Publish Date:Nov 10, 2024
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలి సారి. ఇక శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలను పది రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్ల వైసీపీ ఇప్పటికే ప్రకటించింది.
బడ్జెట్ ప్రవేశానికి ముందు ఆర్థిక శాఖ అధికారులు మంత్రి పయ్యావుల కేశవ్ కు బడ్జెట్ పత్రాలు అందజేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ వాటికి పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. బడ్జెట్ గురించి ఆయనకు వివరించారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం నాలుగు నెలల పాటు ఓటాన్ అక్కౌంట్ మీదే పాలన సాగించింది. వైసీపీ హయాంలో అస్తవ్యస్తంగా, అధ్వానంగా మారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఈ సమయం తీసుకున్నది. రాష్ట్రం ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల కేశవ్.. బడ్జెట్ రూపకల్పనలో అభివృద్ధి , సంక్షేమానికి సమ ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీలకు నిధులు కేటాయించారు. అలాగే ఇరిగేషన్, రోడ్లు, పెన్షన్ లు, దీపం పథకం, అన్న క్యాంటిన్ పథకాలకు నిధులను కేటాయించినట్లు తెలుస్తోంది. అదే విధంగా పోలవరం నిర్మాణం, అమరావతి పనులకు నిధుల లేమి లేకుండా నిధులు కేటాయించడంపై పయ్యావుల కేశవ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు చెబుతున్నారు. అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మైలిక సదుపాయాల కల్పనపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారని సమాచారం. అలాగే పెండింగులో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ బకాయిల చెల్లింపుపై కూడా బడ్జెట్ రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారని తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/payyavula-keshav-present-budget-in-apassembly-25-188173.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.