పి(న్నె)ల్లి వారి పల్నాటి ‘పిరికితనం’!
Publish Date:May 18, 2024
Advertisement
పల్నాటి పౌరుషం గురించి మనం కథలు కథలుగా విని వుంటాం. పలనాటి వీర చరిత్రలో బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ, బాలచంద్రుడి పౌరుషం గురించి తెలుసుకుని పులకరించిపోయి వుంటాం. ‘పల్నాటి యుద్ధం’, ‘పల్నాటి పౌరుషం’ సినిమాలు చూసి మన తెలుగువారికి ఇంత గొప్ప చరిత్ర వుందని హ్యాపీగా ఫీలై వుంటాం. తెలుగువారందరి మనసులలో ‘పల్నాడు’ అనే మాట వింటేనే పౌరుషంతో పిడికిళ్ళు బిగుసుకునే ఒక ఫీల్....! ఆ ఫీల్ ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది.. అంతటి పౌరుషం గడ్డ మీద పుట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అరెస్టు అయిపోతామనే భయంతో పిల్లిలాగా గోడ దూకి హైదరాబాద్ పారిపోయారన్న విషయం తెలుసుకుని, వీళ్ళిద్దరి విషయంలో ‘పల్నాటి పౌరుషం’ అనే మాటని పక్కన పెట్టి... ‘పల్నాటి పిరికితనం’ అనే మాటని ఉపయోగించాలని అనిపించడం న్యాయమే. ఈ బ్రదర్స్ ఇద్దరూ పోలింగ్ సందర్భంగా ఎన్ని దారుణాలు చేయాలో అన్ని దారుణాలూ చేశారు. రౌడీ మూకల సహకారంతో రక్తాన్ని పారించారు. ఎదుటి వారి మీద దాడి చేయడం పౌరుషం అవదు.. పిరికితనం అవుతుంది. పోలింగ్ సందర్భంగా వీరిద్దరూ భారీ స్థాయిలో పిరికితనం ప్రదర్శించారు. వీరి నేరాలు, ఘోరాలు బయటపడి హౌస్ అరెస్ట్ అయ్యారు. చివరికి అరెస్టు అయి జైల్లో పడే అవకాశం వుందని తెలుసుకుని, ఇంటి వెనుక గోడదూకి హైదరాబాద్కి పారిపోయారు. వీళ్ళిద్దరూ పిరికివాళ్ళని తెలుస్తుందిగానీ, మరీ ఇంత పిరికివాళ్ళని ఎవరూ అనుకోలేదు. వీళ్ళిద్దరి ఇంటి పేరు ‘పిన్నెల్లి’ అని కాకుండా ‘పిల్లి’ అని మార్చుకోవడం మంచిది. ఇలాంటి పిరికి పిల్లులు పల్నాటి గడ్డ మీద భవిష్యత్తులో పుడతారని తెలిసుంటే బ్రహ్మనాయుడు, నాగమ్మ, బాలచంద్రుడు ఈ ప్రాంతం వదిలి పారిపోయి వుండేవారు.. వీళ్ళ నాయకుడు జగన్ ఓడిపోతానని భయపడిపోయి లండన్ పారిపోయారు. వీళ్ళిద్దరూ అరెస్టు అవుతామని భయపడి హైదరాబాద్ పారిపోయారు. వీళ్ళిద్దరూ తిరిగి పల్నాడులో అడుగు పెట్టకుండా వుంటే ఆ ప్రాంతానికి గౌరవం. ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ‘పల్నాటి పిల్లి’ అనే బిరుదును, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి ‘పల్నాటి పిల్ల పిల్లి’ అనే బిరుదులు ప్రదానం చేయడమైనది.
http://www.teluguone.com/news/content/pinnelli-brothers-escape-to-hyderabad-25-176284.html