లెఫ్టినెంట్ గవర్నర్ ను కించపరిచే పోస్టులు తొలగించండి.. ఆప్ నేతలకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

Publish Date:Sep 28, 2022

Advertisement

ఆప్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాల మధ్య విభేదాలు కోర్టు మెట్లెక్కాయి. ఆప్ నేతలపై సక్సేనా పరువు నష్టం దావా వేశారు. ఆ దావాలో కోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు సక్సేనాకు ఊరటనిచ్చాయి. అయితే ఆప్ నేతలు మాత్రం కోర్టు మధ్యంతర ఉత్తర్వుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న వారి అవినీతిని ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిథులుగా తమపై ఉందని పేర్కొన్నారు. ఏది ఏమైనా కోర్టు తీర్పును గౌరవిస్తామన్నారు. 

తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), ఆ పార్టీ నేతలపై వేసిన పరువు నష్టం దావాలో ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ కు ఊరట కలిగేలా ఇచ్చిన ఆ మధ్యంతర ఉత్తర్వులలో లెఫ్టినెంట్ గవర్నర్ ను కించపరిచే పోస్టులు, వీడియోలు, ట్వీట్లను సామాజిక మాధ్యమం నుంచి తొలగించాలని, అలాగే ఆయనపై ఆరోపణల విషయంలో సంయమనం పాటించాలనీ ఆప్ నేతలను  ఆదేశించింది.

తనను కించపరిచే విధంగా తప్పుడు ఆరోపణలు, సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారంటూ లెఫ్టినెంట్ గవర్నర్ ఆప్ నేతలు అతిషి, సౌరభ్ భరద్వాజ్, దుర్గేష్ పాథక్, జాస్మిన్షా లపై పరువునష్టం దావా వేశారు. తనకు కించపరిచేలా ఉన్న, తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్న పోస్టులు, వీడియోలు తొలగించాలని వారిని ఆదేశించాలని సక్సేనా ఆ పిటిషన్ లో కోరారు. అలాగే తన పరువుకు నష్టం కలిగించినందుకు ఆప్ నేతలు ఐదుగురూ తనకు రెండు కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కూడా సక్సేనా ఆ డిఫమేషన్ దావాలో కోరారు.  

అయితే ఆ తీర్పు పట్ల ఆప్ నేతలు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కోర్టు తీర్పును గౌరవిస్తామంటూనే న్యాయస్థానం ఇచ్చినది మధ్యంతర ఉత్తర్వులేనని పేర్కొన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన సంస్థలు, వ్యవస్థలు, వ్యక్తులు తీసుకునే నిర్ణయాలపై సమగ్ర అధ్యయనం చేసి వాస్తవాలను ప్రజలకు విరించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిథులదేనని, ఆ బాధ్యతను తాము ఎన్నడూ విస్మరించజాలమనీ పేర్కొన్నారు.

తాము లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాపై చేసిన ఆరోపణలు ఆ కోవలోనివేనని కోర్టుకు తెలిపినట్లు ఆప్ నేతలు చెప్పారు. తాము చేసిన ఆరోపణలపై  స్వతంత్ర దర్యాప్తు డిమాండ్ చేయాలని, అందుకు భిన్నంగా ఆయన ఏ తప్పూ చేయనప్పుడు దర్యాప్తు నుంచి ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించారు. కాగా ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువడిన తరువాత లెఫ్టినెంట్ గవర్నర్ ‘సత్యమేవ జయతే’ అంటూ ట్వీట్ చేశారు. 

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.