జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతాపార్టీ ఆధ్వర్యంలో గత నెలలో జరిగిన ఆందోళనలో ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న బాలికకు ప్రధాని మోడీ క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ బాలికపై తొలుత జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఆ జీరో ఎఫ్ఐఆర్ లో ఆ బాలికను పాతికేళ్ల యువతిగా పేర్కొన్నారు.
అయితే ఆ తరువాత ఆ బాలిక ఓ వీడియో విడుదల చేస్తూ.. తన వయస్సు 15 సంవత్సరాలు మాత్రమేననీ, ఇతరుల వల్ల ప్రభావితమై ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశాననీ పేర్కొంటూ.. క్షమాపణ కోరింది. ఆ క్షమాపణ వీడియోలో అదే తన తొలి తప్పనీ, అలాగే చివరి తప్పుకూడాననీ చెబుతూ.. క్షమించాల్సిందిగా వేడుకుంది. దీనిపై స్పందించిన ప్రధాని మోడీ.. తప్పుదోవ పట్టిన పిల్లలు తనను దూషించినా క్షమిస్తున్నానని పేర్కొన్నారు.
ప్రధాని క్షమించడంతో పోలీసులు ఆ జీరో ఎఫ్ఐఆర్ ను రద్దు చేసి ఆ బాలికపై ఎటువంటి కేసూ నమోదు చేయలేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై ఆ బాలిక తల్లి హర్షం వ్యక్తం చేస్తూ.. తన బిడ్డకు మోడీ జీవనదానం ప్రసాదించారని పేర్కొన్నారు. తన బిడ్డకు ఇది మరో జన్మ పేర్కొన్న ఆ బాలిక తల్లి.. మైనర్ పిల్లలకు ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాలను నిషేధించాలని విజ్ణప్తి చేశారు.
PM modi excuse that girl, Jantharmantha, protests, Abuse, Primeminister
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pm-modi-excuse-that-girl-36-227827.html
మదర్సాలు ఉగ్రవాదులను తయారు చేసే కర్మాగారాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని పరిశీలించినా పౌరులందరికీ సమానమైన చట్టాలు అమలులో ఉన్నాయన్న తస్లీమా.. ఇండియాలో మాత్రం మహిళలు ఇప్పటికీ చట్టపరంగా, సామాజికంగా వివక్షకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆగస్టు 3న భారత స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల దిశగా దూసుకుపోతున్నాయి. తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు, రూ. 20,200 కోట్ల ఎఫ్పిఐ పెట్టుబడులు మరియు ఆర్బిఐ పాలసీ అప్డేట్స్తో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
వ్యాపారంలో చెల్లించని లేదా బాకీ ఉన్న ఖర్చులను పన్ను మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చా? రూ. 8 కోట్ల నష్టపరిహార వివాదంలో ఐటీఏటీ ITAT ముంబై ఇచ్చిన సంచలన తీర్పు, పన్ను మినహాయింపు నిబంధనలు మరియు మ్యాచింగ్ ప్రిన్సిపుల్ సమగ్ర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గ్, జూబ్లీహిల్స్ వంటి ప్రైమ్ ఏరియాల్లో నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న 10 అంతస్తుల ఇందిరమ్మ LIG హౌసింగ్ టవర్లు, 7,680 ఫ్లాట్లు మరియు పూర్తి ప్రాజెక్ట్ వివరాలను తెలుసుకోండి.
శ్రీలంకతో జరిగే 2 టెస్టుల సిరీస్కు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరమయ్యాడు. ఆయన స్థానంలో జమ్మూకశ్మీర్ పేస్ సంచలనం ఆకిబ్ నబీకి జట్టులో చోటు దక్కింది. నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా కూడా గాయపడటంతో టీమిండియా పరిస్థితి ఏమిటో పూర్తి వివరాలు తెలుసుకోండి.
తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్లో వియత్నాం షట్లర్ లిన్ ఎంగుయెన్ను 21 16, 21 16తో ఓడించి తన్వి శర్మ చారిత్రాత్మక టైటిల్ గెలుచుకుంది. 18 ఏళ్ల తర్వాత సైనా నెహ్వాల్ రికార్డును పునరావృతం చేస్తూ తొలి బిడబ్లూఎఫ్ వరల్డ్ టూర్ 300 టైటిల్ను సొంతం చేసుకుంది.
ఎంఎస్ ధోనీ కంటే ఆశిష్ నెహ్రాకే బెస్ట్ క్రికెటింగ్ బ్రెయిన్ ఉందంటూ ఇంగ్లండ్ మాజీ ఆల్రౌండర్ మొయిన్ అలీ చేసిన సంచలన వ్యాఖ్యలు, నెహ్రా కోచింగ్ శైలి వెనుక ఉన్న అసలు కారణాలు మరియు వారి క్రికెట్ గణాంకాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
సాధు సంత్ ల పట్ల పప్పు యాదవ్ అనుచితంగా మాట్లాడారనే ఆగ్రహంతోనే తాను ఈ చర్యకు పాల్పడినట్లు నిందితుడు తెలిపినట్లు సమాచారం. కాగా ఈ దాడి ఘటనపై పప్పుయాదవ్ మాట్లాడుతూ.. అయోధ్య రామ మందిర విరాళాల విషయంలో తీవ్రమైన అవకతవకలు, అక్రమాలు జరిగాయని తాను బహిరంగంగా ఆరోపించినప్పటి నుంచీ, తనకు నిరంతరం బెదిరింపులు వస్తున్నాయన్నారు.
మామతో బైక్పై వెళ్లి లారీ కిందపడిన చిన్నారి..
విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన రౌడీషీటర్ సాయికృష్ణ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది.
కర్ణాటక వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి.
యూసఫ్ గూడలో కారు బీభత్సం..ఇద్దరికి తీవ్ర గాయాలు..!
తెలుగు రాష్ట్రాల్లో అనధికారిక చిట్టీల పేరుతో మోసాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.