అమెరికా, ఇరాన్ చర్చలు.. అమెరికా ఉపాధ్యక్షుడికి అవమానం?

Publish Date:Jun 22, 2026

Advertisement

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న సుదీర్ఘ అశాంతికి స్వస్తి పలికి, శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఆదివారం (జూన్ 21) స్విట్జర్లాండ్‌  చర్చా వేదికగా మారింది. అమెరికా, ఇరాన్ దేశాల ఉన్నత స్థాయి దౌత్య ప్రతినిధులు ఒకే టేబుల్ పైకి వచ్చి చర్చలు జరపడం అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి కూడా వ్యక్తమైంది.  అయితే, ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఈ శాంతి చర్చల వేదిక ఒక్కసారిగా  రచ్చరచ్చగా మారిపోయింది. అనూహ్య  దౌత్య  వివాదాలకు, తీవ్ర ఉద్రిక్తతలకు నెలవుగా మారింది. చర్చలు ప్రారంభం కావడానికి ముందే  అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

 ఒక కీలకమైన ప్రోటోకాల్ ఉల్లంఘన కారణంగా అమెరికా ఉపాధ్యక్షుడికి తీవ్ర అవమానం జరిగింది. దౌత్యపరమైన నిబంధనల ప్రకారం లభించాల్సిన గౌరవం,  భద్రత విషయంలో లోపాలు తలెత్తాయి. దీనిపై అమెరికా ప్రతినిధి బృందం తీవ్ర అసంతృప్తి  వ్యక్తం చేసింది. ఈ  కారణంగా చర్చల ప్రాంగణంలో కొద్ది సేపు తీవ్ర గందరగోళం నెలకొంది.  ఇరాన్ ప్రతినిధులు కూడా తమ పాత వైఖరిని ప్రదర్శిస్తూ అమెరికా విధించిన ఆంక్షలపై కఠినమైన వ్యాఖ్యలు చేయడంతో వాతావరణం వేడెక్కింది.

ఈ శాంతి చర్చలపై ప్రపంచవ్యాప్తంగా   ఎన్నో ఆశలు ఉన్నాయి.  పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గితే అంతర్జాతీయంగా ఇంధన ధరలు, సరఫరా వ్యవస్థలు   మెరుగుపడతాయన్న అంచనాలు ఉన్నాయి. అయితే చర్చల ఆరంభంలోనే  అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పరస్పర విశ్వాసం, నమ్మకం లేవు అన్న విషయం తేటతెల్లం కావడం అందరినీ నిరాశకు గురి చేసింది.  

అది పక్కన పెడితే..  అమెరికా ఉపాధ్యక్షుడికి జరిగిన ఈ ప్రోటోకాల్ అవమానంపై వైట్ హౌస్ ఇప్పటికే అంతర్గతంగా సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు ఇరాన్ కూడా ఈ చర్చల్లో తమ ప్రయోజనాలకు భంగం వాటిల్లితే చర్చల నుండి పూర్తిగా తప్పుకుంటామని హెచ్చరించింది. అయితే మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్, ఖతార్ ల పుణ్యమా అని ఈ వివాదం టీకప్పులో తుపానుగా మారి.. చర్చలు సానుకూలంగా సాగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

