జనసేనాని పవన్ రాజకీయ దారంతా చీకటేనా?..

Publish Date:Jul 5, 2022

Advertisement

ఇల్లేమొ దూరం..దారంతా చీకటి....రోడ్డంతా గతుకులు... 2019 ఎన్నికలకు ముందు జనసేనాని పవన్ కల్యాణ్ తరచుగా ఈ డైలాగ్ చెప్పేవారు. ఆ డైలాగ్ తన రాజకీయ ప్రస్థానం సుదీర్ఘంగా సాగాల్సి ఉందన్న అర్ధంతో చెప్పినది.  అప్పట్లో అది చాలా పాపులర్ అయ్యింది. రాజకీయాలలో ప్రశ్నించడానికి,  పిడికిలి బిగించి ప్రశ్నించేందుకు నేనున్నాను అంటూ ఒక బలమైన శక్తిగా రాజకీయ ప్రవేశం చేసిన పవన్ కల్యాణ్.. ఆ ప్రస్థానంలో గమ్యం లేని బాటసారిగా మారిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

సినిమాల ద్వారా పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న ఆయన రాజకీయ నేతగా ప్రజాభిమానం పొందేందుకు ప్రశ్నించడం ఒక్కటే సరిపోదనీ, ఆ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలనీ, లేదా తానే స్వయంగా సమాధానం కావాలని తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. తన రాజకీయ లక్ష్యం ఏమిటి? పార్టీని ఏ దిశగా నడిపించదలచుకున్నారు అన్న విషయంలో పవన్ లో ఇప్పటికీ స్పష్టత కానరావడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

పాచి పోయిపోయిన లడ్లు అంటూ 2019 ఎన్నికల ముందు బీజేపీపై ఘాటు విమర్శలు సంధించిన పవన్ కల్యాణ్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ బీజేపీతోనే జట్టు కట్టడాన్ని ఆయన ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నిస్తున్నారు.ఏపీలో బీజేపీ మిత్రపక్షంగా పవన్ కు జరిగిన మేలు ఏమీ లేకున్నా సినిమాలలో హీరోగా ప్రశంసలందుకున్న ఆయన బీజేపీ మిత్రుడిగా మాత్రం కమేడియన్ స్థాయికి రాజకీయాలలో పరిమితమయ్యారని అంటున్నారు.

2014 ఎన్నికలలో తెలుగుదేశం, బీజేపీలకు మద్దతుగా నిలిచిన పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల సమయానికి ఒంటరి పోరుకే మద్దతు మొగ్గు చూపారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఆయన నిర్ణయం వైసీపీకి నెత్తిన పాలు పొసింది. ఆ పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టింది. ఆ తరువాత మూడేళ్లూ పవన్ కల్యాణ్ బీజేపీతో మిత్రపక్షంగా ముందుకు సాగారు. 2024 ఎన్నికలలో ప్రభుత్వ ఓటును చీలనివ్వనని ప్రకటించి రాష్ట్రంలో ఎన్నికల పొత్తులకు తెరతీశారు. అయితే ఆ తరువాత కొద్ది రోజులకే.. ఇంత కాలం ఇతర పార్టీలను భుజాన మోశాను ఈ సారి ఆ పార్టీలు తనను భుజాన మోయాలంటూ తన రాజకీయ ఆకాంక్ష ఏమిటన్నది చాటారు.

అయితే అంతకు ముందు మూడేళ్ల పాటు బలమైన తన ఇమేజ్ ను, క్యాడర్ ను కేంద్రంలో అధికారంలో ఉన్నదన్న ఒకే ఒక కారణంతో కమలం పార్టీకి దాసోహం చేశారు. జాతీయ స్థాయి పార్టీ అయిన బీజేపీ ప్రాంతీయ పార్టీలతో మైత్రికి సుముఖత వ్యక్తం చేసేది పాము కప్పను మింగినట్ల ఆ జాతీయ పార్టీలను ఆక్రమించడానికే తప్ప వాటి అభివృద్ధికి దోహదపడేందుకు కాదన్న వాస్తవాన్ని గ్రహించడంలో పవన్ విఫలం అయ్యారు. 2109 ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించిన ఆ పార్టీకి కమలం పార్టీ ఎందుకు ప్రాధాన్యత ఇస్తుందన్న విషయాన్ని గ్రహించలేకపోయారు. సరే ఎప్పుడైతే ఆయన బీజేపీ- జనసేన కూటమి సీఎం అభ్యర్థిగా తనను తాను ప్రకటించుకున్నారో అప్పుడే బీజేపీ ఆయనను దూరం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

దీంతో ఇప్పుడు గతంలో తాను చేసినది రాజకీయ తప్పిదమని బయటకు చెప్పలేక, లోపల దాచుకోలేక మింగలేక, కక్కలేక సతమతమౌతున్నారు. పవన్ రాజకీయ నిర్ణయాలు స్థిరంగా ఉండవని ఆయనపై తొలి నుంచీ ఒక ముద్ర ఉంది. ఇన్నేళ్ల తరువాత అంటే ఆయన జనసేన పార్టీని స్థాపించిన ఇంత కాలం తరువాత కూడా అది అలాగే కొనసాగుతోంది.

అందుకు తగ్గట్టే ఆయన ప్రసంగాలూ ఉంటున్నాయి. ముఖ్యమంత్రి కావడం తన లక్ష్యం కాదని చెబుతూనే జనం కోరుకుంటే అవుతాను అంటారాయన.  ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగి జనసేన అధికారం చేజిక్కించుకునేంత సీన్ లేదని గ్రహించడం వల్లనే తాజాగా పలు సందర్భాలలో ఓట్ల కోసం పుట్టిన పార్టీ జనసేన కాదు అని ఆయనే చెబుతుంటే ఎవరు మాత్రం ఆయన పార్టీకి ఓట్లు వేయాలనుకుంటారు. ప్రశ్నిస్తా, సమస్యల పరిష్కారానికి పాటు పడతా అంటే రాజకీయ పార్టీ కాకుండా ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఉండాల్సింది అని ఆయన పార్టీలో క్రియాశీలంగా తిరుగుతున్న కార్యకర్తలే ఇప్పుడు ఆయనను నిందిస్తున్నారు.

By
en-us Political News

  
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.