చంద్రబాబు-పెగాస‌స్ వెనుక పీకే స్కెచ్‌!.. జ‌గ‌న్‌-మ‌మ‌త మిలాఖ‌త్‌!?

Publish Date:Mar 19, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్’లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా? ఇంతవరకు, దూరం దూరంగా ఉన్న మాజీ మిత్ర పక్షాలు, టీడీపీ, బీజేపీ, జనసేనలు మళ్ళీ మరోసారి దగ్గరయ్యే దిశగా అడుగులు పడుతున్నాయా? అంటే, అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో రాష్టంలో రాజకీయ శక్తుల పునరేకీకరణ చర్చ మరో మారు తెరమీదకు వచ్చింది. కాగా, పవన్ కళ్యాణ్, 2024 ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా, ప్రభుత్వ (వైసీపీ) వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తానని అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల నేపధ్యంగా, ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ టీడీపీతోనూ పొత్తు ఉంటుందని చెప్పకనే చెప్పారని విశ్లేషకులు భావిస్తున్నారు. 

అలాగే, ఇంతవరకు బీజేపీ, వైసీపీల మధ్యకొనసాగుతున్న రహస్య ఫెవికాల్ బంధం పుటుక్కుమనే  సంకేతాలు కనిపిస్తున్నాయా, అంటే,  అందుకూ రాజకీయ విశ్లేషకుల నుంచి అవునననే సమాధానమే వస్తోంది. నిజానికి, జగన్మోహన్ రెడ్డి, బీజేపీతో చెలిమి చేస్తున్నా, ఆయన మనసు మాత్రం బీజేపీ ఓటమినే కోరుకుంటోంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కరలేదు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే, జగన్ రెడ్డి, ‘బ్యాడ్ లక్’ కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. ఇక ఏపీకి ప్రత్యేక హోదా రాదు’ అని చేతులు ఎత్తేశారు. అంటే, బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడం ఆయనకు ఇష్టంలేదని, మనసులో మాటను బయట పెట్టారు. 

అయినా, ప్రత్యేక హోదా విషయం పక్కకు పోయినా, గడచిన మూడేళ్ళుగా, బీజేపీ, వైసేపీల రహస్య స్నేహబంధం, మూడు ముద్దులు, ఆరు హగ్గులుగా సాగిపోతూనే ఉంది. అందుకే, జగన్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నా, ఆర్థిక వ్యవస్థను సమూలంగా సర్వనాశనం చేసినా, కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూనే వుంది కానీ, బాధ్యతగా తీసుకోవలసిన చర్యలు ఏవీ తీసుకోలేదు. అంతే కాదు, అప్పులు పెంచుకుంటూ పోవడానికి అనుమతులు ఇచ్చుకుంటూ పోయింది.ఒక విధంగా చూస్తే నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగుతున్నాను అన్నట్లుగా  బీజేపీ, వైసీపీ రహస్య ప్రేమను బహిరంగంగా చాటుకున్నారు. 

అయితే, తాజా పరిణామాల నేపధ్యంలో ఇరు పార్టీల మధ్య దూరం పెరిగినట్లు కనిపిస్తోందని, పరిశీలకులు అంటున్నారు. జాతీయ రాజకీయాలలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు జరుగుతున ప్రయత్నాలకు ఇంతవరకు జగన్ రెడ్డి దూరంగానే ఉన్నారు. అయితే, రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నా నేపద్యంలో, జగన్ రెడ్డి తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీకి దగ్గరయ్యే దిశగా కడులుతున్నారని, అటు మమత, ఇటు జగన్ రెడ్డి ఇద్దరికి, ప్రశాత్ కిషోర్’ వారధిగా పనిచేస్తున్నారని, ఆయన డైరెక్షన్’ లోనే  మమత బెనర్జీ, పెగాసస్ స్పైవేర్‌ మురికిని చంద్రబాబు నాయుడుకి పులిమే ప్రయత్నం చేశారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్’ ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్‌’ ను కొనుగోలు చేసిందని ఆమె ఓ సరికొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు.  మమతా బెనర్జీ ఏ ఆధారాలతో ఈ ఆరోపణ చేశారో ఏమో గానీ, దున్నపోతు ఈనింది అంటే, దూడను కట్టేయమన్నట్లుగా వైసీపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం వెంటనే, ఒక కమిటీ  చంద్రబాబు నాయుడును బోనులో నిలబెట్టి విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.
 
నిజానికి, నిజంగా గత ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్‌’ ని కొని ఉంటే, అందుకు సంబందించిన వివరాలు ప్రభుత్వం వద్ద ఉండకుండా ఉండవు. అయినా ఈ మూడేళ్ళలో ఎప్పుడు వైసీపే ప్రభుత్వం ఆవిషయం ఎక్కడా ప్రస్తావించలేదు.  అయినా , కనీసం వాటిని పరిశీలించే ఆలోచన అయినా చేయకుండానే, వైసీపే ఎంపీ, నందిగం సురేష్ మేడి ముందుకు వచ్చి అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. నిజానికి, పెగాసస్‌ స్పైవేర్‌’ వ్యవహారంలో సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది. అంతే కాదు, సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ, కేవలం కేంద్ర ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్‌’ కొన్నది నిజమేనా, నిజమైతే దుర్వినియోగం చేసింది నిజమా అనే కోణంలోనే కాదు, ఆంధ్ర ప్రదేశ్ సహా అన్ని రాష్ట్ర ప్రభత్వాల ప్రమేయాన్ని కూడా విచారిస్తోంది. సో.. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. అయినా, ఇలా మమతా బెనర్జీ ఏ ఆధారం చూపకుండా ఆరోపణ చేయడం, ఆ వెంటనే వైసీపే నేతలు చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమండ్ చేయడంతో, బీజేపీ, వైసీపీల మధ్య జగడం మొదలైందని అనుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు. మరోవంక విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, బీజేపీ రాయలసీమ రణభేరి సభ ఏర్పాటు చేయడాన్ని ఎద్దేవా చేశారు. అంతేకాదు మూడేళ్ళలో మొదటి సారిగా, కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయలేదనే మాట వైసీపే మంత్రి నోటి నుంచి వచ్చింది. సో.. ఒక .. వైసీపీ , బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు సిద్దమైందని అనుకోవచ్చని అంటున్నారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.