జనం డిసైడైపోయారు.. తేడా తెలిసిపోయింది!

Publish Date:May 9, 2024

Advertisement

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లయ్యింది. ఈ పదేళ్లలో విభజిత ఆంధ్రప్రదేశ్  ప్రజలు రెండు ప్రభుత్వాలను చూశారు. విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 

ఆ తరువాత 2019లో జరిగిన ఎన్నికలలో జగన్ నేతృత్వంలోని వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఈ ఐదేళ్లూ రాష్ట్రంలో పాలన సాగించింది. ఇక ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో మూడో సారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలో తేల్చనున్నారు. ఎన్నికలు మరో నాలుగు రోజుల్లో అంటే మే 13న జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి తమ తమ అభ్యర్థుల విజయం కోసం విస్తృత ప్రచారం చేస్తున్నారు. 

వైసీపీ,  తెలుగుదేశం కూటమిలలో  ఈసారి విజయం ఎవరిదన్న విషయాన్ని ఇప్పటికే ప్రజల అభిప్రాయాల ఆధారంగా ఎన్నో సర్వేలు తేల్చి చెప్పేశాయి.  వైసీపీ సర్కార్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని పరిశీలకులు సైతం సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు. ఇక ఇప్పుడు వైసీపీపై   ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత ఎందుకు ఏర్పడింది? ఐదేళ్ల పాలనలో జగన్ పట్ల అంతటి విముఖత ఎందుకు కలిగింది? అన్న ప్రశ్నకు సమాధానంగా ఐదేళ్ల చంద్రబాబు పాలన, ఐదేళ్ల జగన్ పాలనను పోల్చి చూస్తే చాలు.  

ఇంకొంచం వివరంగా చెప్పాలంటే.. రాష్ట్ర విభజన అనంతరం గత పదేళ్లలో రెండు ప్రధాన పార్టీలకు చెరొక అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం, వైసీపీ ప్రభుత్వాల పాలన ప్రజలు చూశారు. సీఎంగా చంద్రబాబు, జగన్ ల పనితీరును కళ్లారా చూశారు. దీంతో ఈసారి అధికారం ఎవరికి ఇవ్వాలి..  మరోసారి సీఎంగా ఎవరిని చూడాలనేది ప్రజలు నిర్ణయించుకునే సమయం వచ్చేసింది. సర్వేలు చూసినా, విశ్లేషకుల అభిప్రాయాలను గమనించినా.. ప్రజలు ఇప్పటికే స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశారని అర్ధమౌతుంది. ఐదేళ్లు చంద్రబాబు, ఐదేళ్లు జగన్ పాలన చూసిన జనం  ఇప్పుడు ఇద్దరిలో ఎవరు కావాలో  మే 13న తమ ఓటు ద్వారా చెప్పేస్తారు.  

అభివృద్ధి, ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమం,  ప్రభుత్వ నిర్ణయాలు, రాజ్యాంగం అమలు, చట్టాలు, సమానత్వం, సమాజంలో నేరాలు, మహిళల భద్రత, వ్యవసాయం, ప్రజల కోసం పాలసీలు, నిధులు.. వాటి వ్యయం,  సమాజంలో అసమానతలు, విద్యా, వైద్యం, ఇతర రాష్ట్రాలతో సంబంధాలు, కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం, అప్పులు, నిధులను ఖర్చు చేయడంలో ప్రాధాన్యత ఇలా ఎన్నో అంశాలలో రెండు ప్రభుత్వాల మధ్య పనితీరును బేరీజు వేసుకొని మరీ జనం తమ తీర్పు చెప్పడానికి రెడీ అయిపోయారు.

అయితే, చంద్రబాబు, జగన్ పాలనలను పోల్చి లెక్కలేస్తే చంద్రబాబు గెలుపు నల్లేరు మీద నడకే అనిపిస్తుంది. రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులు పెట్టిస్తే.. జగన్ ఆ విషయంలో ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు హయంలో రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేస్తె జగన్ అసలు ఆ అంశాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. నిధులు, అప్పుల విషయంలో జగన్ ఆర్ధిక  అరాచకత్వాన్ని ప్రదర్శించి.. పన్నుల రూపంలో ప్రజలపై పన్నుల భారాన్ని మోపారు. చంద్రబాబు ఇతర దేశాలలో ఉన్న వారిని కూడా రాష్ట్రానికి రప్పించి ఉపాధి పెంచేందుకు కృషి చేస్తే.. జగన్ హయంలో ఏపీలో ఉపాధి కరువై వలసలు పెరిగిపోయాయి. నేరాలు-ఘోరాలలో జగన్ సర్కార్ దేశంలోనే ముందు వరుసకు చేరింది.  ఏకంగా దళితుడిని చంపేసి ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని వెంటపెట్టుకొని తిరగడంతో  జగన్ నేరాలకు కొమ్ముకాస్తున్నారన్న భావన ప్రజలలో ఏర్పడింది. 

