పోచారం ఆవేదన వెనుక అసలు రాజకీయం ఇదేనా..?

Publish Date:Aug 12, 2026

Advertisement

 

పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?

తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన, ఇప్పుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేయడం వెనుక ఉన్న అసలు కారణాలేంటి..? అసలు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఏం జరుగుతోంది? అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో కండువా కప్పిన కీలక నాయకుల్లో పోచారం ఒకరు. 

కానీ, ఇప్పుడు ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఎంతమాత్రం ఇష్టం లేదని, కానీ కొన్ని అనివార్య రాజకీయ పరిణామాల వల్లే కాంగ్రెస్‌లోకి రావలసి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించడం పెద్ద చర్చనీయాంశమైంది.
అన్నం పెట్టిన నాయకుడిని మరవడం చాలా కష్టంగా ఉందంటూ పోచారం పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం వెనుక అర్థమేంటి? నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం వల్లే తాను పార్టీ మారానని ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. 

అయితే, ఇక్కడే మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. తాను అసలు కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పుకోలేదని, కేవలం జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నానని చెప్పడం అందరినీ విస్తుపోయేలా చేసింది. డెవలప్‌మెంట్ నిధుల కోసం పార్టీ మారానని చెప్తూనే, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదనడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు పొలిటికల్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ప్రజలను అంత అమాయకులుగా భావిస్తున్నారా అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలను కూడా పోచారం బహిర్గతం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలను సొంత క్యాబినెట్ మంత్రులే అస్సలు లెక్క చేయడం లేదని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పనుల కోసం మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం లిఫ్ట్ చేయడం లేదని తన ఆవేదనను వెళ్లగక్కారు. కాంగ్రెస్ పార్టీలో పాత నాయకులకు, కొత్తగా వచ్చిన నాయకులకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇప్పుడు పోచారం మాటల ద్వారా స్పష్టంగా బయటపడింది. అయితే, పోచారం మాత్రమే కాకుండా దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి వంటి మరికొందరు నాయకుల వైఖరిపై కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

జగిత్యాల ప్రాంతంలో దశాబ్దాలుగా జీవన్ రెడ్డి చెప్పిందే శాసనంగా ఉండేది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా ఎన్నో పదవులు అనుభవించిన జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చింది. కానీ, అక్కడ పరిస్థితులు మారాయి. మరోవైపు, రాజగోపాల్ రెడ్డి కూడా కాషాయం కప్పుకుని మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చినప్పటికీ పార్టీ వ్యవహారాలపై విమర్శలు రావడం గమనార్హం. 

కేసీఆర్ గడీలోకి వెళ్లిన వారైనా లేదా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారైనా కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అసలైన నిబద్ధత కలిగిన నాయకులు ఎవరో, కేవలం ప్రయోజనాల కోసం వచ్చే వారెవరో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. బీఆర్‌ఎస్ సవాలును తట్టుకోవాలంటే హైకమాండ్ తక్షణమే స్పందించి ఈ ఆధిపత్య పోరుకు, అసమ్మతి వ్యాఖ్యలకు ముగింపు పలకాల్సి ఉంది.

Pocharam Srinivas Reddy,  CM Revanth Reddy Congress Party, Telangana Politics News, KCR BRS, Pocharam Comments, Telangana Congress News

By
en-us Political News

  
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.