పట్టుదల, అంకిత భావం పంచుమర్తి విజయ రహస్యం

Publish Date:Mar 24, 2023

Advertisement

పార్టీ పట్ల అంకిత భావం, పని పట్ల శ్రద్ధ, సాధించాలన్న పట్టుదల ఇవే పంచుమర్తి అనూరాథ ప్రత్యేకతలు. కష్టంలోనూ కర్తవ్యాన్ని విస్మరించకపోవడం, పదవుల కన్నా ప్రజాసేవే మిన్న అన్న భావం ఆమెను ప్రతికూల పరిస్థితుల్లోనూ విజయతీరాలకు చేర్చాయి. రాజకీయ ప్రవేశంతోనే ఆమె  విజయవాడ నగర మేయర్ గా ఎన్నికయ్యారు. తాజాగా ఎమ్మెల్యే  కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

పంచుమర్తి అనురాధ సరిగ్గా 23 ఏళ్ల కిందట రాజకీయ రంగ ప్రవేశం ఎలా చేశారు? అతి చిన్న వయసులోనే మేయర్‌గా  ఎన్నికయారు?  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన  అనంతరం   పంచుమర్తి విజయం విజయం తెలుగుదేశం శ్రేణుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. రెట్టింపు ఉత్సాహం నింపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన పంచుమర్తి అనురాధ రాజకీయ ప్రయాణమూ సంచలనమే . ఆమె కుటుంబానికి  రాజకీయాలతో ఇసుమంతైనా సంబంధం లేదు.  తండ్రి స్వర్గం పుల్లారావు ఐఆర్‌ఎస్‌. ఆదాయపన్నుశాఖలో జాయింట్‌ కమిషనర్‌గా పనిచేసి, పదవీ విరమణ చేశారు. తల్లి గృహిణి. అనురాధకు ఒక సోదరి, సోదరుడు ఉన్నారు.

 ప్రాథమిక విద్య హైదరాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌లో చదివిన పంచుమర్తి అనూరాథ హైస్కూల్‌, ఇంటర్‌ విద్యను విజయవాడలోనూ,  పూర్తి   బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ను గుంటూరు జేకేసీ కళాశాలలో పూర్తి చేశారు.  ఆ తర్వాత  ఆమె   నాగార్జున యూనివర్సిటీ నుంచి నుంచి జర్నలిజంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌  చేశారు. అటు పుట్టింటి వారు, ఇటు అత్తింటి వారు ఎవరికీ రాజకీయాలతో సంబంధంలేకపోయినా ఆమె అనూహ్యంగా రాజకీయాలలోకి వచ్చారు.  2000 సంవత్సరంలో 26 ఏళ్ల పిన్న వయస్సులో విజయవాడ మేయర్‌ పదవిని దక్కించుకున్నారు. విజయవాడ మేయర్ పోస్టును మహిళలకు రిజర్వ్ చేసిన విషయాన్ని వార్తా పత్రికలో చదికి ఆసక్తితో  తన చదువు, కుటుంబ వివరాలను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పంపారు. అప్పట్లో   మేయర్‌ పదవికి డైరెక్ట్ ఎలక్షన్ జరిగేది.   తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా మేయర్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. టెక్నాలజీ అంటే స్వతహాగా ఆసక్తి ఉన్న చంద్రబాబుకు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ చేసిన పంచుమర్తి అనురాధ ఇచ్చిన సమాధానాలు, పంచుకున్న అభిప్రాయాలు నచ్చాయి. అంతేకాదు, విద్యారంగపైన   అనురాధకు చక్కటి అవగాహన ఉందని గ్రహించిన చంద్రబాబు ఆమెనే ఎంపిక చేశారు.

అప్పుడు జరిగిన మేయర్ ఎన్నికలలో   కాంగ్రెస్‌ నుంచి నాగరాణి, కమ్యూనిస్ట్‌ పార్టీల అభ్యర్థి తాడి శకుంతల ను ఓడించి 6800 కు పైగా ఓట్ల మెజారిటీతో  అనురాధ విజయం సాధించారు. డైరెక్ట్ ఎన్నికలలో మేయర్ గా ఎన్నికైన అనురాధ తొలి నాళ్లలో రాజకీయ అనుభవం లేక ఒకింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే అనతి కాలంలోనే అన్ని విషయాలలోనూ నైపుణ్యం సంపాధించారు.  మేయర్‌ పదవీ కాలం పూర్తయిన తర్వాత రాజకీయాల్లో కొనసాగాలని ఆమె భావించలేదు.

