అడ్డంగా దొరికిపోయిన పేర్ని నాని.. ఇక శ్రీకృష్ణజన్మస్థానమే!

Publish Date:Jan 2, 2025

Advertisement

రేష‌న్ బియ్యం మాయం కేసులో వైసీపీ నేత‌, మాజీ మంత్రి పేర్నినాని మెడ‌కు ఉచ్చు బిగుస్తోంది. భారీ మొత్తంలో బియ్యం మాయం వెనుక పేర్ని నాని హ‌స్తం ఉన్న‌ట్లు పోలీసులు నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. తెర‌వెనుక ఉండి ఆయ‌నే రేష‌న్ బియ్యాన్ని మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా కాకినాడ పోర్టుకు త‌ర‌లించిన‌ట్లు ఆధారాల‌తోస‌హా పోలీసులు గుర్తించారు. దీనికితోడు జ‌య‌సుధ‌ను విచారించిన స‌మ‌యంలోనూ, కేసులో ఉన్న మ‌రో నలుగురిని విచారించిన స‌మ‌యంలోనూ పేర్ని నాని పేరును ప్ర‌ముఖంగా వారు ప్ర‌స్తావించార‌ట‌. దీంతో పేర్ని నానిని అరెస్టుచేసి శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపేందుకు పోలీసులు ప‌క్కా ఆధారాల‌తో రంగం సిద్ధంచేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ6 ముద్దాయిగా ఉన్న పేర్ని నాని.. అరెస్టు చేయొద్దంటూ కోర్టు నుంచి ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే, వ‌చ్చే సోమ‌వారం బెయిల్ పిటిష‌న్‌పై మ‌రోసారి కోర్టులో విచార‌ణ జ‌ర‌గ‌నుంది. ఆ త‌రువాత పేర్ని నాని అరెస్టు ఖాయ‌మ‌ని వైసీపీ వ‌ర్గాల్లోనే పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలాఉంటే పేర్ని నాని గోదాములో బియ్యం మాయం కేసు గురించి విచారిస్తున్న క్ర‌మంలో పోలీసులు మ‌రికొన్ని వివ‌రాల‌ను సేక‌రించారు. ఇత‌ర జిల్లాల్లోనూ కొంద‌రు వైసీపీ నేత‌లు గోదాముల్లో రేష‌న్ బియ్యాన్ని అక్ర‌మంగా కాకినాడ పోర్టుకు త‌ర‌లించిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌డితే మ‌రికొంద‌రు వైసీపీ నేత‌లు సైతం జైలు ఊచలు లెక్కించ‌డం ఖాయ‌మ‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది.    

వైసీపీ హ‌యాంలో త‌న స‌తీమ‌ణి జ‌య‌సుధ పేరిట పేర్ని నాని గోదాముల‌ను నిర్మించారు. ఆ గోదాముల‌ను పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు అద్దెకు ఇచ్చారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత గోదాములో అధికారులు త‌నిఖీలు నిర్వహించగా.. పెద్ద ఎత్తున బియ్యం నిల్వ‌ల్లో తేడాలు ఉన్న‌ట్లు గుర్తించారు. భారీ మొత్తంలో బియ్యం మాయ‌మైన‌ట్లు నిర్దార‌ణ‌కు వ‌చ్చిన‌ పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో గోదాము యాజ‌మాని పేర్ని జ‌య‌సుధ‌, గోదాము మేనేజ‌ర్ మ‌న‌స తేజ్‌, పౌర‌స‌ర‌ఫ‌రాల అధికారి కోటిరెడ్డితో పాటు మ‌రో ఇద్ద‌రిపై పోలీసులు క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేశారు. మాన‌స‌త్ తేజ్‌, కోటిరెడ్డితోపాటు మ‌రో ఇద్ద‌రి మ‌ధ్య దాదాపు 25ల‌క్ష‌ల నుంచి 30 ల‌క్ష‌ల మేర లావాదేవీలు జ‌రిగిన‌ట్లు, పేర్ని నాని కుటుంబ స‌భ్యుల బ్యాంకు ఖాతాల‌కు కూడా మాన‌స్ తేజ్ బ్యాంకు ఖాతా నుంచి ల‌క్ష‌ల్లో లావాదేవీలు జ‌రిగిన‌ట్లు పోలీసులు గుర్తించారు. అయితే, తేడా వ‌చ్చిన రేష‌న్ బియ్యం మొత్తానికి డ‌బ్బులు చెల్లిస్తామ‌ని పేర్ని నాని కుటుంబం అధికారుల‌కు లేఖ రాసింది. రూ.3.37 కోట్ల‌కుపైగా విలువైన బియ్యం మాయ‌మైంద‌ని అధికారులు అంచ‌నాకు వ‌చ్చారు. తొలుత రూ.1.70కోట్లు చెల్లించాల‌ని సూచించ‌గా.. పేర్నినాని కుటుంబం ఆ మొత్తాన్ని చెల్లించింది. మూడు రోజుల కిందట మరో రూ.1.67 కోట్లు చెల్లించాల‌ని అధికారులు పేర్ని నాని కుటుంబానికి నోటీసులు ఇచ్చారు.

