కుటుంబాలను చీల్చే వ్యక్తిని కాను తల్లీ.. ముద్రగడ కుమార్తెతో పవన్ కల్యాణ్

Publish Date:May 6, 2024

Advertisement

జనసేనాని పవన్ కల్యాణ్ కు పిఠాపురంలో విజయం  నల్లేరు మీద బండి నడకే అని పరిశీలకులు నియోజకవర్గ పరిస్థితులను ఉటంకిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. మరో వైపు పవన్ కల్యాణ్ ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ దాడులకు పాల్పడుతూ తన పరపతిని మరింత దిగజార్చుకుంటోంది. మెగా హీరో సాయి ధర్మ తేజపై పిఠాపురంలో జరిగిన దాడి పట్ల ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

సరే ఇక ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి తండ్రితో విభేదించి తన మద్దతు పవన్ కల్యాణ్ కే అని ప్రకటించడం, ముద్రగడ తన కుమార్తె తన ప్రాపర్టీ కాదు అంటూ వ్యాఖ్యనించడంతో ముద్రగడ తన పరువునే కాకుండా పార్టీ ప్రతిష్టను కూడా మంటగలిపేశారు. తాజాగా పవన్ పోలింగ్ పూర్తి కాకుండానే ప్రజల హృదయాలను గెలిచేసుకున్నారు. తన సంస్కారంతో, తన నైతిక విలువలతో నియోజకవర్గ ప్రజలను కదిలించారు. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. ముద్రగడ పద్మనాభం కుమార్తె.. తండ్రితో విభేదించి తన మద్దతు పవన్ కల్యాణ్ కే అని ప్రకటించి ఊరుకోకుండా, తన భర్తతో కలిసి పవన్ కల్యాణ్ విజయం కోసం కృషి చేస్తానంటూ పవన్ కల్యాణ్ ను కలిశారు. పవన్ కోసం ప్రచారం చేస్తానని ఆయనకు చెప్పారు.  అయితే  పవన్ కల్యాణ్ సున్నితంగా తిరస్కరించారు. తాను కుటుంబాలను కలిపే వ్యక్తినే కానీ, విడదీసే వాడిని కానని ముద్రగడ కుమార్తె క్రాంతికి విస్పష్టంగా కలిశారు. ఆమెను ఇప్పుడు జనసేనలోకి ఆహ్వానించలేనని సున్నితంగానైనా చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల తరువాత మీ ఇంటికి వచ్చి మీ తండ్రిగారి సమక్షం మిమ్మల్ని జనసేనలోకి ఆహ్వానిస్తానని పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు ఆయన పాటిస్తున్న నైతిక విలువలకు అద్దం పట్టాయి. 

తన ఓటమే లక్ష్యం అంటూ రంగంలోకి దిగిన ముద్రగడ పద్మనాభం కు తేరుకోలేని దెబ్బ కొట్టే విధంగా ఆయన కుమార్తె క్రాంతికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి ఉండొచ్చు. అయితే జనసేనాని ఆ ఆప్షన్ ను ఎంచుకోలేదు. తాను కుటుంబాలను చీల్చే వ్యక్తిని కానంటూ సున్నితంగా క్రాంతి జనసేన ప్రవేశాన్నినిరాకరించారు. అంతే కాదు ముద్రగడ పద్మనాభం సమక్షంలోనే ఎన్నికల తరువాత మిమ్మల్ని పార్టీలోని ఆహ్వానిస్తానంటూ చెప్పి.. తనపై అడ్డగోలు విమర్శలు చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి కూడా గౌరవం ఇచ్చి ముద్రగడ స్థాయిని అందరికీ అర్ధమయ్యేలా ఎత్తి చూపారు. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంతో పోలిస్తే ముద్రగడ స్థాయి పిపీలకం కంటే తక్కువ అని జనం భావించేలా చేశారు.  

By
en-us Political News

  
భూటాన్ రాజధాని ధింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిష్ట్ టూర్ ఆపరేటర్స్ కార్యాలయాన్ని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ప్రారంభించినట్టు ఏబీటీవో ప్రధాన కార్యదర్శి డాక్టర్ కౌలేష్ కుమార్ తెలిపారు.
గ‌తం కంటే ఎక్కువ స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామంటూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల ఐప్యాక్ బృందంతో స‌మావేశ‌మైన స‌మ‌యంలో ధీమా వ్య‌క్తం చేశారు. వైసీపీ ముఖ్య నేత‌లు సైతం 150 నుంచి 160 స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామ‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు.
రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడలు కావ‌డానికి పెద్ద ఎక్కువ కాలం ప‌ట్ట‌దు. అధికారంలో ఉన్నంత సేపు ఈగ‌ల గుంపులా పార్టీ ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసే నేత‌లు.. అధికారంలో కోల్పోయిన త‌రువాత వారి వైపు కూడా చూడ‌రు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-17
ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి సాధారణ స్థితి పునరుద్ధరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించేశారు.
న్నికలలో విజయం సాధించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలే కొంత కాదు.. చాలా బాధను కలిగిస్తున్నాయి. 
పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
సర్వేలు, ఫలితాలు కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో. ఆయన అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది.
పాపం ఈయనేమో జగన్ పేరు చెబితే ఆనందంతో గుడ్డలు చించుకుంటూ వుంటాడు. వాళ్ళేమో ఈయన్ని కూరలో కరేపాకుని తీసేసినట్టుగా తీసి అవతల పారేస్తూ వుంటారు. కేసీఆర్‌కి ఇలాగే అవ్వాలిలే!!
పల్నాడులో ఎన్నికల హింస పోలింగ్ ముగిసిపోయినా కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 2019 ఎన్నికలలో పల్నాడులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నరసరావు పార్లమెంటు స్థానంతో పాటు మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరి పేట అసెంబ్లీ స్థానాలలో విజయం కేతనం ఎగురవేసింది.
 బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందని, విశాఖపట్టణానికి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
సిట్ చీఫ్‌గా నియమితులైన వినీత్ బ్రిజ్‌లాల్‌ని అర్జెంటుగా తప్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకయ్యా అంటే, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం ఎవరిదో పెళ్ళి జరిగితే, దానికి వినీత్ బ్రిజ్‌లాల్, చంద్రబాబు హాజరయ్యారట.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.