మాజీ ప్ర‌ధాని మనవడు ప్రజ్వల్ శృంగార లీలలుః మోదీ మౌనం

Publish Date:May 1, 2024

Advertisement

మాజీ ప్ర‌ధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ శృంగార లీలలు, సెక్స్ స్కాండల్ కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి, వాటి ఆధారంగా వారిని బెదిరించి ప్రజ్వల్ రేవణ్ణ లొంగదీసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. హసన ఎంపీ, JDS యువనేత ప్రజ్వల్  మాజీ ప్రధాని దేవెగౌడకు స్వయానా మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్న కుమారుడైన ప్రజ్వల్.. యువతులను ప్రలోభాలకు గురిచేసి, లైంగిక దాడి చేశారనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేగింది. 

తాజాగా ఈ కేసులో మరో సంచలనం బయటపడింది. ప్రజ్వల్‌పై లైంగిక దాడి కేసు పెట్టిన బాధిత మహిళ (47).. ఆయనకు బంధువే. ప్రజ్వల్ తల్లి భవానీకి ఆమె మేనత్త కుమార్తె.   అమ్మ ఇంట్లో లేని సమయంలో.. రేవణ్ణ మంత్రిగా ఉన్నప్పుడు బాధిత మహిళకు పాల కేంద్రంలో పని ఇప్పించారు. అనంతరం బీసీఎం హాస్టల్‌లో వంట మనిషిగా అవకాశం కల్పించారు. 2015లో ఆమెను వారి ఇంట్లో పనికి చేర్పించారు. రేవణ్ణ నివాసంలో ఆరుగురు మహిళలు, యువతులు పని చేస్తున్నారని బాధిత మహిళ కంప్లెయింట్‌లో పేర్కొంది. ఇంట్లో చేరిన 4 నెలల నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నాడ‌ని, తల్లి ఇంట్లోలేని సమయంలో తనపై లైంగిక దాడి చేసేవాడని బాధితురాలు ఆరోపించింది. తన కుమార్తెకు కూడా వీడియో కాల్‌ చేసి ప్రజ్వల్‌ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.  

ప్రజ్వల్ రేవణ్ణ కర్ణాటకలోని హసన్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేశారు. ఏప్రిల్ 26న కర్ణాటకలో  14 సీట్లకు పోలింగ్ జరిగిన స్థానాలలో హసన్ సీటు కూడా ఒకటి. ఇక్కడ పోలింగ్ జరిగిన తర్వాత రేవణ్ణపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. హసన్ జిల్లాలో అసభ్యకర వీడియోలు సర్క్యూలేట్ అయ్యాయి. ఈ వీడియోల ద్వారా మహిళలపై లైంగిక వేధింపు ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది . ఒకవేళ అది కుంభకోణం అయితే, ప్రస్తుతం అంత పెద్ద ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే, ఇప్పటికే ఓటింగ్ పూర్తయింది. ఆరోపిత వీడియోలున్న పెన్ డ్రైవ్‌లు కేవలం హసన్ నగరంలో మాత్రం సర్క్యూలేట్ అయ్యాయి. కర్ణాటకలో తొలి దశ ఓటింగ్‌పై ఎలాంటి ప్రభావం లేదు. కానీ, మిగిలిన 14 సీట్లలో మహిళా ఓట్లను ఆకర్షించుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తే, అప్పుడు నైతికంగా బీజేపీని సవాలు చేయగలదు.

సెక్స్‌ స్కాండల్‌ ఆరోపణల నేపథ్యంలో  ప్రజ్వల్‌ జర్మనీ పారిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఒకవేళ ప్రజ్వల్‌ విదేశాలకు వెళితే అతడిని వెనక్కు తీసుకువచ్చి విచారణ కొనసాగించే బాధ్యత సిట్‌దేనని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర తెలిపారు.

ఈ కుంభకోణం బీజేపీకి ఒక అస్త్రంగా మారింది. భవిష్యత్‌లో జేడీఎస్‌ను శాసించేందుకు వీలు కల్పించనుంది.  జేడీఎస్ పార్టీని బీజేపీ కబళించడానికి ప్ర‌య‌త్నిస్తోంది. ఈ 'సెక్స్ స్కాండల్'  జేడీఎస్ ముగింపుకు చివరి దశకు తీసుకొచ్చింది. బీజేపీ నుంచి జేడీఎస్ వేరుకావడానికి ఇది దారితీస్తుంది. ఒకవేళ ఇలానే జరిగితే, జేడీఎస్ నేతలలో ఆందోళన చెలరేగి, వారు బీజేపీలో చేరతారు.  

