రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజాప్రతినిధుల పాత్ర ఏమిటి?

Publish Date:Jun 18, 2014

Advertisement

 

ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. కనుక పత్రికలలో ‘అస్త్రశ్రస్తాలు సిద్దం చేసుకొంటున్న ప్రతిపక్షాలు’, ‘ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాల వ్యూహరచన’, ‘ప్రతిపక్షాలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు అధికారపార్టీ సమాలోచనలు’ వంటి హెడ్డింగులతో వార్తలు కనబడుతుంటాయి. ఇటువంటి వార్తలు చూసి అసలు అసెంబ్లీ సమావేశాలు దేనికి నిర్వహిస్తారు? అనే ధర్మ సందేహం చాలా మందికి కలుగుతుంది.

 

చట్టసభలలో చట్టాలు చేస్తారని, ప్రజా సమస్యలపై లోతుగా చర్చించి, వాటికి పరిష్కారాలు కనుగొంటారని ప్రజలు అపోహ చెందుతుంటారు. కానీ వివిధ పార్టీలకి చెందిన ప్రజాప్రతినిధులు వారి అపోహలు దూరం చేస్తారు. లక్షలు ఖర్చు చేసి నిర్వహించే అసెంబ్లీ సమావేశాలలో ఒక పార్టీపై మరొకటి పైచేయి సాధించడమే ప్రధానమని, అందుకోసం ఒకరినొకరు దూషించుకోవడం, నినాదాలు చేయడం, అలిసిపోతే వాకవుట్ చేయడం వంటివి తప్పనిసరి అని చాటిచెపుతారు. అధికార పార్టీ చేసిన నిర్ణయాలను విమర్శించడం, మీడియా ముందు ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడమే నిర్మాణాత్మకమయిన ప్రతిపక్ష పాత్ర పోషించడం అని ప్రతిపక్షాలు భావిస్తే, వారి విమర్శలను త్రిప్పికొడుతూ, వారిని సభ నుండి సస్పెండ్ చేసో లేక వారు వాకవుట్ చేసినపుడో కీలకమయిన నిర్ణయాలు, బిల్లులపై ఎటువంటి చర్చ లేకుండా సభ చేత ‘మమ’ అనిపించేయడమే మంచి పద్ధతి అని అధికారపార్టీ భావిస్తుంది. ఈరోజు నుండి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలలో ఈ అద్భుత సన్నివేశాలన్నీ మరొకమారు ప్రజలందరూ తమ కళ్ళారా తిలకించే అవకాశం దక్కబోతోంది.

 

వ్యవసాయ ఋణాలపై అధికార పార్టీని ఇరుకున పెట్టాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, శనివారం గవర్నర్ ప్రసంగం ముగిసిన తరువాత నుండి తాము ఆ పని మీదనే ఉంటామని ఇప్పటికే స్పష్టం చేసారు. తెదేపా చేసిన ఎన్నికల హామీలన్నిటినీ అమలు చేసేవరకు తమ పోరాటం సాగిస్తామని యుద్ద ప్రకటన చేసేసారు.కానీ ఇప్పుడు ప్రజలు కోరుకొంతున్నది యుద్ధం కాదు. సహకారం, తద్వారా సత్వర అభివృద్ధి అని గ్రహిస్తే మేలు.

 

రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు రాష్ట్రాన్ని గాలికొదిలేసి చట్టసభలలో బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే ప్రజలు క్షమించరనే సంగతి వారు గుర్తుంచుకొని మెలగాలి.

 

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల పార్లమెంటులో ప్రసంగిస్తూ, “గతం తాలూకు మన చేదు, తీపి జ్ఞాపకాలను ఇక వదిలి పెడదాము. మనందరం వివిధ పార్టీల ప్రతినిధులుగా కాక కేవలం ప్రజాప్రతినిధులుగా మాత్రమే ఇక్కడ కూర్చోన్నమనే విషయం సదా గుర్తుంచుకొని, మన పార్టీలను, భేషజాలను అన్నిటినీ పక్కన బెట్టి దేశాభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. అప్పుడే దేశం త్వరగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలూ హర్షిస్తారు,” అని అన్నారు. ఇది అక్షరాల మన అసెంబ్లీలో ప్రజాప్రతినిధులకి కూడా వర్తిస్తుంది.

 

ప్రస్తుతం మన రాష్ట్రం అత్యంత దయనీయ స్థితిలో చిక్కుకొని విలవిలలాడుతోంది. కనుక అధికార, ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు అందరూ ఈ సమస్యల పరిష్కారానికి కృషిచేయాలి. ఆర్ధిక లోటును ఏవిధంగా అధిగమించవచ్చు? పరిశ్రమలు, సాఫ్ట్ వేర్, విద్యా, వైద్య సంస్థలు వంటివాటిని ఏ ఏ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలి? వాటిని రాష్ట్రానికి రప్పించడంలో తాము ఏవిధంగా కృషి చేయగలము? అని సానుకూల దృక్పధంతో ఆలోచనలు చేయాలి. రాష్ట్ర పునర్నిర్మాణం, కొత్త రాజధాని ఏర్పాటుపై శాసనసభలో అర్ధవంతమయిన చర్చలు చేసి, తద్వారా ప్రజాప్రతినిధులు అందరూ తమతమ నియోజక వర్గాల అభివృద్ధికి గట్టిగా కృషిచేసినట్లయితే ప్రజలు హర్షిస్తారు.

 

ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర పునర్నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి, కొత్త రాజధాని కోసం తపిస్తున్నారు. తమవంతు పాత్ర పోషించేదుకు సిద్దంగా ఉన్నారు. అటువంటప్పుడు ప్రజా ప్రతినిధులు కూడా అంతే బాధ్యతగా, నిబద్దతగా కృషిచేయాలి. ఎంతసేపు ప్రజలను త్యాగాలను చేయమని కోరే ప్రజాప్రతినిధులు తాము ఎటువంటి గొప్ప త్యాగాలు చేయకపోయినా కనీసం బాధ్యతగా వ్యవహరిస్తే చాలని ప్రజలు కోరుకొంటున్నారు. కానీ అలాకాక ప్రజాధనంతో సకల రాజభోగాలు అనుభవిస్తూ షరా మామూలుగా నికృష్ట రాజకీయాలకే పరిమితమయినట్లయితే, చైతన్యవంతులయిన ఆంద్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పినట్లే వారికి కూడా తప్పకుండా బుద్ధి చెపుతారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.