Publish Date:Apr 10, 2026
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో ఓవర్ నైట్ సెలిబ్రిటీగా మారిన తేనెకళ్ల సుందరి మోనాలిసా భోంస్లే వివాహం ఇప్పుడు వివాదంలో పడింది. పెళ్లైన రోజుల వ్యవధిలోనే ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదైంది. ఇందుకు కారణం ఫర్మాన్ ఖాన్ మోనాలిసాను వివాహం చేసుకోవడమే. మోనాలిసా ఇంకా మైనర్ కావడంతో ఆమెను వివాహం చేసుకున్న ఫర్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదైంది. నిజమని తేలడంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ ల పెళ్లి గత నెల 11న కేరళ అరుణ్మనూర్లోని శ్రీ నారాయణ గురు ఆలయంలో జరిగిన సంగతి తెలిసిందే. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేైసుకున్నారు. పెద్దలకు ఇష్టం లేకుండా వీరిద్దరూ వివాహం ద్వారా ఒక్కటయ్యారు. అయితే మోనాలిసా వయస్సుపై మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై విశ్వహిందూ పరిషత్ కేరళ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
ఈ వివాదంపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్సీఎస్టీ) విచారణ చేపట్టింది. మోనాలిసా వయస్సు ధృవీకరణ పత్రాలను పరిశీలించింది. ఈ దర్యాప్తులో వివాహ సమయానికి మోనాలిసా వయస్సు కేవలం 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు మాత్రమేనని నిర్ధారణ అయ్యింది. అంటే ఆమె మైనర్ అని కమిషన్ స్పష్టం చేసింది.
చట్టప్రకారం మైనర్ బాలికను వివాహం చేసుకోవడం నేరం కావడంతో.. మధ్యప్రదేశ్ పోలీసులు ఫర్మాన్ ఖాన్పై పోక్సో చట్టంతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కుంభమేళాలో పూసల గొలుసులు అమ్ముకుంటూ తన నవ్వుతో, అందంతో లక్షలాది మంది నెటిజన్ల మనసు గెలుచుకున్న మోనాలిసా జీవితం ఇలా చట్టపరమైన చిక్కుల్లో పడటం చర్చనీయాంశంగా మారింది.
మైనర్ వివాహాల పట్ల ప్రభుత్వం, జాతీయ కమిషన్లు కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ కు చిక్కులు తప్పవని అంటున్నారు. అలాగే మోనాలిసాను కూడా రక్షణ కేంద్రానికి తరలించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. కుపోతుందని అధికారులు వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pocso-case-filed-against-monalisa-husban-36-217077.html
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్లైన్లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.