విద్యా, వైద్యంలో హంగు, ఆర్భాటాలు తప్ప జగన్ సాధించేదేమీ లేదు. ఇలా ఎలా చూసినా చంద్రబాబు పాలన వెయ్యి రెట్లు మేలు అనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనం కూడా చంద్రబాబు, జగన్ పాలనల మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా గమనించారు. అందుకే  చంద్రబాబు పాలనకే మొగ్గు చూపుతున్నారు.  అందుకు ఇప్పటికే వెలువడినడజనుకు పైగా సర్వేలు చంద్రబాబే సీఎం అని తేల్చేశాయి. వైసీపీ ఓటమి ఖాయమని స్పష్టం చేశాయి. అలాగే  ఎన్నికల ప్రచారం సందర్భంగా కనిపిస్తున్న ప్రజాదరణ, ప్రజా స్పందనలను చూసినా ఆ విషయం అర్ధమైపోతుంది.  

తెలుగుదేశం కూటమి సభలకు జనం పోటెత్తుతుంటే.. వైసీపీ సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. చివరాఖరికి పార్టీ అధినేత, సీఎం జగన్ ప్రచారానికి కూడా జనం ముఖం చాటేస్తున్నాయి. డబ్బులు ఇచ్చి, మందు పోసి సమీకరించిన వారు కూడా ఇలా కనిపించి అలా మాయమైపోతున్నారు. దీంతో ఐదేళ్ల జగన్ పాలనను అంతుకు ముందు ఐదేళ్ల చంద్రబాబు పాలనతో పోల్చి చూసుకుని రాష్ట్ర ప్రగతి, పురోగతి, నిజమైన ప్రజా సంక్షేమం కావాలంటే చంద్రబాబు మఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టా ల్సిందేనన్నదే జనాభిప్రాయమనీ, అదే సర్వేలలో ప్రతిఫలిస్తోందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత కొన్ని ప్రాంతాలలో హింస చెలరేగింది. దీంతో ఆయా ప్రాంతాలలో పరిస్థితిని అదుపు చేయడానికి నిరవధికంగా 144వ సెక్షన్ విధించారు.
ఆంధ్రప్రదేశ్ లో ప్రజల తీర్పు ఎలా ఉందో చెప్పడానికి ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఫలితం చూస్తే సరిపోతుందని అంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఇదే ఓరవడి కొనసాగుతూ వస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రెండు ఎన్నికలలోనూ కూడా తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆదరణ పొందిన పార్టీయే అధికారంలోకి వచ్చింది. ఈ
 తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 80 పరీక్ష కేంద్రాల్లో టెట్ నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలు సోమవారం  నుంచి జూన్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన కవిత.. సుమారు 46 రోజులుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. కోర్టు అనుమతితో పలు పుస్తకాలను చదువుతూ... ధ్యానం, ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు.
పవర్ స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేదీ సినిమాలో చివరి పంచ్ మనదైతే ఆ క్కిక్కే వేరప్పా అని ఓ డైలాగ్ ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ అలాంటి కిక్ నే ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు.
 ఎపిలో సర్వేలన్నీ త్రికూటమి వైపే ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ అధికారంలో రాబోతుందని జోస్యం చెబుతున్నాయి. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇదే విషయం చెబుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేతలు కూడా చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అంటున్నారు. ఏపీలో కూటమి విజయం సాధించబోతోందని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ జోస్యం చెప్పారు.
రాష్ట్రంలో హాట్ నియోజకవర్గాలలో ఒకటైన పిఠాపురంలో అత్యధికంగా 86.86శాతం పోలంగ్ నమోదైన సంగతి విదితమే. ఇక్కడ నుంచి జనసేనాని పవన్ కల్యణ్ పోటీ చేయగా ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే వంగా గీత బరిలోకి దిగారు.
దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహిస్తుండగా, ఇప్పటివరకు నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. ఇటీవలే మే 13న నాలుగో దశ పోలింగ్ జరిగింది. ఇక, ఇవాళ దేశంలో ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది.  ఐదో విడతలో భాగంగా 6  రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్ లో 7, బీహార్ లో 5, ఒడిశాలో 5, ఝార్ఖండ్ లో 3, జమ్మూకశ్మీర్ లో 1, లడఖ్ లో 1 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు
ఆదివారం నాడు హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలైనట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం గెలుపు ఓటములపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సారి గెలుపు విషయంలో తెలుగుదేశం కూటమివైపే బెట్టింగు రాయుళ్లు మొగ్గు చూపుతున్న పరిస్థితి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (మే 20) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిడిపోయి క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది.
ఎన్నో అంచనాలతో విడుదలైన వైసీపీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నిర్మాత, దర్శకుడు, హీరో అయిన జగన్ ఈ సినిమాని హింసాత్మకంగా, దారుణంగా రూపొందించడంతో ఆంధ్రా ప్రజలు రిజెక్ట్ చేశారు. ఫస్ట్ రిలీజ్‌లోనే ఈ సినిమాని జనం భరించలేకపోయారు.. ఇక సెకండ్ రిలీజ్ కూడానా?!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.