ఏపీలో వైసీపీ అనుబంధ సంస్థగా పోలీసు వ్యవస్థ

Publish Date:Oct 4, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక చట్టం అమలులో ఉందా? ఆ రాష్ట్రంలో న్యాయం అన్న పదానికి మరో అర్ధం ఉందా? సామాన్య ప్రజల నుంచి పరిశీలకుల వరకూ అందరిలోనూ ఇదే సందేహాలు, అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో భారత రాజ్యాంగం అమలు అమలుకు నోచుకోవడం లేదన్న భావన రాష్ట్ర ప్రజలలో వ్యక్తం అవుతోంది. నిరసన తెలిపే హక్కును అధికారపార్టీ కాలరాసేసిందనీ,  పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి అనుబంధ సంస్థగా పని చేస్తోందనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ విధానాలను వ్యతిరేకించినా, నిరసన గళం వినిపించినా జైళ్లు నోళ్లు తెరుస్తాయి. లాఠీలు వీర విహారం చేస్తాయి. విపక్ష నేతలపైనే కేసులు నమోదౌతాయి.

అధికార పార్టీకి చెందిన వారు హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసినా కేసు నమోదు చేయడానికి పోలీసులు ముందు వెనుకలాడుతారు. అనివార్యంగా అరెస్టు చేయాల్సి వచ్చినా అరెస్టుకు ముందు, తరువాత కూడా రాచమర్యాదలు చేస్తారు. బెయిలుకు అడ్డు చెప్పరు. దర్యాప్తు ముందుకు కదలదు. అదే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారి విషయంలో చిన్న చిన్న ఘర్షణ కేసుల్లో కూడా హత్యాయత్నం కేసులు నమోదు చేస్తారు. ఎప్పుడో రెండు నెలల కిందట జరిగిన ఘర్షణ సంఘటనపై ఇప్పుడు హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయడానికి రెడీ అయిపోతున్నారు. అవును మాచర్లలో అగస్టు 30న జరిగిన ఘర్షణ కేసులో ఇప్పుడు ఏకపక్షంగా ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంగళ్లు కేసులో నాలుగు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అక్షింతలు వేసింది, ఆ కేసులో ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిలును రద్దు చేయడానికి నిరాకరించింది. సుప్రీం కోర్టు ఏపీ పోలీసులపై అక్షింతలు వేసిన రోజునే  మాచర్ల పోలీసులు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కేసు బనాయించారు. ఎవరో ఫిర్యాదు చేశారంటూ కేసు నమోదు చేశారు.

ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన వారిని అరెస్టు చేయడమే ధ్యేయమన్నట్లు అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా   వందల మంది పోలీసులతో తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్టు చేస్తారు. పద్ధితి ఉండదు. న్యాయస్థానాలకు సైతం తప్పుడు సమాచారం ఇవ్వడానికి వెనుకాడరు.    రాజకీయకుట్రల్లో పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి దన్నుగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా, రాష్ట్ర పోలీసు శాఖ పరువు మంటగలుస్తున్నా ఖాతరీ లేదు. ఏలిన వారి సేవలో తరిస్తే చాలు అన్నట్లుగా ఏపీ పోలీస్ తీరు ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థతి అధ్వానంగా మారిపోయింది. దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు యథేచ్చగా జరుగుతున్నా నో పోలీస్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలిపారంటూ అరవై మందిపై కేసులు పెట్టారు.   పోలీసు యాక్ట్ 30, సెక్షన్ 144 ఆంక్షలు రాష్ట్రంలో నిరవధికంగా అమలు అవుతున్నాయి. ఏపీలో ఎమెర్జెన్సీ పరిస్థితులు కొలువుతీరి ఉన్నాయి.  అధికార పార్టీ నేతల అండతో దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్న వారిపై నో కేస్..విపక్ష నేతలపై రాజకీయ వేధింపుల విషయంలో మాత్రం పోలీసులు చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.  

