బలప్రదర్శనకు ససేమిరా.. బాలినేనికి జనసేనాని ఝలక్!

Publish Date:Sep 26, 2024

Advertisement

మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని రాజకీయ అడుగులు తడబడుతున్నాయి. ఆయన ఒకటి తలిస్తే మరోటి జరుగుతోంది. వైసీపీలో  ఓ మూడేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన బాలినేని.. అప్పట్లో జగన్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించిన సమయంలో  మంత్రి పదవి కోల్పోయారు. అప్పటి నుంచీ ఆయన జగన్ తో టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుతూ వస్తున్నారు. అలకలు, అసంతృప్తులతో జగన్ కు చెవిలో జోరీగలా, చెప్పులో రాయిలా మారారు.

అయితే జగన్ అధికారం కోల్పోయే వరకూ వైసీపీతో, జగన్ తో తన బంధం తెగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ఎప్పుడూ కూడా ఆయన తెగే వరకూ లాగలేదు. జగన్ నుంచి చిన్న పాటి పిలుపుకు, బుజ్జగింపులకు మెత్తబడిపోయారు. అయితే జగన్ అధికారం కోల్పోయాకా.. ఇంకా ఎందుకు అనుకు న్నారేమో వైసీపీకి రాజీనామా చేసేసి జనసేన గూటికి చేరడానికి రెడీ అయిపోయారు. అయితే ఒంగోలులో తెలుగుదేశం, జనసేన శ్రేణులు ఆయన చేరికను తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా కూడా జనసేనాని బాలినేని చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ఆయన గురువారం (సెప్టెంబర్26)న జనసేన తీర్ధం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో అట్టహాసంగా, మందీ మార్బలంతో పెద్ద ఎత్తున బలప్రదర్శనతో ఆయన జనసేన తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. అయితే ఇక్కడే పవన్ కల్యాణ్ ఆయనకు ఊహించని ఝలక్ ఇచ్చారు.

బాలినేని బలప్రదర్శనకు ఆయన అంగీకరించలేదు. మంది మార్బలంతో, అనుచరగణంలో జనసేనలో చేరాలన్న బాలినేని ఆశలను పవన్ కల్యాణ్ మొగ్గలోనే తుంచేశారు. బాలినేని చేరిక సందర్భంగా ర్యాలీకి కూడా జనసేన అధిష్ఠానం అనుమతించలేదు. దీంతో తాను జనసేనలో చేరేది లేదంటూ అలగడానికి ప్రయత్నించినా.. జనసేన అధినేత స్పందించలేదు.

దీంతో గత్యంతరం లేక ఒంటరిగానే అంటే ఒక్కడుగానే పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు బాలినేని.  చేరాలనుకుంటే ఒక్కడివే మంగళగిరి వచ్చి జనసేన కండువా కప్పుకో.. అంతే కానీ ఒంగోలులో సభ, భారీ ర్యాలీ అంటే కుదరదని జనసేన అధినేత కుండబద్దలు కొట్టినట్లు బాలినేనికి చెప్పేశారని తెలుస్తోంది.  

By
en-us Political News

  
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.