ప్రైవేటు సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. అసలు ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీని పోటీకి దూరం పెట్టడమే ఒక రాజకీయతప్పదమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. హరీష్ రావు వంటి సీనియర్ నాయకుడు ఈ విషయాన్ని నేరుగా కేసీఆర్ కే చెప్పి.. పార్టీ తరఫున అభ్యర్థిని రంగంలోకి దింపుదామని కోరినప్పటికీ కేసీఆర్ వినలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పోటీకి దూరం కావడం వల్ల బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అన్న విమర్శలకు, ఆరోపణలకు బలం చేకూర్చినట్లు అవుతుందని ఎంతగా చెప్పినప్పటికీ కేసీఆర్ పట్టించుకోలేదని అంటున్నారు. సరే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో రెండు బీజేపీ గెలుచుకోవడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ పోలిటికల్ స్పేస్ ను బీజేపీ ఆక్రమించేసిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో కేసీఆర్ ఫామ్ హౌస్ లో పార్టీ నేతలలో జరిపిన భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. అంతా బానే ఉన్నా.. కేసీఆర్ ఈ సమావేశాన్ని తన ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేయడం పట్ల మాత్రం బీఆర్ఎస్ నేతలలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇలా ఫామ్ హౌస్ లో భేటీల వల్ల ప్రజల దృష్టిలో పలుచన అవుతామన్న ఆందోళనా వారు వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/politically-active-but-confine-to-farm-house-39-194050.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.