చట్టసభల్లో రభస ఎవరికి నష్టం.... !?

Publish Date:Aug 3, 2018

Advertisement

లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రాల శాసనసభల్లో కార్యకలాపాలను అడ్డుకుంటే ఎవరికి లాభం...!? ఎవరికి నష్టం....!? ఈ విషయంపై దేశానికే తీవ్ర నష్టమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన చెందారు. పార్లమెంటు సెంట్రల్ హలులో జరిగిన ఉత్తమ పార్లమెంటేరియన్ల అవార్డుల కార్యక్రమంలో పార్లమెంటులో సమావేశాలు జరుగుతున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేసారు. ఉభయ సభలలోను జరుగుతున్న గందరగోళంపై ఆవేదన వ్యక్తం చేసారు. సభలు ఇలా జరిగితే ప్రజా సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. దేశంలో నెలకొన్న వివిధ సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలకు నివారణ చర్యలు తీసుకోవాల్సిన చట్టసభలలోనే ఈ గందరగోళాలపై ఆవేదన వ్యక్తం చేసారు. చట్టాలు చేయాల్సిన, వాటిని అమలు పర్చాల్సిన చట్టసభలు ఇలా ఉంటే ఎలా అని మదన పడ్డారు.

 

 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన, ఆందోళన, విచారం నిర్వేదన వాస్తవమే. కీలక సమయాలలో లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ్యుల ప్రవర్తన ప్రశ్నించాల్సిందే. అయితే వారందరు ఎక్కడి నుంచి వచ్చారు? వారి వారి రాజకీయ పార్టీలు ఏ దేశానికి చెందినవి.  ఆ ప్రజాప్రతినిధులు ఏ దేశ ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రధానాంశం. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు దేశంలో ఏ రాజకీయ పార్టీ చూసినా సగటు భారతీయుడు తలదించుకోవడమే తప్ప, గర్వపడే అంశం ఏదీ లేకుండా పోయింది. వారి వారి స్వప్రయోజనాలు, పార్టీల ప్రయోజనాలు మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్న ప్రజాప్రతినిధులు సభలో ప్రవర్తిస్తున్న తీరు నిజంగా గర్హనీయం. సభ తీరుపై విచారం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతోనే,  ఆయన కనుసన్నల్లోని పార్టీల ప్రతినిధులు సభలో గందరగోళం రేపుతున్నారు. చీటికీ మాటికీ సభలోని వెల్‌లోకి ప్రవేశించి సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు.

 

 

దీనిని ఏ విధంగా చూడాలి. సభలో ఈ ప్రవర్తనను ఎలా పరిగణించాలి. లోక్‌సభ, రాజ్యసభతో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభలలో కూడా అధికార, ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన ఇలాగే ఉంటోంది. వివిధ రాష్ట్రాలలో జరిగిన, జరుగుతున్న పరిణామాలను చూస్తే " వీళ్లా మన ప్రతినిధులు" అని వారికి ఓటేసిన ప్రజలు బాధపడే స్థితి వచ్చింది. దీనికి కారణం జాతీయ, ప్రాంతీయ పార్టీలు కాదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నవారి తప్పులను ఎత్తి చూపాలి. అధికార పార్టీ అప్పటి వరకు తాము ఏం చేసామో సభల సాక్షిగా ప్రజలకు వివరించాలి. అలాగే ప్రతిపక్షాలు ఎత్తి చూపే అంశాలపై సానుకూలంగా స్పందించాలి. దేశ చట్టసభలలో గడచిన కొంత కాలంగా ఇవేవీ జరగడంలేదు. దీనికి కారణం ప్రజాప్రతినిధులదా? లేక ప్రజలదా? ప్రతిపక్షాలు తన శాఖపై ప్రశ్నలు సంధించే సమయానికి తాను సభలో లేకపోవాడాన్ని తప్పుగా భావించిన విదేశాలకు చెందిన  మంత్రి ఒకరు తన పదవికి రాజీనామ చేసారని సోషల్ మీడియా ఈ మధ్యనే కోడై కూసింది. అంతటి నైతికత భారత దేశ ప్రజాప్రతినిధులకు ఉంటుందా అన్నదే పెద్ద ప్రశ్న. ఎక్కడో ఓ రైలు ప్రమాదంలో ప్రయాణీకులు మరణిస్తే తన పదవికి రాజనామా చేసిన గొప్ప నాయకులు ఇప్పుడు మనకి ఉన్నారా? గొంగళిలో వెంట్రుకులు ఏరుకుంటున్న ప్రస్తుత భారతదేశంలో చర్చలకు, ప్రజాసంక్షేమానికి, ప్రజల బాగోగులకు బాధ్యత వహించే నాయకులు కనబడతారా? ఇవేవీ తన పార్టీలోనే లేనప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేయడం నాటకీయ పరిణామంగానే పరిగణించాలి.

