సమస్యఒదిలేసి వైసీపీ సర్కస్ ఫీట్లు! టెన్త్ ఫలితాలపై పొలిటికల్ బ్లేమ్ గేమ్

Publish Date:Jun 8, 2022

Advertisement

స్కూళ్లలో పాఠాలు చెప్పనివ్వకుండా మరుగుదొడ్లు ఫోటోలు తీసే పనికి టీచర్లను పెడితే ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఉపాధ్యాయులను సారా దుకాణాల వద్ద కాపలాకి పంపిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. టీచర్లను మానసికంగా వేధిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. పాఠాలు బోధించేవారు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేసేలా సర్కార్ నియంతృత్వంగా వ్యవహరిస్తే ఇలాగే ఉంటుంది.

స్కూళ్లలో దామాషా ప్రకారం మాస్టార్లను నియమించకపోతే ఫలితాలు ఎలా వస్తాయి? పైసలిస్తే ఫలితాలు రావు. మౌలిక సదుపాయాలు ఇచ్చినంత మాత్రాన ఫలితాలు మెరుగు పడవు.

ప్రాథమిక విద్యలో ప్రతి సబ్జెక్ట్ కి ఒక టీచర్ ని వేయండి ఫలితాలు ఎందుకు రావో చూద్దాం. హైస్కూళ్లలో పూర్తి స్థాయిలో టీచర్లను నియమిస్తే ఫలితాలు ఎందుకు రావో చూద్దాం. ఇకనైనా మారండి. మమ్మల్ని స్వేచ్ఛగా పనిచేయనివ్వండి’ ఏపీలోని ఓ సగటు ఉపాధ్యాయుడు ఆవేదనతో అన్న మాటలివి. 

ఏపీ పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సుమారు రెండు లక్షల మంది ఫెయిలవడం, పాస్ శాతం 67.26 శాతానికి పడిపోవడం, 71 స్కూళ్లలో ఒక్కరూ పాస్ కాని సందర్భంలో ఆ సగటు టీచర్ లో పెల్లుబుకిన ఆవేదన ఇది.ఈ ఏడాది టెన్త్ పాస్ శాతం దారుణంగా తగ్గిపోవడానికి కరోనా కారణమని కొందరు, ప్రభుత్వ వైఫల్యమే అని మరికొందరు, ప్రశ్నాపత్రాలు లీకవడం అని ఇంకొందరు, విద్యా వ్యవస్థను ప్రభుత్వం పట్టించుకోకపోవడమూ కారణమే అని కొందరు, స్కూళ్లలో టీచర్లే లేపోవడం అని ఇంకొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.  అధికార, విపక్షాలైతే బ్లేమ్ గేమ్ కు దిగారు.  కరోనా వల్ల రెండేళ్లు పరీక్షలు లేకపోవడం, ప్రత్యక్ష తరగతులకు అవకాశం లేక విద్యార్థులకు  ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించడం, నారాయణ విద్యాసంస్థలో ప్రశ్నాపత్రాలు ముందే లీకవడం లాంటి కారణాలను వైసీపీ సర్కార్ సాకుగా చూపిస్తోంది.  ఈ సారి పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు కరోనా వల్ల వారి 8 ,9 తరగతుల్లో పరీక్షలు నిర్వహించలేదని, అప్పుడు వారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ప్రమోట్ చేయడం కారణమే అని చెబుతోంది. ఆన్ లైన్ క్లాసులు విన్నట్లు కొందరు విద్యార్థులు నటిస్తూ, ఫోన్ లలో ఇతర వీడియోలు చూడడం వల్లే ఉత్తీర్ణత తగ్గడానికి కారణం అని చెప్పుకొస్తోంది.

నాడు- నేడు నెపంతో వైసీపీ సర్కార్ మూడేళ్లుగా ఆర్భాటపు ప్రచారం చేసుకుందని, తమ హయాంలో 90 నుంచి 95 శాతం వరకు టెన్త్ పరీక్షా ఫలితాలు రాబట్టామని.. వైసీపీ సర్కార్, జగన్ రెడ్డి తీరుతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం అయిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ రెడ్డి సర్కార్ అస్తవ్యస్థ విధానాల వల్లే 2 లక్షల మంది విద్యార్థులు ఒక విద్యా సంవత్సరం కోల్పోయే దుస్థితి వచ్చిందని నిప్పులు చెరిగారు. పరీక్షల్లో ఫెయిల్ అయింది విద్యార్థులు కాదని, ప్రభుత్వ వ్యవస్థలే అనేది ఆయన ఆరోపణ.