By
en-us Political News

  
మిడిల్ ఈస్ట్ యుద్ధ ఉద్రిక్తతలు మరియు వంద డాలర్లు దాటిన క్రూడాయిల్ ధరల మధ్య భారత స్టాక్ మార్కెట్లు అద్భుత రికవరీ సాధించాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24100 మార్కును దాటింది. మార్కెట్ తదుపరి గమనంపై విశ్లేషకుల అంచనాలు మీకోసం.
స్విట్జర్లాండ్‌లోని ETH జ్యూరిచ్ శాస్త్రవేత్తలు గిటార్ సూత్రాంతర్భాగంగా పనిచేసే సరికొత్త వేలి గోరు పరిమాణపు క్వాంటం చిప్‌ను ఆవిష్కరించారు. ఈ చిప్ విద్యుదయస్కాంత తరంగాల కంటే 1,00,000 రెట్లు చిన్న శబ్ద ప్రకంపనలను ఉపయోగించి డేటాను భద్రపరుస్తుంది, ఇది క్వాంటం ర్యామ్ (QRAM) పరిశోధనలో ఒక పెద్ద మైలురాయి.
స్కల్‌కాండీ సరికొత్త ప్రీమియం హెడ్‌ఫోన్స్ Crusher 1080 ANC విడుదల చేసింది. బోస్ సంస్థకు చెందిన బెస్ట్ ఇన్ క్లాస్ నాయిస్ క్యాన్సిలేషన్, స్పేషియల్ ఆడియో ఫీచర్లతో, 60 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో సగం ధరకే అందుబాటులోకి వచ్చిన ఈ గ్యాడ్జెట్ పూర్తి వివరాలు చూడండి.
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గోల్ఫ్ టోర్నమెంట్ ది ఓపెన్ 2026 రాయల్ బర్క్‌డేల్‌లో ప్రారంభమైంది. స్కాటీ షెఫ్లర్, రోరీ మెక్‌ఇల్రాయ్ తలపడుతున్న ఈ మెగా ఈవెంట్‌ను మొబైల్ మరియు టీవీల్లో ఉచితంగా ఎలా చూడాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అమెరికా ఐటీ దిగ్గజం ఐబీఎం (IBM) 25% ఘోర పతనాన్ని చవిచూసినప్పటికీ, మెరుగైన క్యూ1 ఫలితాల అండతో భారతీయ ఐటీ షేర్లు మార్కెట్లో నిలదొక్కుకున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బంగారం మరియు గ్లోబల్ స్టాక్స్ వైపు మళ్లుతున్న భారతీయ పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన 5 ప్రధాన రిస్కులు ఇవే. అమెరికా బాండ్ ఈల్డ్స్, క్రూడ్ ఆయిల్ ధరలు మరియు భౌగోళిక ఉద్రిక్తతల వల్ల మీ పోర్ట్‌ఫోలియోపై పడే ప్రభావం గురించి పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా ఘనవిజయం సాధించిన తర్వాత ఆటగాళ్లు ప్రదర్శించిన లాస్ మాల్బినాస్ సన్ అర్జెంటీనాస్ బ్యానర్ ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమైంది. 1982 ఫాక్‌లాండ్ యుద్ధ గాయాలను రేపిన ఈ నినాదం వెనుక ఉన్న అసలు కథ, ఫిఫా నిబంధనలు మరియు అర్జెంటీనా జట్టు ఎదుర్కోబోయే చర్యల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఈ 14 దేశాల ఉమ్మడి కూటమికి యూరోపియన్ యూనియన్ పూర్తి మద్దతును ప్రకటించింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని, ఎలాంటి బలవంతపు లేదా సైనిక చర్యలకు పాల్పడకూడదని ఈ ప్రకటనలో ఆ దేశాలు విస్పష్టంగా పేర్కొన్నాయి.
ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లలో భారీ మార్పులను ప్రకటించింది. 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో సూపర్‌ 7 దశ, 2028 టీ20 వరల్డ్‌ కప్‌లో సూపర్‌ 10 దశతో సరికొత్త ఫార్మాట్‌లను తీసుకువచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
19 ఏళ్ల క్రితం లియోనెల్ మెస్సీ చేతుల్లో పెరిగిన లామిన్ యమాల్, ఇప్పుడు 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో మెస్సీ అర్జెంటీనా జట్టుకే సవాల్ విసురుతున్నాడు. ఈ అద్భుతమైన ఫుట్‌బాల్ కథనం మీకోసం.
భారత్ vs ఇంగ్లాండ్ రెండో వన్డే మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. తొలి వన్డేలో అక్షర్ పటేల్, గిల్ రాణించడంతో గెలిచిన టీమిండియా, నేడు కార్డిఫ్‌లో సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ పిచ్ రిపోర్ట్, వాతావరణ అంచనాలు మరియు భారత తుది జట్టు Probable Playing XI వివరాలు ఇక్కడ చూడండి.
ఈ వరద బీభత్సానికి 39 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది గల్లంతయ్యారు. నానింగ్‌లో ఒక ప్రధాన రిజర్వాయర్ కట్ట ఒక్కసారిగా తెగిపోవడంతో వరద ఉధృతి అనూహ్యంగా పెరిగిపోయింది. రిజర్వాయర్ నీరు ఊళ్ళపైకి దూసుకురావడంతో ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా పెరిగింది.
ఏడాదికి ఒకే ఒక్కసారి జరిగే ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు, స్వామివారి రథాల తాడును తాకి పునీతులు అవ్వడానికి దేశ విదేశాల నుంచి భక్తులు పూరీ క్షేత్రానికి లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో పూరీ వీధులన్నీ భక్తజన సంద్రంగా మారిపోయాయి. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి కొలువై ఉన్న ఆ భారీ రథాలను లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.