అన్నా చెల్లెళ్ల ఆస్తి వివాదంలో పేర్ని నాని తీర్పేమిటో?

Publish Date:Oct 26, 2024

Advertisement

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ఏపీపీసీసీ అధినేత్రి, జగన్ సోదరి షర్మిల మధ్య  ఆస్తుల వివాదంలో రోజుకో ట్విస్ట్ బయలకు వస్తోంది. ఆస్తుల వివాదంపై అన్నాచెల్లెళ్ల వాదనకు భిన్నంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని జగన్ వాదనను ఖండించేలా ఆయనకు మద్దతుగా ఆయనకే తెలియని విషయాలు వెల్లడిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించక ముందే ఆయన పిల్లలకు ఆస్తులు పంచారని మాజీ మంత్రి పేర్నినాని బల్లగుద్ది చెబుతున్నారు. ఇప్పుడు షర్మిల కోరుతున్న ఆస్తులన్నీ జగన్ స్వార్జితమని తీర్పిచ్చేస్తున్నారు.

శుక్రవారం (అక్టోబర్ 25) తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో కలసి మీడియాతో మాట్లాడిన పేర్నినాని.. వైఎస్‌ బతికుండగానే జగన్‌కు, షర్మిలకు ఎవరికి ఇచ్చే ఆస్తులను వారికి సవివరంగా రాసిచ్చారని తెలిపారు. జగన్ కంపెనీలలో షర్మిల ఎంత మాత్రం షేర్ హోల్డర్ కాదనీ చెప్పారు.   అసలు వైఎస్ కుటుంబంలో అన్నాచెల్లెళ్ల ఆస్తుల గొడవ ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది. వైఎస్ కుటుంబ ప్రతిష్ఠను మంటగలిపేలా జగన్ తీరు ఉందని వైఎస్ అభిమానులు బాహాటంగానే చెబుతున్నారు. వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి షర్మిల ఇల్లూ వాకిలీ వదిలేసి మరీ పాదయాత్ర చేశారనీ, తీరా వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత చెల్లిని దూరం పెట్టారనీ వైసీపీ శ్రేణులే కాదు, వైఎస్ అభిమానులూ గుర్తు చేసుకుంటున్నారు. దీంతో అన్నా చెల్లెళ్ల ఆస్తి వివాదం కుటుంబ వ్యవహారం స్టేజి దాటిపోయింది. దీనిపై బహిరంగ చర్చలే జరుగుతున్నాయి. 

ఆస్తుల గొడవలు కుటుంబాలలో సహజమే, ఇది మా వ్యక్తిగత వివాదం అంటూ జగన్ దీనిని తేలికగా కొట్టిపాడేయడానికి ప్రయత్నిస్తుంటే.. షర్మిల మాత్రం జగన్ కు గట్టి కౌంటర్ ఇస్తూ, తనకు జగన్ అన్యాయం చేశారని ఎలుగెత్తి చాటుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలు షర్మిల, జగన్ లమధ్య చిచ్చుకు తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కారణమంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఆరోపణలను ఖండిస్తూ షర్మిల అన్నకు బహిరంగ లేఖ రాశారు. 

దీంతో పేర్ని నాని జగన్ తరఫున వకాల్తా పుచ్చుకుంటూ మీడియా ముందుకు వచ్చేశారు.  జగన్ ను రాజకీయంగా దెబ్బ కొట్టడానికే చంద్రబాబు, షర్మిలను పావుగా వాడుకుంటున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు జగన్ ను రాజకీయంగా దెబ్బకొట్టడానికి చంద్రబాబు కొత్తగా షర్మిల వివాదాన్ని బయటకు తీసుకురావడం ఎందుకు.. ఇటీవలి ఎన్నికలలో జగన్ పార్టీని జనం 11 స్థానాలకు పరిమితం చేసినప్పుడే ఆయన రాజకీయంగా జీరో అని తేలిపోయిందని తెలుగుదేశం వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి. జగన్ అధికారం చేపట్టిన తరువాత ముందు షర్మిలను, ఆ తరువాత తల్లి విజయమ్మను పార్టీ నుంచి బయటకు పంపేసిన విషయం పేర్ని నానికి గుర్తు లేదా అని నిలదీస్తున్నారు.  

జగన్ కోసం, ఆయనను ముఖ్యమంత్రిని చేయడం కోసం చెల్లి షర్మిల, తల్లి విజయమ్మలను అధికారంలోకి రాగానే జగన్ ఎలా పక్కన పెట్టేశారో, ఆంధ్రప్రదేశ్ వీడి పొరుగురాష్ట్రంలో తలదాచుకోవలసిన పరిస్థితి కల్పించారో తెలియదా అని ప్రశ్నించారు.  అంతెందుకు జగన్ కోసం ఆయన ప్రాపకం కోసం ఉచ్ఛనీచాలు, మంచి చెడ్డలూ వదిలేసి ఇష్టారీతిగా చెలరేగి.. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై, పవన్ కల్యాణ్ పై నోటికొచ్చినట్లల్లా మాట్లాడిన బోరుగడ్డ ప్రసాద్ ను జగన్  ఎలా వదిలించుకున్నారో కనిపించడం లేదా?  అని నిలదీస్తున్నారు. 

అయినా ఓ పక్క జగన్ సొంత చెల్లి, వైఎస్ కన్నబిడ్డ షర్మిల.. ఇది మా తండ్రి ఆస్తి, నలుగురు మనవలకూ సమానంగా పంచాలన్నది ఆయన అభిమతం. అందుకే నా ఈ పోరాటం అని విస్పష్టంగా చెబుతుంటే.. ఆ కుటుంబంతో ఏం సంబంధం లేని పేర్ని నాని ఆ అస్తులు జగన్ స్వార్జితం అని ఎలా తీర్పు ఇచ్చేస్తారనీ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పేర్ని నాని రాజును మించిన రాజభక్తిని ప్రదర్శిస్తుంటే.. వైసీపీ శ్రేణులే త్వరలో పేర్ని నాని మరో బోరుగడ్డ ప్రసాద్ లా మారడం ఖాయమని.. ఆయన భవిష్యత్ అలాగే కనిపిస్తోందనీ సెటైర్లు వేస్తున్నాయి. 

By
en-us Political News

  
కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఎల్‌డీఎఫ్ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే.. దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని భావించిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కీలక సమావేశం నిర్వహించారు.
కేవలం మర్యాదపూర్వక భేటీలుగా వీటిని చూడలేమని, దీని వెనుక తెలంగాణలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేసే భారీ వ్యూహం దాగి ఉందనీ ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ప్రధాని మోదీ చంద్రబాబు నాయుడు నివాసంలో గంటకు పైగా గడపడం.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పరామర్శించడం వెనుక లోతైన రాజకీయ అర్థాలు ఉన్నాయన్నారు.
తమిళనాడు ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా సుమారు రూ.48వేల‌ కోట్ల ఆదాయం వస్తోంది. ప్రస్తుతం మూసివేసినవి కేవలం 717 దుకాణాలు మాత్రమే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దుకాణాల్లో ఇది కేవ‌లం 15శాతం మాత్ర‌మే. ఇందువల్ల ఆదాయంలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, అది భారీ నష్టం కాకపోవచ్చు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.