విద్యా వ్యవస్థను వైసీపీ సర్కార్ సర్వనాశనం చేసిందని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. టెన్త్ ఫలితాలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. ‘ఇది పదో తరగతి విద్యార్థుల ఫెయిల్యూర్ కాదు.. జగన్ రెడ్డి సర్కార్ ఫెయిల్యూర్’ అంటూ నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఫెయిల్ చేయడం ద్వారా అమ్మ ఒడి, సంక్షేమ పథకాలకు విద్యార్థులను దూరం చేసే కుట్ర జరిగిందని ఆయన ఆరోపణ. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహించిన టెన్త్ పరీక్షల్లో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ తో ఆభాసు పాలైందని విమర్శించారు. నాడు- నేడు పేరుతో 3 వేల 500 కోట్లు మింగేసిన వైసీపీ సర్కార్, డీఎస్సీ నిర్వహించలేదని, టీచర్లను నియమించలేదని, అందుకే పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఫెయిలయ్యారన్నారు. అందుకు ‘నారాయణ’ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారమే కారణం అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ వేయడం గమనార్హం. చదువు‘కొన్న’వాడివి నువ్వు రిజల్ట్స్ గురించి మాట్లాడడమేంటని వ్యక్తిగత విమర్శలకు దిగడంపై విమర్శలు వస్తున్నాయి.

ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కూడా రంగంలోకి వచ్చి.. ‘చదువంటే ఇసుక తోడడం కాదు. భవిష్యత్తుకు పెట్టుబడి.. పాఠశాల గోడలకు రంగువేయడం, పుస్తకాలు పంపిణీ చేయడం కాదు’ అంటూ జగన్ సర్కార్ ను ఎద్దేవా చేశారు. 71 స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణతా శాతాన్ని చూసి సీఎం జగన్ సిగ్గుతో తలదించుకోవాలని తూర్పారపట్టారు. భారీ సంఖ్యలో టెన్త్ విద్యార్థులు పెయిలవడానికి జగన్ సర్కార్ వైఫల్యమే కారణమని టీడీపీ నేత కొల్లు రవీంద్ర నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమ్మ ఒడి భారం తగ్గించుకునేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నించిందనే అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో 97 శాతం ఉత్తీర్ణత వస్తే.. వైసీపీ పాలనలో 67 శాతానికి పడిపోవడంపై ధూళిపాళ్ల నరేంద్ర నిప్పులు చెరిగారు. ప్రకటించిన దానికన్నా రెండు రోజులు ఆలస్యంగా ఫలితాలు విడుదల చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఏపీలో 20 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే విద్యా ప్రమాణాలు ఎలా మెరుగవుతాయని నిందించారు. ఇంగ్లీష్ మీడియంపై మోజుతో మాతృభాషను జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేయడంవల్ల కూడా విద్యార్థులకు భారీ నష్టం కలిగిందని విశ్లేషించారు.

ఇక ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెర మీదకు వచ్చారు. గతంలో కార్పొరేట్ సంస్థల అక్రమాలతో ఎక్కువ ఫలితాలు వచ్చేవని సెలవిచ్చారు. పరీక్షా ఫలితాలపై కోవిడ్ ప్రభావం పడిందట. ఉత్తీర్ణతా శాతం తగ్గడాన్ని విపక్షాలు వేలెత్తి చూపించకూడదంటున్నారు. దీన్ని విపక్షాలు అస్త్రంగా వాడుకుంటున్నాయని ఉపన్యాసం ఇచ్చారు. పైగా టెన్త్ ఫలితాలపై విపక్షాలు తలకాయ లేకుండా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. అసలు టీడీపీ హయాంలో మాదిరిగా పరీక్షల్లో అక్రమాలు జరగకుండా తమ ప్రభుత్వం అడ్డుకుందని, అందుకే ఉత్తీర్ణతా శాతం తగ్గిందని విశ్లేషించారు. కాపీ కొట్టేందుకు వీలుండే బిట్ పేపర్ తీసేయడం కూడా పాస్ శాతం తగ్గడానికి ఒక కారణం అంటున్నారు. అంటే నిఖార్సయిన వారు, నిజాయితిగా పరీక్షలు రాసిన వారే పాస్ అవడం తమ విజయం అని చెప్పుకొచ్చారు.

పరీక్ష ఫెయిలైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదనలో మునిగిపోతే.. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వారి భవిష్యత్తును మెరుగు పరిచేందుకు ఏం చేయాలో, ఎలా చక్కదిద్దాలొ ఆలోచించకుండా అధికార, విపక్షాల నేతలు ఇలా బ్లేమ్ గేమ్ ఆడుతుండడంపై విమర్శలు వస్తున్నాయి.

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.