మోడీ పర్యటనతో.. ఏపీ ప్రగతి దారులకు తెరుచుకున్న తలుపులు.!

Publish Date:Aug 3, 2026

Advertisement

ప్రధాని మోడీ  ఇటీవలి  ఏపీ పర్యటన రాష్ట్ర ప్రగతి, పురోగతి, అభివృద్ధికి కొత్త ఊపు ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భోగాపురం వేదికగా  17 వేల 900 కోట్ల రూపాయల విలువైన  పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.  విశాఖ పట్నం సహా సమగ్ర ఉత్తరాంధ్ర రూపురేకలను మార్చేలా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా మోడీ పర్యటన సాగింది.  మౌలిక వసతులు, పునరుత్పాదక ఇంధనం, రవాణా, పారిశ్రామిక రంగాలకు చెందిన  ఈ ప్రాజెక్టులకు మోడీ ప్రారంభం, శంకుస్థాపనలు చేయడం ద్వారా  రాష్ట్రానికి  విశేష ప్రయోజనం చేకూరే మార్గాలను సుగమం చేశారు. 

మొత్తంగా మోడీ పర్యటనలో  అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయడం ప్రధాన అంశం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటైన మొదటి అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం   ఆగస్టు మూడో వారం నుంచే భోగాపురం విమానాశ్రయం నుంచి  వాణిజ్య విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.  

అలాగే సాంకేతిక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ముందువరుసలో నిలిపేలా  విశాఖలో అధునాతన సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ (ఓఏఎస్ఏటీ) యూనిట్‌కు ఈ పర్యటనలో భాగంగా మోడీ శంకుస్థాపనచేశారు. ఏఎస్‌ఐపి టెక్నాలజీస్, దక్షిణ కొరియాకు చెందిన ఏపీఏసీటీ సంస్థల భాగస్వామ్యంతో  460 కోట్ల రూపాయల తొలిదశ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. భవిష్యత్తులో ఈ పెట్టుబడి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు చేరనుంది.   సౌత్ ఇండియా    సెమీకండక్టర్ మిషన్  కింద ఏర్పాటవుతున్న తొలి యూనిట్ ఇదే. ఏడాదికి   9.6 కోట్ల చిప్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ ద్వారా రాష్ట్రం సాఫ్ట్‌వేర్ రంగానికే పరిమితం కాకుండా హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా రూపాంతరం చెందుతుంది. 

ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా నేరుగాను, పరోక్షంగాను యువతకు భారీ సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఒక్క సెమీకండక్టర్ యూనిట్ ద్వారానే వేలాది మందికి అధిక నైపుణ్యంతో కూడిన  కొలువులు లభిస్తాయి. అలాగే విమానాశ్రయ నిర్వహణ, లాజిస్టిక్స్, రిటైల్, సర్వీస్ రంగాలలో స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. పారిశ్రామిక రవాణా వ్యయం తగ్గడం వల్ల రైతులు, స్థానిక వ్యాపారులు తమ ఉత్పత్తులను దేశ విదేశీ మార్కెట్లకు సులభంగా తరలించేందుకు మార్గం సుగమమవుతుంది.  భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం, గ్రీన్ ఎనర్జీ విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం కావడం ద్వారా విదేశీ పెట్టుబడులు మరింతగా తరలివచ్చే అవకాశం ఉంది. పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, సరికొత్త ఐటీ హబ్‌ల ఏర్పాటుకు ఈ ప్రాజెక్టులు పునాదిగా నిలుస్తాయి. 

PM Modi  AP Visit, Bhogapuram International Airport, Visakhapatnam Semiconductor Plant, AP Development Projects

