Publish Date:May 10, 2024
ఏపీ ఎన్నికలలో హాట్ సీట్లు అనదగ్గ వాటిలో మొదటిగా చెప్పుకోవలసింది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపైనే. ఎందుకంటే ఇక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా వైసీపీ వంగా గీతను బరిలోకి దింపింది. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని పవన్ కల్యాణ్ కు పోటీగా అదే కాపు సామాజికవర్గానికి చెందిన వంగా గీతను వ్యూహాత్మకంగా వైసీపీ పోటీలో నిలబెట్టింది. అలాగే కాపు సామాజికవర్గానికే చెందిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకుంది. పవన్ కు వ్యతిరేకంగా ముద్రగడ పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు మరో మూడు రోజుల వ్యవధిలోకి వచ్చేసిన తరుణంలో ప్రచారం జోరందుకుంది.
అయితే వాతావరణం మాత్రం పవన్ కల్యాణ్ కు పూర్తి అనుకూలంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పవన్ కు గట్టి బలంగా మారింది. పవన్ కల్యాణ్ కోసం కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా హీరోలు, పలువురు సినీ, బుల్లితెర సెలిబ్రిటీలు సైతం పిఠాపురంలో మకాం వేసి పవన్ కల్యాణ్ ను గెలిపించాల్సిందిగా కోరుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిని గెలిపించాలంటూ ఓ వీడియో సందేశం ద్వారా ఇచ్చిన పిలుపు కూడా నియోజకవర్గ ఓటర్లపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. ఇప్పటికే వెలువడిన పలు సర్వేలు పిఠాపురంలో పవన్ విజయం నల్లేరు మీద బండినడకేనని తేల్చేశాయి.
ఇక జనసేన శ్రేణులైతే పవన్ విజయం ఎప్పుడో ఖరారైందనీ, ఇప్పుడు తమ దృష్టింతా ఆయన సాధించబోయే మెజారిటీపైనేనని చెబుతున్నాయి. ఇక నియోజకవర్గంలో పరిస్థితులను నిశితంగా పరిశీలించిన రాజకీయ పండితులు పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని చెబుతున్నారు. కొన్ని సర్వే సంస్థలు కూడా ఆయనకు 75 వేల నంచి లక్ష ఓట్ల వరకూ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి. జగన్ సర్కార్ పట్ల ప్రజలలో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు తోడు కూటమి బలం, కాపు సామాజికవర్గం మద్దతు కలిసి పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pithapuram-pawan-victory-confirmed-25-175576.html
ఇన్ని వేల కోట్లు పంచిపెట్టినా జనం తనను మోసం చేశారని అంటూ ఒక దశలో జగన్ కన్నీరు పెట్టుకున్నారని కూడా సమాచారం.
రేవ్ పార్టీ ఉచ్చు బిగుస్తోంది. బెంగుళూరు నుంచి తప్పించుకుని వచ్చినట్లు చెబుతున్న పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తల్లి ఆదివారంరాత్రి మృతి చెందింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ ముఖ్య భూమిక వహించారు.
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు’ ఈ పదాన్ని మళ్ళీ వినడానికి ఇంకా ఎంతో సమయం పట్టదు. ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి హోదా వచ్చేసింది.
చంద్రగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. నియోజకవర్గ పరిధిలో ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్లను మళ్లీ స్కృటినీ చేయాలనీ, అలాగే నియోజకవర్గ పరిధిలోని నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఆన సుప్రీం ను ఆశ్రయించారు.
ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది వైసీపీ నాయకులు జైలుకు వెళ్ళడం ఖాయంలా కనిపిస్తోంది. అలా చిప్పకూడు తినే వైసీపీ నాయకులలో మొట్టమొదటి స్థానంలో సజ్జల రామకృష్ణారెడ్డి వుండబోతున్నారు.
నాలుగు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గాలలో తెలుగుదేశం వినా మరో జెండా ఎగిరిందే లేదు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ఆ రెండు నియోజకవర్గాలూ తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలుగానే ఉన్నాయి.
అబ్ కీ బార్ 400 బాహర్ అనే నినాదంతో సార్వత్రిక ఎన్నికల బరిలో దిగిన బిజెపి తెలంగాణలో డబుల్ డిజిట్ సాధిస్తుందని వివిధ ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. అయితే కౌంటింగ్ కు 24 గంట ముందు రెండు ప్రముఖ ఎగ్జిట్ పోల్ సర్వేల్లో మాత్రం హైదరాబాద్ లోకసభ బిజెపి కైవసం చేసుకుంటుందని వెల్లడైంది.
పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తున్న జగన్ పార్టీకి సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది.
కొన్ని శక్తులు పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని తపస్సు చేస్తున్నాయి.
వైసీపీ నుంచి అధికార పగ్గాలు చేజారిపోతున్నాయనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లుగా తన మౌఖిక ఆదేశాలతో పోలీసు శాఖను ఉరుకులు పరుగులు పెట్టించిన సజ్జలపై తాడేపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానం తప్పు పట్టింది.
కల్వకుంట్ల కవిత ఇప్పుడప్పుడే జైలు నుంచి బయటకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న కవిత రిమాండ్ని జులై 3వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.