ఈ కేసులో ఏ1గా ఉన్న జ‌య‌సుధ కోర్టు ద్వారా ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే, పోలీసుల విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని కోర్టు ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. మ‌రోవైపు ఈ కేసులో ఏ2, ఏ3, ఏ4, ఏ5లుగా ఉన్న మాన‌స్ తేజ్‌, కోటిరెడ్డి, లారీ డ్రైవ‌ర్ మంగారావు, రైస్ మిల్ల‌ర్ ఆంజ‌నేయులును పోలీసులు అరెస్టు చేసి విచారించారు. అనంత‌రం సోమ‌వారం రాత్రి కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా.. కోర్టు వారికి 14రోజులు రిమాండ్ విధించింది. దీంతో వారిని  మ‌చిలీప‌ట్నం స‌బ్ జైలుకు త‌ర‌లించారు.   విచారణలో వీరు  గోదాములో బియ్యం మాయం వెనుక పేర్ని నాని ప్ర‌మేయం ఉంద‌ని  స్ప‌ష్టం చేశారు. దీంతో పోలీసులు పేర్ని నానిని ఈ కేసులో ఏ6గా చేర్చారు. ఎఫ్ఆర్ఐ న‌మోదు చేయ‌గా.. నాని అరెస్టు అవుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. దీంతో ఆయ‌న ముంద‌స్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్లారు. వ‌చ్చే సోమ‌వారం వ‌ర‌కు నానిని అరెస్టు చేయొద్ద‌ని కోర్టు పోలీసుల‌కు అదేశాలు జారీ చేసింది. అదే స‌మ‌యంలో సోమ‌వారం కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని పోలీసుల‌కు సూచించింది. 

అంతే కాకుండా బియ్యం మాయం కేసులో ఏ1గా ఉన్న పేర్ని జ‌య‌సుధకు పోలీసులు మ‌రోసారి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం పోలీస్ స్టేషన్ లో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని సూచించారు. దీంతో ఆమె బుధ‌వారం మ‌ధ్యాహ్నం  విచారణ నిమిత్తం ఆర్ పేట పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చారు. రెండు గంట‌ల‌కుపైగా పోలీసులు ఆమెను విచారించారు. ఇదిలా ఉంటే.. న్యాయవాదులతో కలిసి విచారణకు వచ్చే క్రమంలో పేర్ని జయసుధ మచిలీపట్నం మేయర్ కారులో పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చకు దారితీసింది.  మరోవైపు జయసుధ వెంట వచ్చిన న్యాయవాదులను స్టేషన్‌లోకి పోలీసులు అనుమతించలేదు. స్టేషన్ బయటే ఆపివేశారు. అయితే, స్టేష‌న్ బ‌య‌ట వైసీపీ శ్రేణులు పెద్ద హంగామానే చేశారు. మా మేడమ్ ను ఇంత‌సేపు విచారిస్తారా అంటూ పోలీసుల‌పై నోరుపారేసుకున్నారు. రెండు గంట‌ల‌కుపైగా జ‌యసుధ‌ను విచారించిన పోలీసులు కీల‌క విష‌యాల‌ను రాబ‌ట్టారు.

పేర్ని జ‌య‌సుధ‌ను విచారించిన త‌రువాత‌.. గోదాములో రేష‌న్‌ బియ్యం మాయం వ్య‌వ‌హారం వెనుక క‌థ న‌డిపింది పేర్ని నాని అని పోలీసులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. రేష‌న్ బియ్యాన్ని మ‌ధ్య‌వ‌ర్తుల ద్వారా కాకినాడ‌కు త‌ర‌లించార‌ని పోలీసులు గుర్తించారు. దీంతో తీగ‌ లాగితే డొంక క‌దిలిన‌ట్లు కాకినాడ పోర్టులో రేష‌న్ బియ్యం దందా సైతం క్ర‌మంగా వెలుగులోకి వ‌స్తుంది. దీంతో వైసీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు. మ‌రోవైపు ఈ కేసులో పేర్ని నానిని అరెస్టు చేయ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. వారం రోజుల్లో పేర్ని నానిని అరెస్టు చేసి జైలు పంపించ‌డం ఖాయ‌మ‌ని, పోలీసుల‌కు నాని అడ్డంగా దొరికిపోయారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. మొత్తానికి రేష‌న్‌ బియ్యం మాయం కేసులో పేర్ని నాని మెడ‌కు ఉచ్చు బ‌లంగా బిగుసుకుందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది.   

By
en-us Political News

  
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు. తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.