 ఏపీ పోలీస్ వ్యవస్థ జగన్ పార్టీ అనుబంధ సంస్థగా మారిపోయిందని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. జగన్ రెడ్డి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక మూల దురాగతాలు, దారుణాలు జరిగిపోతున్నా అటు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అసలా విషయమే మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. అసలు ఏపీలో పోలీసు వ్యవస్థ ఎందుకు పని చేస్తోంది. ఎవరి తరఫున పని చేస్తోంది అన్న ప్రశ్నలు జనబాహుల్యంలో వినిపిస్తున్నాయి.  
అధికార పార్టీ అరాచకాలకు, అన్యాయాలకు, అడ్డగోలు దాడులకు వత్తాసు పలకడానికీ, వారి తరఫున ప్రత్యర్థులపై కేసులు పెట్టడానికే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పరిమితమైందా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్ష నేతలను అడ్డగోలుగా అరెస్టు చేయడానికీ, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారిపై కేసులు బనాయించడానికీ తప్ప పోలీసులు సామాన్యుల రక్షణ కూడా తమ విధినిర్వహణలో భాగమని మరిచిపోయారా అన్న అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు. 

అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన మాజీ డ్రైవర్ ను హత్య చేసి డోర్ డెలివరీ చేసినా పోలీసులు ఆయనకు కొమ్ము కాయడానికే ప్రయత్నించడం, తన సోదరిని వేధిస్తున్నాడని నిలదీసిన బాలుడిని హత్య చేసి దహనం చేయడం వంటి సంఘటనలు జరిగిన సందర్భంలో పోలీసులు తీరు బాధితులకు స్వాంతన కలిగించేలా నిందితులను అరెస్టు చేయడం, చర్యలు తీసుకోవడానికి బదులుగా నిందితులకు వత్తాసుగా నిలిచిన సంఘటను నిత్యం జరుగుతున్నాయి.  మహిళలపైఅత్యాచారాలు, అఘాయిత్యాలు నిత్యకృత్యమైపోయాయి. విపక్ష పార్టీ నేతలపై వైసీపీ మూకలు యథేచ్ఛగా దాడులకు పాల్పడినా పోలీసులు మాత్రం అధికార పార్టీకి దన్నుగా నిలిచి బాధితులపైనే కేసులు పెడుతున్న సంఘటనలు కొకొల్లలు. అంగళ్లులో విపక్ష నేతపై వైసీపీ వాళ్లు రాళ్ల దాడి చేస్తే.. కేసులు మాత్రం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలపై నమోదు చేశారు. ఏ సందర్భంలోనూ కూడా బాధితులకు అండగా పోలీసులు నిలిచిన సందర్భం కనిపించదు. గుంటూరు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ జరిగితే నో పోలీస్. అదే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనిమిది రోజుల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోతే.. నో పోలీస్. ఆ చిన్నారి అదృష్టం, తల్లిదండ్రుల అదృష్టం దాదాపు 24 గంటల తరువాత నరసరావు పేట ఉప్పల పాడు వద్ద చిన్నారి ట్రేస్ అయ్యింది. తల్లిదండ్రుల వద్ద కు చేరిందనుకోండి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డూ అదుపూ లేకుండా నేరాలు జరుగుతుంటే పోలీసులు మాత్రం అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. మొత్తంగా ఏపీ పోలీసుల ప్రతిష్ట గంగలో కలిసిపోయినా పోలీసు బాసులకు పట్టడం లేదు. వందల మంది పోలీసులను ప్రభుత్వ పెద్దల, వైసీపీ నేతల ఆదేశాలను అమలు చేయడానికి నియోగించి రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికొదిలేశారు. జిల్లాల పర్యటనలో ఉన్న చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడానికీ, ఆయన అరెస్టు అనంతరం వెల్లువెత్తిన శాంతియుత ర్యాలీలు, నిరసనలను అణచివేయడానికి మాత్రం వేల సంఖ్యలో పోలీసుల మోహరిస్తారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణను అరెస్టు చేయడానికి , ఆయన నివాసాన్ని చుట్టుమట్టడానికీ మాత్రం వందల సంఖ్యలో పోలీసులు రెడీగా ఉంటారు. అయితే బాధితుల పక్షాన నిలవడానికీ, వారికి న్యాయం చేయడానినీ, దాడులకు గురయ్యే వారిని రక్షించడానికీ మాత్రం నో  పోలీస్. ఇదీ ఏపీలో రాష్ట్ర పోలీసుల తీరు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అధికార పార్టీ అనుబంధ సంస్థగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.