By
en-us Political News

  
సెబీ మార్గదర్శకాలతో భారత స్టాక్ మార్కెట్లో అమల్లోకి వచ్చిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS వివరాలు, ఎఫ్&ఓ షేర్ల నూతన ట్రేడింగ్ వేళలు మరియు ముగింపు ధర నిర్ణయించే ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత, విద్యార్థుల ఆశయాలు, ఆకాంక్షలు, ఆందోళనలు, అవసరాలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్త పర్యటనకు కాక్రోచ్ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. లిజనింగ్ టూర్ పేర చేపట్టనున్న ఈ పర్యటన ద్వారా ప్రతి రాష్ట్రంలోని యువతతో నేరుగా మమేకమయ్యేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నది.
అమేజాన్ ఆస్ట్రేలియాలో ఆపిల్ వాచ్ సిరీస్ 11 42mm, GPS పై ఏకంగా 37% దాకా భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. AU$252 ఆదా అయ్యే ఈ రికార్డు ఆఫర్ డీల్ వివరాలు, బ్యాటరీ లైఫ్ మరియు బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ సహా కొత్త హెల్త్ ఫీచర్ల సమగ్ర సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
GMKtec NEO X1 వర్క్‌స్టేషన్ పిసి అత్యంత వేగవంతమైన AMD Ryzen 9000HX సిరీస్ ల్యాప్‌టాప్ CPU మరియు NVIDIA RTX 5070 డెస్క్‌టాప్ GPU కాంబినేషన్‌తో లాంచ్ అయింది. 14.6L చిన్న పరిమాణంలో లిక్విడ్ కూలింగ్‌తో వచ్చిన ఈ పవర్‌ఫుల్ పిసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
హెచ్‌బీవో మాక్స్ ఫేమస్ సిరీస్ స్టూవర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ ఎపిసోడ్ 3 రిలీజ్ డేట్, ఇండియా స్ట్రీమింగ్ టైమింగ్స్ మరియు మొత్తం 10 ఎపిసోడ్‌ల కంప్లీట్ షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
రూ. 1.14 కోట్ల ఇన్కమ్ టాక్స్ చెల్లించిన వ్యక్తికి రూ. 10 రీఫండ్ వచ్చింది. సీఏ సుమిత్ శర్మ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఐటీ నిబంధనలు మరియు సెక్షన్ 143 1 అసలు నిజాలను వెల్లడించాయి.
ప్రసిద్ధ కన్జ్యూమర్‌వేర్ బ్రాండ్ సెల్లో వరల్డ్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బైన్ క్యాపిటల్ చర్చలు జరుపుతోంది. రూ. 3,000 కోట్లకు పైగా విలువైన ఈ డీల్ మరియు భారత మార్కెట్ సమీకరణాల వివరాలు ఇక్కడ చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్ క్లోజింగ్ వేళలు మారాయి! NSE మరియు BSE కొత్తగా ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS టైమింగ్స్, F&O ట్రేడింగ్ మార్పులు మరియు ఇన్వెస్టర్లపై దీని ప్రభావం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
హైదరాబాద్‌లో పుట్టి SRH నెట్ బౌలర్‌గా చేసిన బోడుగుమ్ అఖిలేష్ రెడ్డిపై ఐసీసీ 8 ఏళ్ల పాటు మ్యాచ్ ఫిక్సింగ్ నిషేధం విధించింది. అబుదాబి టి10 లీగ్‌లో జరిగిన ఈ ఘోర కుంభకోణం వెనుక ఉన్న పూర్తి నిజాలు ఇవే.
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు గాయంతో బుమ్రా దూరం. ఆయన స్థానంలో 104 రంజీ వికెట్ల వీరుడు జమ్మూ కశ్మీర్ పేసర్ అకిబ్ నబీ ఎంపికై చరిత్ర సృష్టించాడు. టీమిండియా టెస్టు స్క్వాడ్ వివరాలు ఇవే!
ఐసీసీ చైర్మన్ జై షా టాంజానియాలో తొలి ఐసీసీ ఆమోదిత అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం టాంజానియా క్రికెట్ అరీనాను ప్రారంభించారు. ఆఫ్రికాలో క్రికెట్ అభివృద్ధికి ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.
తెలంగాణాలో నాలుగు దశాబ్దాలకు పైగా జరిపిన పురావస్తు పరిశోధనల్లో వెలికి వచ్చిన అరుదైన సమాచారాన్ని శివనాగిరెడ్డి ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వివరించారని వేణు నక్షత్రం తన ప్రసగంలో చెప్పారు. చరిత్ర పుస్తకాల్లో లేని తెలంగాణ అస్తిత్వ ప్రతీకలైన ఈ విషయాలను అందరూ తెలుసుకోవాలన్నారు.
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరితే మళ్లీ ముంపు తప్పదా అన్న భయం మాత్రం స్థానికులను వెంటాడుతూనే ఉంది. గత వరదల అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలు కేవలం తాత్కాలికమేనని, ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.