కానీ  2007 నుంచి మళ్లీ తెలుగుదేశంలో క్రియాశీలంగా వ్యవహరించడం ప్రారంభించారు. ఆక్రమంలో  2009లో మంగళగిరి నుంచి పోటీ చేయాలని భావించినా పొత్తులో భాగంగా ఆ సీటు  బీజేపీకి  తెలుగుదేశం కేటాయించింది.   దీంతో పోటీ చేయడం కుదరలేదు. అయితే పార్టీలో పలు పదవులు నిర్వహించారు.  అధికార ప్రతినిధిగానూ వ్యవహరించారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి అవకాశం దక్కించుకోవడమే కాకుండా ఘన విజయం సాధించారు.

By
en-us Political News

  
ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాల్లో స‌వాళ్ల ప‌ర్వం స్టార్ట్ అయింది. ప్ర‌చారంలో ప్రధాన పార్టీల నేత‌లు మాట‌ల‌ ప‌దును పెంచుతున్నారు. రాజ‌కీయ స‌వాళ్ళు, ప్ర‌తిస‌వాళ్ళ‌తో నేత‌లు, ఓట‌ర్ల‌ను వినోదాన్ని పంచుతున్నారు. “హాష్ ట్యాగ్ బ్యాండైడ్ ఛాలెంజ్” పేరుతో ట్విట్టర్ లో ఛాలెంజ్ విసురుకుంటున్నారు.
కోడలికి బుద్ధి చెప్పి అత్త మూకుడు నాకిందనే సామెత తెలుగువారందరికీ తెలిసే వుంటుంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన రాజకీయ ఉత్కంఠ, టెన్షన్ భరిత వాతావరణం చాలదన్నట్టుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అగ్నిలో ఆజ్యం పోశారు.
వల్లభనేని వంశీ నామినేషన్ దాఖలు చేసిన రోజునే ఓటమిని అంగీకరించేశారా? అంటే పరిశీలకలు ఔననే అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించడం ద్వారా తనకు గెలుపు ఆశలు ఆవిరి అయిపోయాయని చెప్పకనే చెప్పేశారు.
డోన్ నియోజకవర్గం వైైసీసీ అభ్యర్థి మంత్రి  బుగ్గన నామినేషన్ పెండింగ్లో పడింది.   మంత్రి బుగ్గన రాజేంద్రనాథ నామినేషన్ ను ఆర్వో పెండింగ్ లో ఉంచారు.
ఏపీ ఎన్నికల సందర్భంగా జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో కమెడియన్ హైపర్ ఆది ప్రచారం చేస్తున్నారు.
హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ భార్య వసుంధర నామినేషన్! అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర గురువారం నామినేషన్ దాఖలు చేశారు.
ఓ వైపు ప్రజా వ్యతిరేకత, మరో వైపు చెల్లెళ్ల విమర్శలు, ఇంకో వైపు పార్టీ నుంచి పెరిగిపోతున్న వలసలు, వెరసి ఓటమి భయంతో జగన్ వణికి పోతున్నారా? ఆఫ్రస్ట్రేషన్ లో సొంత చెల్లెలిపైనే అనుచిత వ్యాఖ్యలు చేసి తనకు తానే నష్టం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఏంటమ్మా జగనూ... మొన్న చెల్లి షర్మిలమ్మ ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్ దాఖలు చేసినప్పుడు చూశాంలే..
కేసీఆర్ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సెంటిమెంట్ ను పండించేందుకు నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత కారణాలేమైతేనేం చాలా రోజుల పాటు ఎక్కడా బహిరంగంగా మాట్లాడని ఆయన ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట ప్రజల ముందుకు వచ్చారు.
గుడివాడ, గన్నవరం.. ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రెండు చోట్లా కూడా వైసీపీ అభ్యర్థుల తీరు, భాష పట్ల ఆయా నియోజకవర్గాలలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ వైసీపీ గాంభీర్యం పదర్శిస్తూ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నది.
ఏపీలో భానుడు చండ్ర నిప్పులు చెరుగుతున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.