పీకే సర్వే ..ట తెరాస దే గెలుప..ట

Publish Date:Jun 23, 2022

Advertisement

ప్రశాంత్ కిశోర్ గురించి ఇప్పుడు పెద్దగా చెప్పుకోవలసింది ఏదీ లేదు. అవును, ఒకప్పడు రాజకీయ పార్టీలు  అయన వెంట పడిన మాట నిజం. కానీ, ఇప్పడు ఆయనకు అంత సీన్ లేదు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమై, ఆయన తమ పొలిటికల్ యాంబిషన్స్ బయట పెట్టుకున్నారు. అంతవరకూ ఆయన వ్యూహకర్త గానే ఉంటారని భావించిన వివిధ పార్టీల నాయకులు, ఒక్క సారిగా ఆయన  ఏకంగా కాంగ్రెస్ నే  కబ్జా చేసేందుకు స్కెచ్ గీయడం చూసి అవక్కాయ్యారు.వీడు మామూలోడు కాదు, మహా డేంజర్’ అనే విషయాన్ని కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తించారు.

ఇక అక్కడి నుంచి మమతా బెనర్జీ సహా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన  రాజకీయ పార్టీలు ఏవీ ఆయన్ని దగ్గరకు రానీయడం లేదు. ఎటొచ్చి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఆయన పేరు ఎంతో కొంత వినిపిస్తోంది. నిజానికి, రాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి నిలబెట్టే ఆలోచను తెరమీదకు తెచ్చింది పీకేనే. అయితే, చివరకు ఆయన పాత్ర ప్రమేయం లేకుండానే పతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఉమ్మడి అభ్యర్ధిగా కేంద్ర మాజీ మంత్రి, సీనియర్  రాజకీయ నాయకుడు యశ్వంత్ సిన్హాను ఎంపిక చేశాయి. అంటే .. ఒకప్పుడు పీకేకు ఎంతో కొంత విలువ ఇచ్చిన రాజకీయ పార్టీలు, నాయకులు  ఇప్పడు పీకేను తీ..తా  (తీతేసిన తహసిల్దార్ ) గానే చూస్తున్నాయని, రాజకీయ పార్టీల తీరును బట్టి తెలుస్తోంది.  అయినా జగన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరి పరిస్థితి ఒకేలా, డోలాయమానంగా ఉన్న నేపధ్యంలో  పీకే గడ్డి పోచను పట్టుకుని వేల్లాడుతున్నారు. 

అయితే, ప్రశాంత్ కిశోర్ వలన అటు  జగన్ రెడ్డికి కానీ, ఇటు కేసీఆర్ కు కానీ, పెద్దగా ఒరిగేది ఏమీ లేదు.  ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగినా, ఇంకెప్పుడో జరిగినా ఫలితం మాత్రం ఒకటిగానే ఉంటుంది. అక్కడా  ఇక్కడా కూడా అధికార పార్టీలు ఓటమిని తప్పించుకోలేవని, సర్వేలు కాదు, సర్వ జనులు, సకల జనులూ చెపుతూనే ఉన్నారు.  గోడమీది రాతలే చెపుతున్నాయి. అది అందరికీ తెలుసు, అయినా అప్పుడప్పుడు ప్రజలను మభ్య పెట్టేందుకు, పీకే సర్వేలంటూ లీకులీయడం తెరాస చాలా  కాలంగా చేస్తూనే వుంది. 

 ఇప్పడు తాజాగా  లీకు చేసిన సర్వే ప్రకారం, తెరాస తిరిగి ధికారంలోకి వస్తుందని డప్పు కొట్టారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుదందని పీకే సర్వే తెలిపింది. ఇతరులపై ఆధారాపడాల్సిన అవసరం కూడా లేదని .. సొంత మెజార్టీ వస్తుందని కూడా పీకే సర్వే తేల్చింది. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని… ఆ పార్టీ గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు. ఇక బీజేపీ చాలా దూరంగా మూడో స్థానంలో ఉంటుందే, తప్ప రాష్ట్రం మొత్తం పోటీ ఇచ్చే పరిస్థితి లేదని పీకే తేల్చినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి. 

