సొంత వైద్యం వంటబట్టదు అంటే ఇదేనా?

Publish Date:Apr 15, 2025

Advertisement

స్వరాష్ట్రంలో  పని చేయని పీకే వ్యూహాలు!

ప్రశాంత్ కిషోర్, పీకే.. పేరు చాలు. పరిచయం అవసరం లేదు.పీకే అంటే చాలు, ఆయన ఎవరో, ఆయన ఏమిటో అందరికీ అర్థమైపోతుంది.ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు అంత మంచి గుర్తింపు వుంది. అయితే అది ఆయన గతం. ప్రస్తుతం ఆయన, వేషం మార్చారు. రాజకీయ అరంగేట్రం చేశారు. సో.. ఇప్పడు పీకే పొలిటీషియన్, రాజకీయ నాయకుడు.  జన సురాజ్  పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపక అద్యక్షుడు. ఈ సంవత్సరం చివర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య భూమికను పోషించేందుకు తహతహ లాడుతున్న రాజకీయ నాయకుడు. ఈ ఎనికల్లో ఎలాగైనా కింగ్, కాదంటే కనీసం కింగ్ మేకర్ కావాలని కలలుకంటున్నారు.  

అవును గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలు, ఏపీ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి  వరకు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మొదలు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరకు ఎందరో నాయకులకు, ఎన్నో పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్  ఇప్పడు స్వయంగా ఎన్నికల బరిలో దిగుతున్నారు. వ్యూహాత్మకంగా పావులు  కదుపుతున్నారు.అయితే  అదేదో సామెత చెప్పినట్లు  అందరికీ వర్కౌట్ ఆయన  వ్యూహలు, సొంతానికి వచ్చేసరికి అతంగా పనిచేస్తున్నట్లు లేదని అంటున్నారు.   ఔను పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు.. సొంత వైద్యం వంటబట్టదు అని పెద్దలు ఊరికే అన్నారా? ఇప్పడు తాను స్వయంగా రాజకీయవేత్తగా మారిన పీకేకు ఆయన వ్యూహాలు ఆయన సోంత పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడటం లేదు.. ఫలించడం లేదు.  

నిజానికి నాలుగేళ్ళ కిందట (2021)పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి పని చేసిన పీకే  ఇక పై  ఏ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా పని చేయనని ప్రకటించారు. అలాగే  క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేది లేదనీ అన్నారు. అంతే కాదు,  నేను రాజకీయాలకు పనికిరాను  అని తనకు తానే   సెల్ఫ్  సర్టిఫికేట్  ఇచ్చుకున్నారు. అయితే, ఆ తర్వాత కొద్ది కాలానికే  ఆ ఒట్టు తీసి గట్టున పెట్టారు. కాంగ్రెస్  పార్టీలో చేరేందుకు,  బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు  ప్రయత్నాలు సాగించారు. కాలికి బలపం కట్టుకుని దేశం అంతా తిరిగారు. శరద్ పవార్ మొదలు కేసీఆర్  వరకు ప్రముఖ నేతలు అందరినీ కలిశారు. అందరినీ కలిపారు. మరోవంక కాంగ్రెస్ పునర్జీవనానికి ఉడతా భక్తిగా   ఉచిత  సలహాలు కూడా ఇచ్చా రు. చివరకు  తాతకు దగ్గులు నేర్పినట్లు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సిడబ్ల్యుసి) సభ్యులను కూర్చోపెట్టి పాఠాలు చెప్పారు. ఇలా దేశ రాజకీయాల్లో  తన కంటూ ఒక స్థానం సంపాదిం చుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. 

సరే ఆ ప్రయత్నాలు ఏవీ అంతగా పని చేయలేదు. మధ్యలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అప్పటి అధికార పార్టీలతో డీల్  కుదుర్చుకున్నారు. అయితే  అక్కడా కథ అడ్డం తిరిగింది. ఉభయ రాష్ట్రాల్లో ఆయన వ్యూహాలు ఉడక లేదు.ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ బండ్లు బోల్తా కొట్టాయి. అక్కడ ఏపీలో  జగన్ రెడ్డి, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఇద్దరి కిద్దరు చిత్తుగా ఓడి పోయారు. జగన్ రెడ్డి పరిస్థితి అయితే మరీ ఘోరం, పదకొండు పరుగులకే ఔటై పోయారు. ఇక చివరి ప్రయత్నంగా స్వరాష్ట్రం బీహార్ లో సొంత జెండా ఎగరేశారు. జన సురాజ్  పార్టీని స్థాపించారు. సంవత్సరం పైగా రాష్ట్రంలో పాద యాత్ర చేస్తున్నారు. అయితే  అదేమిటో కానీ, శకునం చెప్పే బల్లి  కుడితిలో పడింది అన్నట్లుగా.. యూపీ, బెంగాల్, ఢిల్లీ, ఏపీ ఇలా ఎక్కడెక్కడో, ఎవరెవరినో గెలిపించిన  ప్రశాంత్ కిషోర్ వ్యూహం  స్వరాష్టంలో,  పని చేస్తున్నట్లు లేదని అంటున్నారు. 

ఇటీవల బీహార్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో జేఎస్పీ తొలిసారిగా ఎన్నికల బరిలో దిగింది.అయితే  నలుగు స్థానాలకు ఒంటరిగా పోటీ చేసిన జేఎస్పీకి  ఒక్క సీటు దక్కలేదు. కానీ  జేఎస్పీ ఖాతాలో పది శాతం ఓట్లు అయితే పడ్డాయి. అలా జేఎస్పీ చీల్చిన ఓట్లు ప్రతిపక్ష కూటమిని దెబ్బతీశాయి. మూడు సిట్టింగ్ స్థానాలతో పాటుగా మొత్తం నాలుగు స్థానాలలో ఆర్జేడీ సారధ్యంలోని మహా ఘటబంధన్ ఓడిపోయింది. రెండు నియోజక వర్గాల్లో అయితే  అధికార ఎన్డీఎ కూటమి అభ్యర్ధులకు వచ్చిన మెజారిటీ కంటే జేఎస్పీకి వచ్చిన ఓట్లు ఎక్కువని లెక్క తేలింది. దీంతో  పీకే అసలు రంగు బయట పడిందని బీహార్ ప్రజలు పీకే పార్టీని, బీజేపీ బీ  టీమ్ గా భావిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు.

ఈ నేపధ్యంలో ఇండియా టుడే నిర్వహించిన తాజా సర్వేలో జేఎస్పీ ఓటు షేర్  ఏకంగా  పది నుంచి మూడు శాతానికి పడి పోయిది. దీంతో కింగ్ ఆర్ కింగ్ మేకర్ కావాలనే పీకే   కల కలగానే మిగిలి పోతుందని అంటున్నారు. అలాగే ఇటీవల పాట్నాలో జేఎస్పీనిర్వహించిన తొలి భారీ బహిరంగ సభకు లక్షల్లో జనం వస్తారని  భావించి ఏర్పాట్లు చేస్తే వేలల్లో కూడా జనం రాలేదు. అందుకే పీకే పట్టుమని పది నిముషాలు అయినా మాట్లాడకుండానే తట్టా బుట్టా సర్దేశారు. సో .. బీహార్ ఎన్నికల్లో పీకే పాత్ర ఏమిటన్నది ఇప్పడు ప్రశ్నార్ధకంగా మారిందని అంటున్నారు. అలాగే, ఉప ఎన్నికల్లో పోటీ చేయడం వ్యూహకర్త చేసిన వ్యూహాత్మక తప్పిదంగా భావిస్తున్నారు.

By
en-us Political News

  
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.