Publish Date:Aug 29, 2022
భర్తతో వెళ్లి విశాఖపట్నం ఆర్కే బీచ్లో అదృశ్యమైన సాయిప్రియ ఆమె ప్రియుడు రవితేజపై పోలీసులు కేసు నమోదు చేశారు. రూ. కోటి ప్రజాధనం వృధాకు కారణమయ్యారంటూ కేసు పెట్టారు. సాయిప్రియ, రవితేజపై ప్రభుత్వ ధనం, సమయం వృథా చేసినందుకు కోర్టు అనుమతితో పోలీసులు కేసు నమోదు చేశారు. సాయిప్రియ చేసిన పనికి విలువైన ప్రజాధనంతో పాటు నేవీ, కోస్ట్గార్డ్, పోలీసుల సమయం వృథా అయ్యిందంటున్నారు పోలీసులు. మరోవైపు, తనకు భర్త ఉండగానే అతడ్ని మోసగించి వేరొకరిని పెళ్లి చేసుకుని ఆయన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందున ఆమెపై చర్యలకు దిగాలనుకున్నారు త్రీటౌన్ పోలీసులు.
అసలు విషయమేమిటంటే.. విశాఖపట్నానికి చెందిన 21 ఏళ్ల సాయిప్రియకు 2020లో వివాహమైంది. భర్త శ్రీనివాసరావు హైదరా బాద్లో ఒక ఫార్మాకంపెనీలో పనిచేస్తున్నాడు. తమ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకోవడానికి అతను విశాఖ వెళ్లా డు. ఆరోజు సాయింత్రం అలా బీచ్కీ తీసికెళ్లాడు. బీచ్ అనగానే సరదాగా గడపడమే కదా. ఏవో నాలుగు కబుర్లు, రెండు ఐస్క్రీమ్ లతో సాయింత్రం గడిపేయచ్చని, మాట్లాడుకోవచ్చని వాళ్లి ద్దరే వెళ్లారు. కొంత సేపటికి శ్రీనివాస్కి ఫోన్ వచ్చి కొద్దిగా అవతలకి నడుస్తూ ఫోన్ మాట్లాడాడు. అయి పోయి వెనక్కి తిరిగి చూస్తే భార్య సాయిప్రియ కనపడలేదు. రాకాసి అల లాక్కెళ్లిందేమో అని భయపడ్డాడు. బీచ్ అంతా కలయ తిరి గాడు. కానీ ఎక్కడా ఆమె జాడ లేదు. అంతే అక్కడి పోలీసులు రంగంలోకి దిగారు. అంతా వెతికినా వారికీ కనిపించలేదు. ఏకంగా శ్రీనివాస్ నే కొంతమంది అనుమానించారు.
యావత్ విశాఖ ఖంగారెత్తింది. శ్రీనివాస్ అత్తింటివారు, స్నేహితులు జల్లెడ పట్టినా ఆ అమ్మాయి చున్నీ కూడా దొరకలేదు. ఇదేం మాయరా నాయనా అని అనుకున్నారు. బాదపడ్డా రు. అంతలో ఒకవేళ నిజంగానే ఏదో పెద్ద అలా సముద్రంలోకి లాక్కెళ్లిందేమోనని సందేహాలు వ్యక్తమ య్యాయి. చాలామంది అదీ జరగవచ్చనుకున్నారు. అంతే వెంటనే భద్రతాదళాలు, హెలి కాప్టర్లతో సిద్ధ మయ్యారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకూ ఇది మరింత ఆసక్తికర అంశమైంది.
అమ్మాయి దొరకలేదు గాని కోటిరూపాయల ఖర్చు అయింది. ఆ తర్వాత ఆ అమ్మాయి నుంచి వీడియో కాల్ వచ్చిందని అమ్మాయి తండ్రే పోలీసులకు చెప్పారు. విషయమేమంటే, ఆమెగారికి ఈ పెళ్లి ఇష్టం లేదు. రవి అనే అబ్బాయిని విశాఖలో ప్రేమించింది. అతనితో బంగళూరులో ఉంది. అక్కడికి వెళ్లడా నికి పెద్ద స్కెచ్ వేసింది. దానికి బలయింది శ్రీనివాస్, తల్లిదండ్రుల పరువు. ప్రజాధనం కోటి రూపాయ ల ఖర్చు. మరో షాకింగ్ సంగతేమిటే, ఆ రోజు బీచ్కి సదరు ప్రేమికుడు కూడా రావడం! అంతా తెలిసిన తరువాత పోలీసులు ఇప్పుడు సాయిప్రియ, ఆమె ప్రియుడిపై కేసు నమోదు చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/police-file-case-on-saipriya-and-her-liver-39-142833.html
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
Publish Date:Aug 31, 2026
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న రాజకీయ సమీకరణాలపై చర్చోపచర్చలు మొదలయ్యాయి.