అయితే సర్వే లీక్ అయిన సమయ సందర్భాలను గమనిస్తే, వచ్చే నెల (జూలై) 2.3 తేదీలలో హైదరాబాద్ లో జరిగే  బీజీపీ  జాతీయ కార్యవర్గ  సమావేశాల నాటికి తెరాస  సిట్టింగ్ ఎమ్మెల్యేలతో సహా, కొందరు సీనియర్ నాయకులకు కాషాయ కండువా కప్పేందుకు, బీజేపీ జాతీయ నాయకత్వం పకడ్బందీ వ్యూహంతో పావులు కదుపుతోంది. అంతే కాకుండా ఆ బాధ్యతను అమిత్ షా ఇంకెవరికి కాకుండా తెరాస ఇంటి గుట్టు మొత్తంగా తెలిసిన ఈటల రాజేందర్ కు అప్పగించారు. దీంతో అప్రమత్తమైన తెరాస నాయకత్వం, పీకే పేరున వండిన సర్వేను లీక్ చేసిందని, గులాబీ కోటలో గుసగుసలు గుప్పుమంటున్నాయి. 

మరోవంక ప్రజల్లో  నిజంగా ఆగ్రహం ఉందంటే అది  ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వుంది. సర్వ శాఖల మంత్రిగా వ్యవహరిస్తున్న కేటీఅర్ మీద వుంది. మంత్రి పదవి కోసం విలువలను వదులుకున్న మరో కీలక మంత్రి మీద ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అది టీవీ తెరల మీద, సోషల్ మీడియాలో కనిపిస్తూనే వుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  కేసేఅర్  కుటుంబ పాలన మీద ప్రజలో ఆగ్రహం వుంది. అసహనం వ్యక్తమవుతోంది. అయితే, బీజేపీ కేసీఆర్ కుటుంబ పాలనను ప్రధాన ఎజెండాగా కాంపెయిన్ కు సిద్దమవుతున్న నేపధ్యంలో, ప్రజల దృష్టి  ఆ విషయం పై నుంచి తప్పించేందుకు, ఎమ్మెల్యేలను పీకే పేరున బకరాలను చేశారని  తెరాస వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి ఉందని పీకే నివేదిక ఇచ్చారంటూ ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించారు. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో సానుకూలత లేదని.. ఖచ్చితంగా వారిని మార్చాల్సిందేనని చెబుతున్నారు. ఆయా స్థానాల్లో సిట్టింగ్‌లకు సీట్లు ఉండవని ముందుగానే సంకేతాలు పంపేందుకు ఇలా చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.  అయితే, అందులో కొంత నిజం ఉన్నా, మొత్తంగా ప్రభుత్వం మీదనే అసంతృప్తి ఉందని కూడా సర్వే చెప్పిందని అంటున్నారు. అయితే, ఇది కూడా జిమ్మిక్కే అంటున్నారు.

నిజానికి, తెరాస ప్రభుత్వ వ్యతిరేకత , పీకే చెప్పినా చెప్పక పొయినా, పీక్ కు చేరిందనేది నిజం.అది రేషన్ కార్డులు,  కొత్త పింఛన్లు ఇస్తే పోయేది కాదు. తెలంగాణ అస్తిత్వాన్ని సవాలు చేస్తున కుటుంబ పాలనకు, రాష్ట్రన్ని అప్పుల్లో ముంచెత్తి కూడ బెట్టిన కోట్ల కోట్ల అవినీతి, గురించి, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందుకే, పెద్ద గీత పక్కన చిన్న గీత  గీసి అసలు సమస్యల నుంచి ప్రజా దృష్టిని  దారి మళ్ళించేందుకే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే, తెరాస  పీకే పేరున సర్వే  లీక్ ను విడుదల చేసిందని, తెలంగాణ భవన్  కోడై కూస్తోంది.

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.