తెలంగాణలో ఆట మొదలైంది !

Publish Date:Jul 5, 2022

Advertisement

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా..అనేది పాత సామెత, మోడీ, షా జోడీ  తలచుకుంటే, సీబీఐ,ఈడీ దాడులకు కొదవా అన్నది, కొత్త సామెత. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రతిపక్ష పార్టీలు మాత్రం, అదే అభిప్రాయంతో ఉన్నాయి. అదే ఆరోపణ చేస్తున్నాయి. సీబీఐ, ఈడీ ఇతర దర్యాప్తు సంస్థలను ప్రయోగింఛి, ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను మోడీ, షా జోడీ పడగొడుతున్నాయని.కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

అయితే, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరోపణలు ఎదుర్కోవడం కొత్త కాదు. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే, సుప్రీం కోర్టు, సీబీఐని, ఏకంగా, కేంద్ర ప్రభుత్వం పలకమన్నపలుకులు పలికే, ‘పంజరంలో చిలక’ అని అభివర్ణించింది. అలాగే, ఇప్పడు మోడీ ప్రభుత్వం హయాంలోనూ, కేంద్ర దర్యాప్తు సంస్థలు అందుకుభిన్నంగా వ్యవహరించడం లేదు.   ఈ మధ్యకాలంలోనే నేషనల్  హెరాల్డ్ కేసు విషయంలో ఈడీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సామాన్లు జారీ చేసింది. రాహుల్ గాంధీని ఐదారు రోజుల పాటు విచారించింది. ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేసింది. మహా రాష్ట్రలో మహ వికాస్ అఘాడీ (ఎంవిఎస్) ప్రభుత్వం కూలిపోవడానికి కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలే కారణమని, అన్ని పార్టీలు ఆరోపించాయి. 

ప్రతిపక్షాల ఆరోపణలు ఎలా ఉన్నా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎనిమిది సంవత్సరాలలో ఇంతవరకు తొమ్మిది ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు కులిపొయాయి. నిజానికి, మోడీ షా జోడీకి ఇదొక ఆటగా మారిందని పరిశీలకులు అంటున్నారు. అయితే, ఈ ఆటలో ప్రతిపక్షపార్టీలు తక్కువ తిన్నాయా, అంటే లేదు. మహారాష్ట్ర విషయాన్నే తీసుకుంటే, 2019  ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, బీజేపీకి వచ్చిన (106) సీట్లలో కొంచెం అటూ ఇటుగా సగం సీట్లు (55) వచ్చిన  శివసేన ముఖ్యమంత్రి కుర్చీ కోసం పట్టుపట్టి, బీజేపీతో తెగతెంపులు చేసుకుంది.

కాంగ్రెస్, ఎన్సీపీ’ లతో  చేతులు కల్పింది. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ముఖ్యమంత్రిగా, మూడు పార్టీల కూటమి,  మహా వికాస అఘాడీ (ఎంవిఎస్) ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పడు ఆ అఘాడీ ప్రభుత్వంలో అగాధంలో కూరుకుపోయింది. సో .. మహా రాష్ట్ర విషయంవరకు పొలిటికల్ జస్టిస్, పొయిటిక్ జస్టిస్ ఫుల్ఫిల్  అయ్యాయి అనుకోవచ్చునని, టిట్  ఫర్  టాట్’ పడతిలోనే బీజేపీ శివసేనను చీల్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని  బీజేపే అనుకూల మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  
సరే, అది వేరే విషయం’ ఇప్పడు మోడీ షా నజర్, తెలంగాణ మీద పడింది. అయితే, మహారాష్ట్ర టైపులో ఇప్పటి కిప్పుడే తెరాస ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయక పోవచ్చును, కానీ, 2023 ఎన్నికలకు ముందు తెరాస ఆర్థిక ములాలపై దెబ్బకొట్టడం ఖయామని, అంటున్నారు. అంతే కాదు, అందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపరేషన్’ వర్క్ తెరాస ఎంపీ నామా నామా నాగేశ్వ‌ర‌రావు ఆస్తుల జప్తుతో మొదలైందని అంటున్నారు. 

 కాగా, నామా నాగేశ్వ‌ర‌రావుకు చెందిన మ‌ధుకాన్ గ్రూప్’ కు చెందిన  రూ.96 కోట్ల విలువైన ఆస్తుల‌ను ఈడీ జ‌ప్తు చేసింది. రాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల  అభ్యర్ధి  య‌శ్వంత్ సిన్హాకు మద్దతుగా, తెరాస సమావేశం  నడుస్తున్న సమయంలోనే, రాష్ట్రం లోపలా వెలుపలా ఉన్న నామా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అయితే, ఇది ఇంతటితో ఆగదని, తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ జాబితాలో, ఇంకా పెద్ద చేపలే ఉన్నాయని అంటున్నారు. 

నామా త‌ర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరుంది, అయన బాగోగులు చూసే, ఒక రాజ్యసభ సభ్యునితో పాటుగా. ఒక లేడీ ఎమ్మెల్సీ పై  బీజేపీ దృష్టిసారించిన‌ట్లు స‌మాచారం. ఆ ఇద్దరికి సంబందించిన ఆస్తులు, వ్యాపారాలు, బినామీ వ్యవఝారలపై ఈడీ ఆరా తీస్తోంద‌ని, తెలుస్తోంది. ఈ ఇద్దరు నెక్స్ట్ టార్గెట్ అవుతారని టీఆర్ఎస్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. నిజానికి, ఇందుకు సంబదించిన పక్కా సమాచారంతో సదరు ఎంపీ, ఎమ్మెల్సీలను తెరాస నాయకత్వం అప్రమత్తం చేసిందని అంటున్నారు.

ప్రస్తుతం ఆ ఇద్దరు నేతలు దేశంలో ఉన్నారా, లేదా అనే విషయంలోనూ అనుమానాలున్నాయని అంటున్నారు. అదే నిజమైతే, తెలంగాణలోనూ మోడీ, షా జోడీ అసలు అట మొదలైందని అనుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు, తెరాస సర్కార్’ను కూల్చే ప్రయత్నం జరగక పోయినా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత, బీజేపీకి 20- 30 సీట్లు వచ్చినా, ఆ తర్వాత, మహా రాష్ట్ర తరహాలో మూడు పార్టీల (తెరాస, కాంగ్రెస్, ఎంఐఎం) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినా, ఆ ప్రభుత్వం మనుగడ ముడునాళ్ళ ముచ్చటే అవుతుందని, బీజేపీ ప్రస్తుతం అదే వ్యూహంతో అడుగులు వేస్తోందని అంటున్నారు.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.