వంగలపూడి అనితపై పవన్ ప్రశంసల వర్షం

Publish Date:May 1, 2025

Advertisement

సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం కోసం క్యూలో నిలుచున్న సమయంలో గోడ కూలి ఏడుగురు మరణించిన విషాద ఘటన సందర్భంగా తక్షణం స్పందించి బాధితులకు అండగా నిలవడమే కాకుండా వారిలో మనోధైర్యాన్ని నింపి, ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా కల్పించిన హోంమంత్రి వంగలపూడి అనితపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. మంగళవారం (ఏప్రిల్ 29) అర్ధరాత్రి తరువాత కురిసిన బారీ వర్షానికి బుధవారం (ఏప్రిల్ 30) తెల్లవారు జామున గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించారు. మరి కొందరు గాయపడ్డారు. ఈ విషయం తెలిసిందే.  ఈ విషాదఘటన విషయం తెలియగానే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత క్షణం ఆలస్యం కాకుండా స్పందించారు. సంఘటన జరిగిన కొద్ది వ్యవధిలోనే ఆమె ఆ ప్రదేశానికి చేరుకున్నారు. ఎలాంటి జాప్యం లేకుండా ఒకే సమయంలో బాధితులకు అండగా నిలిచారు. ఇటు వారికి భరోసా కల్పిస్తూ, ప్రభుత్వం అండగా ఉంటుందన్న హామీ ఇస్తూనే అటు పరిస్థితిని సమీక్షించి సహాయ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.  ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా.. పరిస్థితిని కంట్రోల్ లోకి తీసుకున్నారు.  

సంఘటన జరిగిన వెంటనే వంగళపూడి అనిత పోలీసులు, ఎస్ఆర్డీఎఫ్ అధికారులను అప్రమత్తం చేసి సహాయ కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన మొదలయ్యాలా చూశారు.  అదే రోజు సాయంత్రం అంటే బుధవారం (ఏప్రిల్ 30)  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  సింహాచలం దుర్ఘటన సందర్శంగా హోంమంత్రి అనిత చేసిన సేవలను, బాధితులను ఓదార్చడంలో, వారిలో ధైర్యం నింపడంలో, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న నమ్మకం ప్రోది చేయడంలో ఆమె చూపిన చొరవకు, పడిన కష్టానికీ, విరామమెరుగకుండా అందించిన సేవలకు హ్యాట్సాఫ్ చెప్పారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో వంగళపూడి అనిత  నిబద్ధత, బాధితులకు అండగా నిలిచి, వారికి భరోసా కల్పించడంలో చూపిన చోరవ.. ప్రజలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ప్రతిష్ఠను ఇనుమడింప చేసేదిగా ఉందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి కుటుంబానికి ఆమె ఇచ్చిన మద్దతును ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

కొన్ని నెలల కిందట ఇదే పవన్  కల్యాణ్ రాష్ట్రంలో  శాంతిభద్రతల పరిస్థితి, ముఖ్యంగా మహిళలపై పెరుగుతున్న నేరాల విషయంలో హోంమంత్రి వంగలపూడి అనితపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. అలాగే తిరుపతిలో  వైకుంఠఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార ప్రవేశాల టికెట్ల కోసం తిరుపతిలో ఎదురు చూస్తున్న భక్తలు తొక్కిసలాటలో భక్తులు మరణించిన ఘటన సందర్భంలో కూడా ఆయన హోంమంత్రిత్వ శాఖ పని తీరును తప్పపట్టడమే కాకుండా అవసరమైతే హోంమంత్రిత్వ శాఖను తానే తీసుకుంటానని కూడా హెచ్చరించారు. అదే పవన్ కల్యాణ్ ఇప్పుడు ోంమంత్రి వంగలపూడి అనితపై ప్రశంసలు గుప్పించడం ద్వారా కూటమి పార్టీల మధ్య ఎటువంటి పొరపచ్చాలూ లేవనీ,  కూటమి ఐక్యంగానే ఉందనీ చాటడమే కాకుండా తన ప్రశంసల ద్వారా వంగళపూడి అనితలో కొత్త ఉత్సాహాన్నీ, స్ఫూర్తినీ నింపారు. పవన్ ప్రశంసలపై స్పందించిన అనిత కూడా ఇదే విషయాన్ని తెలిపారు. హోంమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసలు తనకు మరింత చురుకుగా, చొరవగా పని చేయడానికి స్ఫూర్తిని ఇచ్చాయన్నారు. 

By
en-us Political News

  
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.