ఢిల్లీ మద్యం కుంభకోణంలో పులుకడిగిన ముత్యంలా తిరిగి వస్తానంటూ.. కవిత చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వడంతో నిజమయ్యాయనే చెప్పాలి. అయితే.. మద్యం కేసులో నిందితురాలిగా కవిత ఉండటం వల్లే బీఆర్ ఎస్ 2023 ఎన్నికల్లో పరాజయం పాలైందంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన హుందాతనాన్ని తగ్గించాయని పరిశీలకులు అంటున్నారు. కవిత సైతం తన వల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు.
దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది. అప్పట్లో అంటే కవిత అరెస్టు అయినప్పుడు మంత్రులుగా ఉన్న కేటీఆర్, హరీష్రావు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేయడం.. కవిత జైల్లో ఉన్నప్పుడు.. ఆమెను కలుసుకునేందుకు గంటల కొద్దీ వెయిట్ చేయడం.. వంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ బీఆర్ఎస్ అప్పట్లో కవితకు అండగా నిలిచిందని చెప్పుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నది.
అలాగే బీఆర్ఎస్ అధినేత, అప్పటి సీఎం కేసీఆర్ అప్పట్లో మీడియాతో మాట్లాడుతూ కవితపై అక్రమంగా కేసులు బనాయించారని.. తనపై ఉన్న అక్కసును తన కుమార్తెపై తీర్చుకుంటున్నారని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన బైట్లనూ సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసినదేమిటంటే.. కవితకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో క్లీన్ చిట్ ఇస్తూ తీర్పు వెలువడిన తరువాత బీఆర్ఎస్ బీజేపీ టార్గెట్ గా విమర్శలు గుప్పించాలి.. కానీ అందుకు భిన్నంగా కవితకు తాము అప్పట్లో అండగా నిలబడ్డామని చెప్పుకోవడానికే ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు.
కవిత కాదన్నా సరే.. వారు అదే పాట పాడుతున్నారు. కేవలం కవిత అప్పట్లో తనకు పార్టీ అండగా నిలవలేదని చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టేందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియా తన పేజీలన్నిటినీ నింపేస్తున్నది. దీనిని బట్టి చూస్తుంటే కవిత బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ ముదిరిందని అవగతమౌతోంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ ఇప్పుడు కవిత ఫియర్ తో వణికిపోతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/political-fight-between-kavitha-and-brs-39-214870.html
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.