జనసైనికులపై పవన్ కల్యాణ్ ఫైర్.. ఎందుకంటే?

Publish Date:Jul 10, 2026

Advertisement

జనసేన నాయకులు, క్యాడర్ పొలిటికల్ గా యాక్టివ్ గా ఉండటం లేదా. ప్రభుత్వంలో భాగస్వామి పార్టీ అయినప్పటికీ,  అన్ని విషయాలలోనూ అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారా? అంటే తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చిన సూచనలు, వ్యక్తంచేసిన ఆగ్రహం చూస్తే ఔనన్న సమాధానమే వస్తున్నది. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిత్రపక్షాలు, అధికారంలో  భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీల   శైలిపై  ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి ప్రభుత్వంలో తమ పార్టీ తరఫున మంత్రులుగా ఉన్నవారికీ ఓ రేంజ్ లో క్లాస్ పీకారు.  

ప్రత్యర్థులు చేసే ఆరోపణలను  దీటుగా తిప్పికొట్టాలని, సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారాన్ని గట్టిగా ఖండించాలనీ చాలా సీరియస్ గా పార్టీ లీడర్, క్యాడర్ కు ఆదేశాలు ఇచ్చారు.  గత రెండు మూడు నెలలుగా పవన్ కల్యాణ్ పలు సందర్భాలలో ఇదే విషయాన్ని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చెప్పారు. అయినా పార్టీ  నేతల నుంచి, శ్రేణుల నుంచీ పెద్దగా స్పందన లేకపోవడంతో ఈ సారి మరింత సీరియస్ గా ఇక యాక్టివ్ గా ఉండి తీరాలని ఒక విధంగా విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు.  

పార్టీలో ఎవరో ఒకరిద్దు మాత్రమే..అది కూడా అడపాదడపా మాత్రమే స్పందిస్తున్నారని పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.    ఇటీవల  రాష్ట్ర రాజకీయాల్లో  ప్రశ్న రావణ్  అరెస్టు, అతడిపై,   ఉపా చట్టం కింద కేసుఅంశాలు పెను సంచలనంగా మారాయి. ఈ విషయంలో  వైసీపీ సామాజిక మాధ్యమ విభాగాలు పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేస్తున్నాయి.   అయినా జనసేన నుంచి పెద్దగా స్పందన కనిపించడం లేదు. వైసీపీ దుష్ప్రచారాన్నీ, విమర్శల దాడిని తిప్పికొట్టే ప్రయత్నాలేవీ జనసేన నుంచి జరగడం లేదు. దీంతో ఏకపక్షంగా వైసీపీ చేస్తున్న ప్రచారం జనంలోకి బలంగా వెళ్లి, అదే వాస్తవమన్న భ్రమలో ప్రజలు పడే ప్రమాదం ఉంది. దీంతో జనసేనాని తీవ్ర అసహనానికి లోనై పార్టీ లీడర్లకు గట్టిగా క్లాస్ పీకారంటున్నారు.  

ఈ విషయంలో జనసేనాని.. పార్టీ లీడర్లు క్యాడర్లకు..  తెలుగుదేశం పార్టీని చూసైనా నేర్చుకోండంటూ ఒకింత ఘాటుగానే మందలించారని పార్టీ శ్రేణుల ద్వారా తెలుస్తోంది.  తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై ప్రత్యర్థులు చిన్న విమర్శ చేసినా..రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచీ తెలుగుతమ్ముళ్లంతా ఏకతాటిపైకి వచ్చి కౌంటర్లు ఇవ్వడాన్ని జనసేనాని తన పార్టీ వారికి ఉదహరించినట్లు చెబుతున్నారు. ఇక నుంచి యాక్టివ్ అయి తీరాలని జనసేనాని ఈ సందర్భంగా పార్టీ నేతలకు స్పష్టమైన ఆదేశం ఇచ్చినట్లు చెబుతున్నారు. 

Pawan Kalyan, Janasena leaders, TDP leaders, Chandrababu Naidu, AP Politics

By
en-us Political News

  
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు అమరావతి ప్రతిపాదన తెచ్చినప్పుడు దొనకొండ పేరును గట్టిగా వినిపించాలని జగన్‌కు సీనియర్ నేత మైసూరా రెడ్డి సహా పలువురు సూచించారు. కానీ.. జగన్ అసెంబ్లీలో ఆ విషయాన్ని మర్చిపోయి విజయవాడ చుట్టుపక్కల రాజధాని పెట్టాలంటూ మాట్లాడారని, ఆ తర్వాత మాట మార్చలేక కాలయాపన చేశారని మధుసూదన్ రెడ్డి చెప్పారు.
రాయలసీమలో వైసీపీ  కీలక నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్  ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయిన వారి చూపు ఇప్పుడు జనసేనపై ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఈ క్రమంలోనే వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని, త్వరలోనే గ్రేటర్ రాయలసీమలో వైసీపీ  ఖాళీ  అయిపోయినా ఆశ్చర్యం లేదనీ అంటున్నారు. 
ఒకవేళ కోర్టులో ఇవి ఎడిటెడ్ వెర్షన్లు అని రుజువైతే.. న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అవుతుందని హెచ్చరించారు.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్.. తాను గ్రౌండ్ రియాలటీని గత ఎన్నికల సమయంలో చెప్పినా నమ్మలేదనీ, తాను 2014 ఎన్నికల్లోనూ, మొన్నటి 2024 ఎన్నికల్లోనూ కూడా ఆరు నెలల ముందే చంద్రబాబు, లోకేష్‌లకు సీట్ల మార్జిన్ గురించి కచ్చితమైన అంచనాలు చెప్పినా వినలేదని.. తీరా చూస్తే క్షేత్రస్థాయిలో తాను చెప్పిన ఫలితాలే వచ్చాయని ఉదహరించారు.
తాజాగా గుడివాడలో కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై.. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో కొత్త రాజకీయ కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.