- ఎం.కె.ఫ‌జ‌ల్‌

By
en-us Political News

  
నేను చెప్పింది జరగకపోతే జనం నా ముఖం మీద పేడ కొడతారు. అదే, నేను చెప్పింది జరిగితే ఆ పేడ జగన్ ముఖాన పడుతుంది అన్నారు.
ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం మీద అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి.
తెలంగాణా రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. అయితే, పారిపాలనా సౌలభ్యం కోసం ఉన్న వారికే ఇంచార్జీలుగా బాధ్యతలు ఆప్పగిస్తారా? లేదా ఐఎఎస్‌లను ఇంచార్జీలుగా నియమిస్తారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంక‌ట కృష్ణారావు (కృష్ణ‌బాబు) అనారోగ్యంతో మృతిచెందారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఇవాళ తెల్లవారుజామున కృష్ణ‌బాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. 
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో గత నాలుగు రోజుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి ద‌ర్శ‌నం కోసం క్యూక‌డుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు కిలో మీటర్ల మేర బారులు తీరుతున్నారు. ఇలా భ‌క్తుల తాకిడి పెర‌గడంతో టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల జారీని తిరిగి ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నిర్ణయంతో భక్తుల రద్దీ ఉన్నాస‌రే.. శ్రీవారిని దర్శించుకునే సమయం తగ్గనుంది.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్థిక, విద్య, ప్రణాళిక, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, సేవలు, స్థానిక సంస్థలు, భూమి & భవనాలు, ఉన్నత విద్య, శిక్షణ & సాంకేతిక విద్య, విజిలెన్స్, సహకార సంఘాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ & పబ్లిసిటీ వంటి అనేక ముఖ్యమైన విభాగాలకు సిసోడియా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
ఈసారి లోకేష్‌కి 60 వేల ఓట్ల మెజారిటీ పక్కా అని తెలుగు తమ్ముళ్ళు ఢంకా బజాయించి చెబుతుంటే, వైసీపీ సానుభూతిపరులు మాత్రం తమ అభ్యర్థి ఆర్కే మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మహత్య సదృశ్యం జగన్ రెడ్డి పరిపాలనాని అంటారు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాదం. తిరుపతి, అనంతపురం, మాచర్లలో జరిగిన అల్లర్ల, విధ్వంసం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు ధ్వంసం చేసిన ఘటనలో వైసిపి పాత్ర వుంది. వీటన్నింటిపై సిట్ దర్యాప్తు జరుగుతుంది.
కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగడానికి ఎన్‌ఫోర్స్.మెంట్ డైరెక్టరేట్ అవకాశం కల్పించిది. తద్వారా ఈడీ ద్వారా కవితకి బర్త్ డే గిఫ్ట్ అందించింది.
ఇజ్రాయెల్ శత్రువు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా అంతమొందించే శక్తి సామర్థ్యాలు మొసాద్ కు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం! గతంలో ఇజ్రాయెల్ శత్రువులు వివిధ ఘటనల్లో చనిపోయారు. వాళ్లలో ఇరాన్ కు చెందిన అణు పరిశోధకులు కూడా ఉన్నారు. కచ్చితంగా ఫలానా వాళ్లు చంపారనే ఎలాంటి ఆధారాలు లేని రీతిలో వాళ్లు కడతేరిపోయారు. ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడంలో మొసాద్ దిట్ట!
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు రావడంతో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు హైదరాబాద్ లో రెయిడ్స్ చేపట్టారు. మంగళవారం ఉదయాన్నే ఆశోక్ నగర్ లోని ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసానికి చేరుకున్న అధికారులు.. ఏసీపీ నివాసంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఏసీపీ స్నేహితులు, బంధువుల ఇళ్లకూ వెళ్లిన అధికారులు మొత్తంగా సిటీలో ఆరుచోట్ల సోదాలు చేస్తున్నారు.
చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నట్టు.. వైసీపీ దండుపాళెం బ్యాచ్ తమ కర్మఫలాన్ని అనుభవించడం కోసం రోజులు లెక్కపెట్టుకుంటోంది.
ఉగ్రవాదం అంటే మనం సాధారణం గా తాలిబన్ ఉగ్రవాదులు ని అనుకుంటూ ఉంటాము,కానీ ప్రపంచం లో అంతకంటే భయంకరమైన ఉగ్రవాదం ఇంకొకటి వుంది , అది ఆర్ధిక ఉగ్రవాదం - ప్రపంచం అంత తాను నమ్మిన సిధ్ధాంతాన్ని మాత్రమే నమ్మాలి , అలా నమ్మకపోతే అందరినీ చంపేయాలి అంటే చంపేసి అయినా సరే తన వాదనే నెగ్గాలి అని భావించి దాన్ని కార్యాచరణ లో పెట్టడం ఉగ్రవాదం ప్రధాన ఎజెండా.  అందులో లాజిక్ ఏమీ ఉండదు ,  ఈ నేపథ్యంలో  పిల్లి మెడలో గంట కట్టేవారు ఎవరు అనే ప్రశ్నకు భారత పోలీసులు సమాధానం వెతికారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.