గడప గడపకూ వైసీపీ సర్కార్ కు ఎదురుగాలి.. మంత్రులు ఎమ్మెల్యేలకు నిరసనల సెగ

Publish Date:May 12, 2022

Advertisement

గడప గడపకూ వైసీపీ అంటూ ప్రజల వద్దకు వెళ్లడానికి ఆ పార్టీ నేతలు భయపడ్డారు. అందుకే రాత్రికి రాత్రి గడప గడపకూ వైసీపీ పేరును గడప గడపకూ ప్రభుత్వం అంటూ మార్చేశారు. ప్రభుత్వం ప్రజల వద్దకు వస్తున్నదంటే నిరసనలు తెలియజేయడానికి జనం భయపడతారనీ, కేసులు ఉంటాయని జంకుతారనీ వైసీపీలోని మేధావి వర్గం వ్యూహం పన్నింది. దానిని అమలు చేసింది. గడప గడపకూ ప్రభుత్వం పేరుతో జనం వద్దకు వెళ్లే కార్యక్రమంలో పార్టీ నేతలే కాకుండా, అధికారులను కూడా భాగం చేసింది. ఇలా అయితే జనం ఎక్కడైనా తిరగబడినా. నిలదీసినా కేసుల ఉంటాయని జనం బయపడతారని జగన్ అంచనా వేశారు. అయితే ఈ వ్యూహం బెడిసి కొట్టింది. వైసీపీ ప్రభుత్వమైనా, పార్టీ అయినా మా కొకటే.. నిరసన నిరసనే అంటూ జనం ఎక్కడికక్కడ తిరగబడ్డారు.  జనంతో పాటు కొన్ని చోట్ల వైసీపీ క్యాడర్ కూడా నిరసనలు తెలియజేసింది. చేసిన పనులకు మూడేళ్లుగా బిల్లులు రాలేదన్న  ఆగ్రహం వారిది.  కేవలం సంక్షేమ పథకాలు అందుకున్న వారిని తాము కరోనా సమయంలో కూడా అప్పులు చేసి మరీ సాయం చేశామని చెప్పి వారిని ఓటు బ్యాంక్‌గా ఉంచుకోవడమే లక్ష్యంగా జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పేరేదైనా జగన్ పార్టీ చేపట్టినది గడప గడపకూ వైసీపీ కార్యక్రమమే. పేరు మార్చి గడప గడపకూ ప్రభుత్వం అన్నంత మాత్రాన కార్యక్రమం రూపు రేఖలు మారిపోవు. నిజానికి గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం అయితే అందులో వైసీపీ నాయకుల ప్రమేయం ఉండకూడదు. కానీ ఇక్కడ మాత్రం వైసీపీ నేతల వెనుక అధికారులూ ఉంటున్నారు.   అయినా ప్రజలు ఎక్కడికక్కడ తన నరసన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల పాటు ముఖం చాటేసి ఇప్పుడెందుకు వస్తున్నారంటూ వైసీపీ నేతలను నిలదీస్తున్నారు.  వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు మంత్రులూ కూడా ప్రజా వ్యతిరేకతను ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా చవి చూస్తున్నారు.  కేవలం నిలదీసి ఊరుకోవడం లేదు. తమ సమస్యలు వినకుండా ఎందుకు వెళ్లిపోతున్నారంటూ అడ్డుకుంటున్నారు. తిట్ల పురాణం విప్పుతున్నారు. అనంత పురం నుంచి శ్రీకాకుళం వరకూ జగన్ సర్కార్ చేపట్టిన గడప గడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో నిరసనలు భగ్గు మంటున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వైసీపీ నేతలకు ఒకేరకమైన చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.   జిల్లా హిందూపురంలోని కోట్నూరులో ప్రజాసమస్యలు పట్టించుకోకుండా వెళ్లిపోయిన ఎంపీ, ఎమ్మెల్సీపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.  సమస్యలు పరిష్కరించకుండా గడపగడపకూ అంటూ రావడం ఎందుకు అంటూ నడిరోడ్డుపై నిలదీశారు.   ఓవైపు మహిళలు సమస్యలపై ప్రశ్నిస్తుంటే.. ఎంపీ, ఎమ్మెల్సీ ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లారు.  ఒక్క హిందూపురంలోనే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోటా దాదాపు ఇదే పరిస్థితి కనిపించింది. ఆర్థిక మంత్రి బుగ్గన కూడా ప్రజా నిరసన చవి చూశారు. అలాగే చిత్తూరు జిల్లాలో మంత్రి రోజానూ జనం నిలదీశారు.న ఎరక్కపోయి గడప గడపకూ కార్యక్రమం చేపట్టామని వైసీపీ నేతలు లోలోన మధన పడుతున్న పరిస్థితి కనబడుతోంది.ఈ కార్యక్రమం ద్వారా ప్రజలలో వైసీపీ పట్ల, జగన్ సర్కార్ పట్ల ఎంత వ్యతిరేకత గూడు కట్టుకుందో తేటతెల్లమైందని పరిశీలకులు చెబుతున్నారు. గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు గడపగడపకూ నిరసన ఎదురైందని తెలుగుదేశం నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

By
en-us Political News

  
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.