Publish Date:Feb 10, 2025
వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబీకులందరూ అటవీ భూముల ఆక్రమణలో నిండా మునిగినట్లే. చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు అందరూ దశాబ్దాలుగా అటవీ భూములను ఆక్రమించి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారని విజిలెన్స్ నివేదిక తేటతెల్లం చేసింది. అటవీ భూముల ఆక్రమణ, పర్యావరణ విధ్వంసానికి పాల్పడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబీకులపై అటవీ సంరక్షణ చట్టాల మేరకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని సిఫారసు చేసింది. ఆ నివేదికలో పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకుల మీద ఏయే సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది అన్న అంశంపై విజిలెన్స్ నివేదిక వివరంగా పేర్కొంది. పెద్దిరెడ్డి, యఆయన కుటుంబ సభ్యులపై విజిలెన్స్ నివేదిక సిఫారసుల ఆధారంగా చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమౌతోంది.
పుంగనూరు నియోజకవర్గంలోని మంగళం పడవల్లో పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జా వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. అటవీ భూమిని ఆక్రమించి విలాసవంతమైన భవనం నిర్మించిన విషయం తేటతెల్లమైంది. అయితే అడవి మధ్యలో తాను భవనం నిర్మించిన భూమిని తాను ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశానని, అక్కడ నిర్మించిన భవనం పనివాళ్ల కోసమని పెద్దరెడ్డి చెప్పారు. దీనిపై విచారణ జరిపిన అధికారులు ప్రజాధనంతో రోడ్డు వేసుకోవడం దగ్గర నుంచి మొత్తం ఎంత భూమి వారి అధీనంలో ఉంది.. ఎంత భూమి కబ్జా చేశారో లెక్కలు తేల్చారు. మొత్తం వివరాలతో నివేదిక సమర్పించారు.
పెద్దిరెడ్డి .. ఆయన కుటుంబం చేసిన అరాచకాలు ఇప్పుడు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగన్ అడ్డగోలు విధానాలను అంతకంటే అడ్డగోలుగా అంగీకరించి ఆచరించి, ఆయన చెప్పినట్టలా చేసిన పెద్దరెడ్డి అందుకు ప్రతిఫలంగా దోపిడీకి లైసెన్స్ తీసున్నారా అన్నట్లుగా అన్ని రకాల నిబంధనలనూ తుంగలోకి తొక్కి యథేచ్ఛగా కబ్జాల పర్వం కొనసాగించారు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం దోపిడీకి కాదే భూమి అనర్హం అన్నట్టుగా పెద్దిరెడ్డి ఆయన కుటుంబీకులూ రెచ్చిపోయారు. పెద్దిరెడ్డి కబ్జాల పర్వంలో మునిగి తేలుతూ ఉంటే.. ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిమద్యం స్కాం మొత్తాన్ని తన కనుసన్నలలో నిర్వహించారు. ఇలా కబ్జాలతోనూ, కుంభకోణాలతోనూ అడ్డగోలుగా సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని చిత్తూరుల తెలుగుదేశం పార్టీని ఉనికి కూడా లేకుండా చేయాలన్న కుట్రలను అమలు చేశారు. ఇందులో భాగంగానే చంద్రబాబుపై రాళ్ల దాడులు, హత్యాయత్నాల వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తం మీద పెద్దరెడ్డి అటవీ భూముల ఆక్రమణ కేసుల్లోనూ, ఆయన కుమారుడు మిధున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో బయట పడే అవకాశలు పెద్దగా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/peddireddy-forest-lands-encrochment-true-39-192654.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.