కేంద్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్ధతకు పరీక్షగా పోలవరం

Publish Date:Jul 14, 2014

Advertisement

 

 

ఈరోజు రాజ్యసభ కూడా పోలవరం బిల్లును ఆమోదించింది. ఇక రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడం కేవలం లాంఛనప్రాయమే. అయితే ఇల్లలకగానే పండగ కాదన్నట్లు ఇప్పటి నుండి మళ్ళీ తెలంగాణాలో ఉద్యమాలు, ఆందోళనలు మొదలయ్యే అవకాశం ఉంది. తెలంగాణా ప్రభుత్వం ఈ అంశంపై న్యాయపోరాటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా టీ-జేఏసీ కూడా మళ్ళీ ఆందోళన బాట పట్టవచ్చును. బహుశః ముంపు గ్రామాలలో గిరిజనులను కలుపుకొని ఉద్యమించినా ఆశ్చర్యం లేదు. అందువలన ప్రాజెక్టుకు పార్లమెంటు ఆమోదముద్ర వేసినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణంలో చాలా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

 

కేంద్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు ఈ సమస్యలను ఎదుర్కొంటూనే మరోవైపు ప్రాజెక్టు నిర్మాణం సకాలంలో పూర్తి చేయవలసి ఉంటుంది. తెలంగాణా రాష్ట్ర సరిహద్దులను మార్పుపై ఏర్పడిన న్యాయ వివాదం గురించి సుప్రీంకోర్టు చూసుకొంటుంది. గనుక మిగిలిన సమస్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పరిష్కరించుకొని ముందుకు సాగవలసి ఉంటుంది.

 

దాదాపు రెండు లక్షల మంది గిరిజనులకు పూర్తి సంతృప్తి కలిగే విధంగా పునరావాసం కల్పించాలంటే కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లనే కాదు. అందుకు స్థానిక ప్రజలు, నేతలు, స్వచ్చంద సంఘాలు, పర్యావరణ, పునరావాస చర్యలలో అనుభవం ఉన్ననిపుణుల సలహాలు, సహాయ సహకారాలు తీసుకోవడం కూడా చాలా అవసరం.

 

అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో, దేశాలలో ఇటువంటి ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ఎదురయ్యే సమస్యలు, వాటిని అధిగమించడానికి తీసుకొన్న చర్యలు, జాగ్రత్తలు, పునరావాసచర్యలు వంటి అనేక అంశాలను లోతుగా అధ్యయనం చేయడం వల్లకూడా చాల మేలు జరుగుతుంది. ఈ విషయంలో నిపుణుల సలహాలనే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భేషజాలకు పోకుండా రాష్ట్ర ప్రజల, నిర్వాసితుల సూచనలు, సలహాలు, అభిప్రాయలు, సహాయసహకారాలు కూడా తీసుకొనే ప్రయత్నం చేసినట్లయితే అనేక క్లిష్ట సమస్యలకు ఎవరూ ఊహించలేని అద్భుత పరిష్కారాలు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది.

 

పోలవరం ముంపు గ్రామాలలో నివసిస్తున్న గిరిజనులకు మంచి పునరావాసం కల్పించి, వారిలో ఆసక్తి ఉన్నవారికి తగిన సాంకేతిక శిక్షణ ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణం మరియు నిర్వహణలో భాగస్వాములను చేసి తగిన ఉపాధి కల్పించగలిగితే సమస్యలు కొంత వరకు పరిష్కారం కావచ్చును. అంతేగాక వారి జీవనవిధానం, ఆచార వ్యవహారాలకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు, సమీప ప్రాంతాలలోనే వారికి అనుకూలమయిన చోట పునరావాసం కల్పించడం ద్వారా కూడా వారిని శాంతింపజేయవచ్చును.

 

అదేవిధంగా ప్రాజెక్టు క్రింద కోల్పోతున్న అటవీ ప్రాంతాలకు ప్రతిగా మరొకచోట మళ్ళీ అంతే పరిణామం గల అటవీ ప్రాంతాలను పెంపొందించి, పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా కాపాడటం కూడా అంతే అవసరం. ఆ బాధ్యత కూడా గిరిజనులకే అప్పగించినట్లయితే వారు సంతోషంగా స్వీకరించవచ్చును. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా వారి సంక్షేమం, పునరావాసం కోసం తగిన ఏర్పాటు చేయగలిగినట్లయితే వారూ సంతోషంగా ప్రాజెక్టు నిర్మాణానికి నిర్వహణకి సహకరించే అవకాశం ఉంది.అప్పుడే వారు తమను రెచ్చగొట్టే రాజకీయ నేతల ప్రభావానికి లొంగకుండా నిలువగలుగుతారు.

 

పోలవరం ప్రాజెక్టు సకాలంలో నిర్మించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమర్ధతకు, కార్యదీక్షకు ఒక పరీక్ష వంటివి. అదేవిధంగా నిర్వాసితులకు పూర్తి సంతృప్తికరంగా పునరావాసం కల్పించదదం ద్వారా పోలవరం ప్రాజెక్టును యావత్ దేశంలోనే ఒక ఆదర్శవంతమయిన నమూనా ప్రాజెక్టుగా నిలపగలిగితే, అది కేంద్ర, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజలకు కూడా గర్వకారణంగా నిలుస్తుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.