ప్రతి పాఠశాలలోనూ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మ్యూజియం.!
Publish Date:Aug 9, 2026
Advertisement
విద్యార్థులు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మ్యూజియాలను సందర్శించడం వల్ల, వారిలో కళాత్మక వస్తువుల పట్ల మక్కువ పెరగటంతో పాటు కొత్త ఆవిష్కరణకు దారితీస్తుందని, పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. స్థానిక లైబ్రరీ మరియు స్టిక్లీ మ్యూజియం నిర్వాహకుల సమన్వయం మేరకు ఆయన న్యూజెర్సీ మోరిస్ ప్లెయిన్స్, స్టేట్ రూట్ 10, క్రాఫ్ట్మన్ లోని దీ స్టిక్లీ మ్యూజియాన్ని సందర్శించారు. జర్మన్ మూలాలు గల, అమెరికా నివాసి, డిజైనర్, వాస్తు శిల్పి, కళాత్మక ఫర్నిచర్ రూపశిల్పి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఉద్యమ అధికార ప్రతినిధిగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన గుస్తావ్ స్టిక్లీ 1898- 1917 మధ్య రూపొందించిన కళాత్మక వస్తువుల ప్రదర్శనశాల, పర్యావరణహిత కళారూపాలకు, ఆయన ప్రతిభకు అద్దం పడుతున్నాయని శివనాగిరెడ్డి తెలిపారు. ప్రదర్శనశాలతో పాటు తన నివాసంగా కూడా ఉపయోగించిన రెండంతస్తుల భవనంలోని ప్రతిగదీ ఆయన ఆలోచనలకు ప్రతిరూపాలని, అపురూపమైన వారసత్వ కట్టడాన్ని స్థానిక లైబ్రరీ ద్వారా విద్యార్థులు పెద్ద సంఖ్యలో సందర్శిస్తున్నారని.. , నిపుణులైన గైడ్లు వారికి అవగాహన కల్పించడమే కాక, కళాత్మక వస్తువుల తయారీకి ప్రోత్సహించటం ఆకట్టుకుందని శివనాగిరెడ్డి చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలల్లోనూ విధిగా, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ మ్యూజియాలను ఏర్పాటు చేసి, స్థానిక కళాకృతులు ప్రదర్శించి, కళాకారులతో శిక్షణనిస్తే, విద్యార్థుల్లో సృజనాత్మక పెరగడమే కాక, మరుగున పడిపోతున్న తెలుగు కళాకృతులకు జీవనాన్ని ఇచ్చినట్లు అవుతుందని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రులకు, విద్యారంగ స్వచ్ఛంద సంస్థలకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం విద్యార్థులకు కళాత్మక తయారీ మరియు ప్రదర్శనలో శిక్షణ నిచ్చే తీరుపై మ్యూజియం నిర్వహుకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సాంకేతిక నిపుణులు వెంకట్ బాపతు, విద్యార్థులు సిద్ధార్థ , సితార, ఇంకా విదేశీ కళాభిమానులు పాల్గొన్నారు. Pleach India Foundation, Ceo, Crafts, Miseum, Schools
http://www.teluguone.com/news/content/pleach-india-foundation-36-228465.html





