తెరపైకి మళ్లీ పాత పంచాయతీ

Publish Date:Jul 19, 2022

Advertisement

తెలుగు రాష్ట్రాల మద్య పాత పంచాయితీ  మళ్లీ కొత్తగా మొదలైంది. పోలవరం ఎత్తు  అంశాన్నిమళ్ళి తెరమీదకి తీసుకు వచ్చింది తెలంగాణా ప్రభుత్వం. ఇటీవలి గోదావరి  వరదలతో ఈ చర్ఛ పోలవరంపై చర్చ మళ్ళి మొదలైంది. పోలవరం పూర్తయితే భద్రాచలానికి ముంపు ముప్పు పెరుగుతుందన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అయితే మంత్రి పువ్వాడ వ్యాఖ్యలను ఏపీ మంత్రి అంబటి ఖండించారు. పోలవరంపై అన్ని సర్వేలు చేసిన తర్వాతే కేంద్రం అనుమతులు ఇచ్చిందన్న అంబటి రాంబాబు  వరదలు వచ్చినప్పుడల్లా పోలవరం ఎత్తుపై రాజకీయం చేయడం సరి కాదన్నారు ఆయనకు హితవు పలికారు.  పోలవరం  గేట్లు   ఎత్తడంలో జాప్యం  వల్లే ఈసారి వరద తీవ్రత పెరిగిందని విమర్శించిన పువ్వాడ, గోదావరికి ఎప్పుడు వరద వచ్చినా ఇదే పరిస్ధితి పునరావృతమౌతుందనీ అందుకే పోవలరం ఎత్తు తగ్గించాలన్నదే తమ డిమాండ్ అని పునరుద్ఘాటించారు పోలవరం స్పిల్ వెల్ 50,000 క్యుసేక్కులకి పెంచారు .ప్రాజెక్ట్ లో గరిష్టం గా 15 రోజులు నీటి మట్టం నిలవ ఉండే అవకాశం ఉంది. అందు వల్ల భద్రాచలాని కి ఎలాంటి ముప్పు ఉండదు. భద్రాచలం లో 80 అడుగుల కరకట్ట నిర్మాణం జరిగింది.

పోలవరం తో సంభందం లేకుండా ప్రస్తుతం 50నుంచి60 అడుగుల నీటిమట్టం నమోదు అవుతోంది. పోలవరం నుంచి వచ్చే నీటి మట్టం 43 అడుగులని దాని వల్ల భద్రాచలానికి ఎటువంటి ముప్పు  ఉండదన్నది ఏపీ వాదన. పనిలో పనిగా పువ్వాడ కొత్త డిమాండ్ ను కూడా తెరమీదకు తీసుకువచ్చారు. భద్రాచలాన్ని ఆనుకుని  ఉన్న ఐదు గ్రామాలనూ తిరిగి తెలంగాణలో కలిపేయాలన్నారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాలలోనే ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు.  

ఎటపాక, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు, గుండాల పంచాయతీలను తెలంగాణలో కలపాలని, వరద వచ్చినప్పుడల్లా ఈ గ్రామాలలో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. డిమాండ్‌ చేశారాయన. రాజకీయంగా ఇబ్బంది వచ్చిన ప్రతి సారీ తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు పోలవరం ప్రాజెక్టు, విలీన మండలాల అంశాన్ని తెరమీదకు తేవడం పరిపాటిగా మారిందని ఏపీ విమర్శిస్తోంది.

పోలవరం కారణంగా భద్రాచలంకు ముప్పు ఏర్పడుతుందన్న వాదనకు ఎలాంటి హేతుబద్ధత, శాస్త్రీయత లేదని చెబుతోంది. గతంలో కూడా గోదావరికి భారీ వరదలు వచ్చాయని,కానీ తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండానే పోలవరాన్ని నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని,కేంద్రం నిధులు సమకూరుస్తోందని,ఏదైనా కేంద్రం చేతిలోనే ఉందని ఏపీ చెబుతున్నది. రాష్ట్రాల మధ్య చిచ్చు రగిల్చే ఇటువంటి వ్యాఖ్యలు ఎంత మాత్రం సమజంసం కాదని అంటోది.

By
en-us Political News

  
ఝార్ఖండ్ రాజకీయాలు మరోసారి తీవ్ర ఉత్కంఠ రేకెత్తించాయి.
ఆంధ్రప్రదేశ్ లో సాయి కృష్ణ అనుమానాస్పద లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలు తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ చేసింది.. విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగానే.. వైసిపి నాయకులు విమర్శలతో చెలరేగిపోయారు. వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు అలవాటుగా తన నోటికి పని చెప్పారు
బీజేపీ, ఎన్‌డీఏ నైతిక మద్దతుతో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన నత్వానీ.. ఇండియా కూటమికి గట్టి షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల కంటే అధికార కూటమికే స్పష్టమైన సంఖ్యాబలం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాను మట్టికరిపించి నత్వానీ విజేతగా నిలవడం హాట్ టాపిక్‌గా మారింది.
2024 ఎన్నికలలో పరాజయం తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన నాని.. ఇప్పుడు పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడం సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన దశకు చేరుకున్నాయి
ఈ భవనాన్ని అలాగే వదిలేయడం వల్ల ఇప్పటివరకు 6 కోట్ల రూపాయల ప్రజాధనం బుడిదలో పోసిన పన్నీరైందన్నారు.
సూర్యనారాయణ రెడ్డికి సొంతంగా మాట్లాడే శక్తి లేదని, చేతిలో స్క్రిప్ట్ ఉంటే తప్ప ఆయన ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేశారు. ఆయన ప్రవర్తనను సినీ నటుడు బ్రహ్మానందం హావభావాలతో పోలుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఏసీ రూముల్లో కూర్చుని సోషల్ మీడియా వేదికగా అసత్యాలు ప్రచారం చేయడం కాదు.. ధైర్యముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి నేరుగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఉద్యోగాల భర్తీపై బహిరంగ చర్చకు తాను ఎప్పుడైనా సిద్ధమేనని లోకేష్ స్పష్టం చేశారు.
తమిళ రాజకీయాల్లో డీఎంకే చిరకాల మిత్రుడు ఎండీఎంకే అధ్యక్షుడు వైకో తాజాగా స్టాలిన్‌కు ఊహించని షాక్ ఇచ్చారు.
ఎవరికీ ఉపయోగపడకుండా ఖాళీగా పడి ఉన్న ఈ ప్యాలెస్ నిర్వహణ కోసమే నెలకు లక్షలాది రూపాయల ప్రజాధనం ఖర్చవుతుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణకు భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై ఈగల్ ఫోర్స్ మరోసారి ఉక్కు పాదం మోపింది.
వైసిపి నేత పెర్ని నాని ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పవన్ కళ్యాణ్ ఆంధ్రా ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదనీ.. కానీ తెలంగాణలో ఎవడో ఒంట్లో బాలేదు అంటే వస్తున్నా తమ్ముడూ అంటూ వెళ్ళిపోయారంటూ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఇటీవల ఒక జాతీయ టీవీ చానల్ కు కవిత ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం వస్తే తిరిగి సొంత గూటికి వెడతారా అన్న ప్రశ్రకు ఆమె భావోద్వేగంగా స్పందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.