 

 

సభల్లో గందగోళం ఏర్పడడానికి... లేదూ అలా చేయడానికి తెలుగు రాష్ట్రాలు ముందంజలోనే ఉంటాయి. దీనికి తాజా ఉదాహరణ... తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ సభ్యులిద్దరి ప్రవర్తన. ఓ అంశంపై నిరసన తెలియజేస్తున్న సమయంలో ఆ ఇద్దరు సభ్యలు స్పీకర్‌పైకి మైకుని విసిరిన తీరు తెలంగాణ సమాజం తలదించుకోనేలా చేసింది. తామ కావాలని స్పీకర్‌పైకి మైకు విసరలేదని, అది అలా జరిగిపోయిందని వారి వాదన. దీనికి ప్రభుత్వం స్పందించిన తీరు కూడా మరీ ఎక్కువగా ఉంది. ఆ సభ్యులను ఏకంగా వారి పదవీ కాలమంతా సస్పెండ్ చేశారు. రెండు నియోజకవర్గాల ప్రజలు ఎన్నుకున్న సభ్యుల్ని ఇలా పూర్తిగా సభ నుంచి వెలి వేయడం ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించడం కాదా...!? ఈ అంశంపై కోర్టు చివాట్లు పెట్టే వరకూ ప్రభుత్వం వెళ్లిందంటే ఏలికలకు ప్రజాస్వామ్యం పట్లా.. న్యాయస్ధానం పట్ల ఎంతటి గౌరవం ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి సంఘటనలకు ఒక్క తెలంగాణ మాత్రమే పరిమితం కాదు.... తమిళనాడు... కర్నాటక... ఉత్తరాది రాష్ట్రాలలోనూ ప్రతి శాసనసభలోనూ జరుగుతున్నది. ముందు అధికార పక్షంలో ఉన్న సంయమనం పాటించడం నేర్చుకుంటే ఆ తర్వాత ప్రతిపక్షాలు వారి దారిలోకి వస్తాయి. అడ్డదారిలో బిల్లులకు ఆమోదం తెలపడం... తద్వారా తమ అధికారాన్ని ప్రదర్శించడం వంటివి మానుకుంటే సభలు ప్రశాంతంగా... సవ్యంగా.... ఆదర్శప్రాయంగా జరుగుతాయి. లేకపోతే ఇదిగో ఇలాగే బాధ పడడమే మిగులుతుంది. అధికార దర్పం కోసం వివిధ రాజకీయ పార్టీలు సభల్లో ప్రవర్తిస్తున్న తీరును మార్చుకోవాలి. మార్చుకోకపోతే వారు ఎలా మారాలో ప్రజలే చెబుతారు. వారి చేతిలో వీరిని మార్చే బ్రహ్మస్త్రం ఓటు ఉంది. అదొక్కటి చాలు.... రాజకీయ నేతల్ని మార్చడానికి....

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.